ETV Bharat / business

Damaged Currency Exchange : మీ దగ్గర చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా?.. సింపుల్​గా మార్చుకోండిలా!

Damaged Currency Exchange In Telugu : డిజిటల్ లావాదేవీల వల్ల నోట్ల వాడకం బాగా తగ్గింది. నోట్ల వాడకం తగ్గినా కూడా, అడపా దడపా చిరిగిన నోట్లు మన కంటపడుతూనే ఉంటాయి . అయితే వాటిని ఎలా మార్చుకోవాలో చాలా మందికి తెలీదు. అందుకే పాడైపోయిన, చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 3:50 PM IST

torn currency notes exchange rules in india
Damaged Currency Exchange

Damaged Currency Exchange : నగదు లావాదేవీలు జరిపినప్పుడు, చాలా మటుకు పాడైపోయిన లేదా చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నోట్లతో ఏదైనా కొనాలని చూస్తే, దుకాణదారులు ఆ పాడైపోయిన కరెన్సీ నోట్లని తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు.. చిరిగిన నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇవ్వడానికి కమీషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇలా ఎవరికీ కమీషన్​ చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి.. పాత లేదా చిరిగిన లేదా పాడైపోయిన నోట్లు ఇచ్చి, కొత్త నోట్లు పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్​కు వెళ్ళి, మీ పాత లేదా పాడైన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఏ బ్యాంక్ కూడా నోట్ల మార్పిడిని నిరాకరించడానికి వీలు లేదు. కరెన్సీ నోట్ల బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలని రూపొందించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నోట్ల మార్పిడికి ఉన్న నియమాలు ఏమిటి?
Torn Currency Exchange : ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకసారికి కేవలం 20 నోట్లు మాత్రమే మార్చుకోగలరు. అంటే, మీరు 20 కంటే ఎక్కువ నోట్లని ఒకేసారి మార్చుకోలేరు. అంతేకాకుండా ఆర్​బీఐ చిరిగిన నోట్ల విలువ మీద కూడా ఒక పరిమితి విధించింది. మీరు ఒకేసారి 20 నోట్లను మార్పిడి చేసినా.. దాని గరిష్ఠ విలువ రూ.5000 మించకూడదు. సాధారణంగా పరిమితిలోపు పాడైన కరెన్సీ నోట్లను బ్యాంకులు స్వీకరించి.. ఆ విలువకి సరిపడా కొత్త నోట్లని వెంటనే ఇస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ నోట్లు ఉంటే.. బ్యాంక్ వెంటనే మార్పిడి చేయదు. ముందుగా మీ పాత నోట్లని స్వీకరించి.. తరువాత ఆ డబ్బుని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.

భద్రతా గుర్తులు తప్పక ఉండాలి!
Indian Currency Security Symbols : బ్యాంకులు.. సీరియల్ నంబర్స్, మహాత్మా గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం లాంటి భద్రతా గుర్తులు (సెక్యూరిటీ సైన్) ఉన్న కరెన్సీ నోట్లను మాత్రమే మార్పిడి చేస్తాయి. ఒకవేళ, మీ నోట్లపై ఈ భద్రతా గుర్తులు లేకపోతే, బ్యాంకులు వాటిని తీసుకోవు. మీరు కచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. బ్యాంకులు పాడైన నోట్లని మార్చడానికి ఎలాంటి కమీషన్ తీసుకోవు. మరో ముఖ్య విషయం.. మీరు ఎక్కడైతే మీ పాత కరెన్సీ నోట్లు మార్చాలని అనుకుంటున్నారో.. ఆ బ్రాంచ్​లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు.

పూర్తిగా చిరిగిపోయిన నోట్లను కూడా మారుస్తారా?
Torn Currency Note Damage Percentage in India : ఒకవేళ మీరు బాగా పాడైనా, బాగా కట్ అయినా, లేదా బాగా చిరిగి పోయిన కరెన్సీ నోట్లను బ్యాంకుకు ఇస్తే.. బ్యాంకులు ఆ కరెన్సీ నోట్ల విలువకు సరిపడే డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర చిరిగిన రూ.200 నోటు ఉందనుకోండి. ఆ నోటులో 78 చదరపు సెం.మీ సరిగా ఉంటే, మీకు మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. ఒకవేళ 39 చదరపు సెం.మీ మేర ఆ కరెన్సీ నోటు పాడైతే, మీరు కేవలం సగం డబ్బు మాత్రమే పొందుతారు. ఇదే సూత్రం ఇతర కరెన్సీ నోట్లకు కూడా వర్తిస్తుంది.

Damaged Currency Exchange : నగదు లావాదేవీలు జరిపినప్పుడు, చాలా మటుకు పాడైపోయిన లేదా చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఆ నోట్లతో ఏదైనా కొనాలని చూస్తే, దుకాణదారులు ఆ పాడైపోయిన కరెన్సీ నోట్లని తీసుకోవడానికి ఒప్పుకోరు. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు.. చిరిగిన నోట్లకు బదులుగా కొత్త నోట్లు ఇవ్వడానికి కమీషన్ తీసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇలా ఎవరికీ కమీషన్​ చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా బ్యాంకుకు వెళ్లి.. పాత లేదా చిరిగిన లేదా పాడైపోయిన నోట్లు ఇచ్చి, కొత్త నోట్లు పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏదైనా పబ్లిక్ లేదా ప్రైవేట్ బ్యాంక్​కు వెళ్ళి, మీ పాత లేదా పాడైన కరెన్సీ నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఏ బ్యాంక్ కూడా నోట్ల మార్పిడిని నిరాకరించడానికి వీలు లేదు. కరెన్సీ నోట్ల బదిలీ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాలని రూపొందించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నోట్ల మార్పిడికి ఉన్న నియమాలు ఏమిటి?
Torn Currency Exchange : ఆర్​బీఐ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి ఒకసారికి కేవలం 20 నోట్లు మాత్రమే మార్చుకోగలరు. అంటే, మీరు 20 కంటే ఎక్కువ నోట్లని ఒకేసారి మార్చుకోలేరు. అంతేకాకుండా ఆర్​బీఐ చిరిగిన నోట్ల విలువ మీద కూడా ఒక పరిమితి విధించింది. మీరు ఒకేసారి 20 నోట్లను మార్పిడి చేసినా.. దాని గరిష్ఠ విలువ రూ.5000 మించకూడదు. సాధారణంగా పరిమితిలోపు పాడైన కరెన్సీ నోట్లను బ్యాంకులు స్వీకరించి.. ఆ విలువకి సరిపడా కొత్త నోట్లని వెంటనే ఇస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ నోట్లు ఉంటే.. బ్యాంక్ వెంటనే మార్పిడి చేయదు. ముందుగా మీ పాత నోట్లని స్వీకరించి.. తరువాత ఆ డబ్బుని మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది.

భద్రతా గుర్తులు తప్పక ఉండాలి!
Indian Currency Security Symbols : బ్యాంకులు.. సీరియల్ నంబర్స్, మహాత్మా గాంధీ వాటర్ మార్క్, గవర్నర్ సంతకం లాంటి భద్రతా గుర్తులు (సెక్యూరిటీ సైన్) ఉన్న కరెన్సీ నోట్లను మాత్రమే మార్పిడి చేస్తాయి. ఒకవేళ, మీ నోట్లపై ఈ భద్రతా గుర్తులు లేకపోతే, బ్యాంకులు వాటిని తీసుకోవు. మీరు కచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి.. బ్యాంకులు పాడైన నోట్లని మార్చడానికి ఎలాంటి కమీషన్ తీసుకోవు. మరో ముఖ్య విషయం.. మీరు ఎక్కడైతే మీ పాత కరెన్సీ నోట్లు మార్చాలని అనుకుంటున్నారో.. ఆ బ్రాంచ్​లో మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం కూడా లేదు.

పూర్తిగా చిరిగిపోయిన నోట్లను కూడా మారుస్తారా?
Torn Currency Note Damage Percentage in India : ఒకవేళ మీరు బాగా పాడైనా, బాగా కట్ అయినా, లేదా బాగా చిరిగి పోయిన కరెన్సీ నోట్లను బ్యాంకుకు ఇస్తే.. బ్యాంకులు ఆ కరెన్సీ నోట్ల విలువకు సరిపడే డబ్బును తిరిగి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర చిరిగిన రూ.200 నోటు ఉందనుకోండి. ఆ నోటులో 78 చదరపు సెం.మీ సరిగా ఉంటే, మీకు మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. ఒకవేళ 39 చదరపు సెం.మీ మేర ఆ కరెన్సీ నోటు పాడైతే, మీరు కేవలం సగం డబ్బు మాత్రమే పొందుతారు. ఇదే సూత్రం ఇతర కరెన్సీ నోట్లకు కూడా వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.