గతవారం చివర్లో జీవనకాల గరిష్ఠాన్ని తాకి.. చివరి క్షణాల్లో నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు నేడు ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-సెన్సెక్స్ 4 పాయింట్ల లాభంతో 40,327 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- నిఫ్టీ 5 పాయింట్ల క్షీణతతో 11, 902 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివి..
ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్స్, టాటా మోటర్స్, ఎం అండ్ ఎం, ఐఓసీ సుమారు 1 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.
సన్ఫార్మా, గ్రసిమ్, భారతీ ఎయిర్టెల్, సిప్లా, హెచ్సీఎల్ టెక్ సుమారు 1.5 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.
రూపాయి..
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే.. 8 పైసలు నష్టపోయింది. ప్రస్తుతం రూ.71.34 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చూడండి: ద్రవ్యోల్బణం గణాంకాలే ఈ వారం మార్కెట్లకు కీలకం