ETV Bharat / business

చైనా ఇచ్చిన​ జోష్- సెన్సెక్స్​ 1,028 పాయింట్లు ప్లస్​

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1,028 పాయింట్లు పెరిగి 29,468 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 317 పాయింట్ల వృద్ధితో 8,598 వద్దకు చేరింది. అంతర్జాతీయ సానుకూలతలే నేటి లాభాలకు ప్రధాన కారణం.

author img

By

Published : Mar 31, 2020, 3:44 PM IST

Sensex 1,028 points plus
చైనా ఇచ్చిన​ జోష్- సెన్సెక్స్​ 1,028 పాయింట్లు ప్లస్​

కరోనా సంక్షోభంతో వరుస పతనాలు చవిచూసిన స్టాక్​ మార్కెట్లు నేడు గణనీయంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 1,028 పాయింట్లు పెరిగి 29,468 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 317 పాయింట్ల వృద్ధితో 8,598 వద్ద ముగిసింది.

లాభాలకు కారణాలివే...

దేశంలో కరోనా సంక్షోభం తీవ్రమవడం, ఆర్థిక వ్యవస్థలో మందగమనం మరింత పెరగడం వంటి ప్రతికూలతలు ఉన్నా.... తగ్గిన ధరల వద్ద వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపారు.

2 నెలల లాక్​డౌన్​ తర్వాత చైనాలో పరిస్థితులు చక్కబడి, పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ప్రారంభం కావడం... సానుకూల ప్రభావం చూపింది.

ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం మదుపర్ల సెంటిమెంట్​ను బలపరిచింది.

ఇండ్రాడే సాగిందిలా...

ఉదయం 29 వేల 295 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో 28 వేల 667 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. తర్వాత పుంజుకుని 29 వేల 771 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.

లాభనష్టాల్లో...

రిలయన్స్ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఇన్​ఫోసిస్​, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్, టైటాన్ లాభపడ్డాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్, బజాజ్ ఆటో, మారుతి నష్టపోయాయి.

కరోనా సంక్షోభంతో వరుస పతనాలు చవిచూసిన స్టాక్​ మార్కెట్లు నేడు గణనీయంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 1,028 పాయింట్లు పెరిగి 29,468 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 317 పాయింట్ల వృద్ధితో 8,598 వద్ద ముగిసింది.

లాభాలకు కారణాలివే...

దేశంలో కరోనా సంక్షోభం తీవ్రమవడం, ఆర్థిక వ్యవస్థలో మందగమనం మరింత పెరగడం వంటి ప్రతికూలతలు ఉన్నా.... తగ్గిన ధరల వద్ద వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గుచూపారు.

2 నెలల లాక్​డౌన్​ తర్వాత చైనాలో పరిస్థితులు చక్కబడి, పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి ప్రారంభం కావడం... సానుకూల ప్రభావం చూపింది.

ఇతర ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం మదుపర్ల సెంటిమెంట్​ను బలపరిచింది.

ఇండ్రాడే సాగిందిలా...

ఉదయం 29 వేల 295 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్... మొదట్లో 28 వేల 667 పాయింట్ల కనిష్ఠస్థాయిని నమోదు చేసింది. తర్వాత పుంజుకుని 29 వేల 771 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది.

లాభనష్టాల్లో...

రిలయన్స్ ఇండస్ట్రీస్​, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, ఇన్​ఫోసిస్​, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్​ ఎం, ఓఎన్​జీసీ, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్, టైటాన్ లాభపడ్డాయి.

ఇండస్​ఇండ్​ బ్యాంక్, బజాజ్​ ఫినాన్స్, బజాజ్ ఆటో, మారుతి నష్టపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.