ETV Bharat / business

స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు- సెన్సెక్స్ 529+ - స్టాక్ మార్కెట్లు

stock markets
లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 300 పాయింట్లు ప్లస్
author img

By

Published : Dec 24, 2020, 9:34 AM IST

Updated : Dec 24, 2020, 3:49 PM IST

15:45 December 24

మూడో రోజూ లాభాలు..

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 529 పాయింట్లు బలపడి 46,973 వద్దకు చేరింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 13,749 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూలతలు, ఫార్మా, బ్యాంకింగ్ ఇతర హెవీ వెయిట్​ షేర్ల దన్ను లాభాలకు ప్రధాన కారణం.

  • సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
  • ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

15:02 December 24

13,750పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్ల లాభంతో 47,002 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 160 పాయింట్లు పెరిగి 13,757 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, డాక్టర్​ రెడ్డీస్, ఎం&ఎం, టెక్ మహీంద్ర, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

14:17 December 24

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం జంప్

స్టాక్ మార్కెట్​ సూచీలు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 470 పాయింట్లకుపైగా పెరిగి 46,916ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా వృద్ధితో 13,733 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:34 December 24

సెన్సెక్స్ 210 ప్లస్..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ ముందు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా వృద్ధితో 46,659 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పెరిగి 13,668 ట్రేడింగ్ సాగిస్తోంది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభంతో పోలిస్తే సూచీల జోరు కాస్త తగ్గింది.

ఐటీ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటుండటం లాభాల క్షీణతకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, టెక్ మహీంద్రా, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:12 December 24

లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 313 పాయింట్లు వృద్ధి చెంది.. 46,739 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రెండు షేర్లు మినహా సెన్సెక్స్​ 30లో అన్నీ లాభాల్లోనే పయనిస్తున్నాయి. లోహపు షేర్లు రాణిస్తున్నాయి. 

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాటలోనే పయనిస్తోంది. 83 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం 13,684 వద్ద కదలాడుతోంది.

15:45 December 24

మూడో రోజూ లాభాలు..

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 529 పాయింట్లు బలపడి 46,973 వద్దకు చేరింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 13,749 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ సానుకూలతలు, ఫార్మా, బ్యాంకింగ్ ఇతర హెవీ వెయిట్​ షేర్ల దన్ను లాభాలకు ప్రధాన కారణం.

  • సన్​ఫార్మా, యాక్సిస్​ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్​జీసీ, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలను గడించాయి.
  • ఇన్ఫోసిస్, ఇండస్​ఇండ్ బ్యాంక్, హెచ్​సీఎల్​టెక్, నెస్లే, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

15:02 December 24

13,750పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 560 పాయింట్ల లాభంతో 47,002 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 160 పాయింట్లు పెరిగి 13,757 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, డాక్టర్​ రెడ్డీస్, ఎం&ఎం, టెక్ మహీంద్ర, ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

14:17 December 24

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2 శాతం జంప్

స్టాక్ మార్కెట్​ సూచీలు భారీ లాభాల దిశగా కదులుతున్నాయి. సెన్సెక్స్ 470 పాయింట్లకుపైగా పెరిగి 46,916ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా వృద్ధితో 13,733 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లు భారీగా పుంజుకోవడం లాభాలకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

11:34 December 24

సెన్సెక్స్ 210 ప్లస్..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​ ముందు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా వృద్ధితో 46,659 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు పెరిగి 13,668 ట్రేడింగ్ సాగిస్తోంది. లాభాల స్వీకరణ కారణంగా ఆరంభంతో పోలిస్తే సూచీల జోరు కాస్త తగ్గింది.

ఐటీ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటుండటం లాభాల క్షీణతకు కారణంగా తెలుస్తోంది.

  • ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్​బీఐ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • ఇన్ఫోసిస్, నెస్లే, టెక్ మహీంద్రా, ఎం&ఎం, హెచ్​సీఎల్​టెక్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:12 December 24

లాభాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 313 పాయింట్లు వృద్ధి చెంది.. 46,739 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రెండు షేర్లు మినహా సెన్సెక్స్​ 30లో అన్నీ లాభాల్లోనే పయనిస్తున్నాయి. లోహపు షేర్లు రాణిస్తున్నాయి. 

జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ సైతం లాభాల బాటలోనే పయనిస్తోంది. 83 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం 13,684 వద్ద కదలాడుతోంది.

Last Updated : Dec 24, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.