ETV Bharat / business

మరోసారి కుప్పకూలిన అమెరికా మార్కెట్లు​.. ట్రేడింగ్​ నిలిపివేత

కరోనా భయాలు, ఫెడరల్​ రిజర్వు వడ్డీ రేట్ల కోతతో అమెరికా స్టాక్​ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఎస్​ అండ్​ పీ 8 శాతం, డౌజోన్స్​ 9.7 శాతం మేర నష్టపోవటం వల్ల తాత్కాలికంగా ట్రేడింగ్​ నిలిపేశారు. వారం రోజుల వ్యవధిలో ఇలా జరగటం ఇది మూడోసారి.

author img

By

Published : Mar 16, 2020, 8:38 PM IST

Updated : Mar 16, 2020, 9:42 PM IST

Dow Jones
మరోసారి నిలిచిపోయిన అమెరికా మార్కెట్లు

అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే ఎస్‌ అండ్‌ పీ 500 షేర్లు 8శాతం నష్టాల్లోకి జారుకోవడంతో మార్కెట్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల కోత కారణంగా మదుపర్లు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కరోనా మహమ్మారి భయాలు కూడా వెంటాడటం నష్టాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డౌజోన్స్​ భారీ పతనం..

అమెరికాలో ఉదయం 9.30 గంటలకు డౌజోన్స్ 9.7 శాతంతో 2,250 పాయింట్లు నష్టపోయింది. దాంతో ట్రేడింగ్​ను తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి మార్కెట్లు. ప్రస్తుతం 8 శాతంతో 1800కు పైగా పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 220 పాయింట్లు, నాస్‌డాక్‌ 482 పాయింట్లు నష్టపోవడం గమనార్హం.

అమెరికా స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలోనే ఎస్‌ అండ్‌ పీ 500 షేర్లు 8శాతం నష్టాల్లోకి జారుకోవడంతో మార్కెట్లను 15 నిమిషాల పాటు నిలిపివేశారు. వాల్‌స్ట్రీట్‌ మార్కెట్లు ఆరు రోజుల వ్యవధిలో ఇలా నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

యూఎస్‌ సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల కోత కారణంగా మదుపర్లు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కరోనా మహమ్మారి భయాలు కూడా వెంటాడటం నష్టాలకు కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డౌజోన్స్​ భారీ పతనం..

అమెరికాలో ఉదయం 9.30 గంటలకు డౌజోన్స్ 9.7 శాతంతో 2,250 పాయింట్లు నష్టపోయింది. దాంతో ట్రేడింగ్​ను తాత్కాలికంగా నిలిపేశారు. తిరిగి ప్రారంభమైనప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి మార్కెట్లు. ప్రస్తుతం 8 శాతంతో 1800కు పైగా పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు 220 పాయింట్లు, నాస్‌డాక్‌ 482 పాయింట్లు నష్టపోవడం గమనార్హం.

Last Updated : Mar 16, 2020, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.