ETV Bharat / business

మార్చి 31 డెడ్​లైన్​- కొత్త రూల్స్​ ఇవే - ఆదార్​ పాన్​ లేటెస్ట్ న్యూస్

మార్చి 31.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు. ఏప్రిల్​ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన పనులకు బుధవారమే తుది గడువు. ఈలోపు కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులేంటి? ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులు.. ధరలు పెరిగే వస్తువులు ఏవి? అనే వివరాలు మీకోసం.

New rules form April 1
ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
author img

By

Published : Mar 31, 2021, 8:31 AM IST

బుధవారంతో(మార్చి 31) 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తై.. గురువారం నుంచి (ఏప్రిల్​ 1) 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్న తరుణంలో.. ఆర్థికపరమైన అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవి ఏటంటే..

ఆధార్​ పాన్​ లింక్​ తప్పనిసరి..

ఆధార్​తో పాన్​ కార్డ్​ లింక్ చేసేందుకు మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. గడువు లోపు లింక్ చేసుకోకపోతే వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.

పన్ను ఆదా పెట్టుబడులకు చివరి తేదీ..

2020-21కి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు కూడా మార్చి31తోనే తుది గడువు. పన్ను చెల్లింపుల్లో రాయితీలు దక్కాలంటే ఈ లోపే మదుపు చేయాలి.

కొత్త ఐటీ రూల్స్​..

బడ్జెట్​ ప్రసంగంలో 2021-22కి సంబంధించి కొత్త ఆదాయపు పన్ను చెల్లింపు నిబంధనలను ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.

ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు..

ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్​ల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ, ఎంఐసీఆర్​ కోడ్​లూ మారనున్నాయి. వెంటనే చెక్​బుక్​లు, పాస్​బుక్​లు మార్చుకోవాలని బ్యాంకులు.. ఇప్పటికే వినియోగదారులకు సమాచారమిచ్చాయి.

ఆటో డెబిట్​కు ఆర్​బీఐ కొత్త రూల్స్..

ఆటో డెబిట్​కు సంబంధించి కొత్త రూల్స్​ తీసుకొచ్చింది ఆర్​బీఐ. ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఇకపై రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో ఆటో డెబిట్​ కావాలంటే.. ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి.

ధరలు పెరిగేవి.. తగ్గేవి..

2021-22 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పలు వస్తు, సేవల ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీవీలు, ఏసీలు వంటివి మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ, దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాల ధరలు కాస్త తగ్గనున్నాయి.

ఇదీ చదవండి:ఏప్రిల్​ 1నుంచి సరికొత్త మార్పులకు సిద్ధమవ్వండి

బుధవారంతో(మార్చి 31) 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తై.. గురువారం నుంచి (ఏప్రిల్​ 1) 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త బడ్జెట్ ప్రతిపాదనలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్న తరుణంలో.. ఆర్థికపరమైన అంశాల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆవి ఏటంటే..

ఆధార్​ పాన్​ లింక్​ తప్పనిసరి..

ఆధార్​తో పాన్​ కార్డ్​ లింక్ చేసేందుకు మార్చి 31ని చివరి తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. గడువు లోపు లింక్ చేసుకోకపోతే వారికి రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశముంది.

పన్ను ఆదా పెట్టుబడులకు చివరి తేదీ..

2020-21కి సంబంధించి పన్ను ఆదా పెట్టుబడులకు కూడా మార్చి31తోనే తుది గడువు. పన్ను చెల్లింపుల్లో రాయితీలు దక్కాలంటే ఈ లోపే మదుపు చేయాలి.

కొత్త ఐటీ రూల్స్​..

బడ్జెట్​ ప్రసంగంలో 2021-22కి సంబంధించి కొత్త ఆదాయపు పన్ను చెల్లింపు నిబంధనలను ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఇవి ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి.

ఆ బ్యాంకుల చెక్కులు చెల్లవు..

ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్​ల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ, ఎంఐసీఆర్​ కోడ్​లూ మారనున్నాయి. వెంటనే చెక్​బుక్​లు, పాస్​బుక్​లు మార్చుకోవాలని బ్యాంకులు.. ఇప్పటికే వినియోగదారులకు సమాచారమిచ్చాయి.

ఆటో డెబిట్​కు ఆర్​బీఐ కొత్త రూల్స్..

ఆటో డెబిట్​కు సంబంధించి కొత్త రూల్స్​ తీసుకొచ్చింది ఆర్​బీఐ. ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఇకపై రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో ఆటో డెబిట్​ కావాలంటే.. ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి.

ధరలు పెరిగేవి.. తగ్గేవి..

2021-22 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి పలు వస్తు, సేవల ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. టీవీలు, ఏసీలు వంటివి మరింత ప్రియం కానున్నాయి. వ్యవసాయ, దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాల ధరలు కాస్త తగ్గనున్నాయి.

ఇదీ చదవండి:ఏప్రిల్​ 1నుంచి సరికొత్త మార్పులకు సిద్ధమవ్వండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.