ETV Bharat / business

ఐటీఆర్ దాఖలు చేయలేదా? నేడే చివరి తేదీ..

జనవరి 10తో 2019-20 ఆర్థిక సంవత్సరానికి.. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలుకు గడువు ముగియనుంది. ఇంకా ఎవరైనా రిటర్ను దాఖలు చేయకుంటే వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేసుకోవాలని ఐటీ విభాగం గుర్తు చేసింది. ఇప్పటికే పలు మార్లు గడువు పెంచిన నేపథ్యంలో మరోసారి ఆ అవకాశం ఉండదని తెలుస్తోంది.

author img

By

Published : Jan 10, 2021, 1:41 PM IST

last date to file ITR
ఐటీఆర్​ దాఖలుకు చివరి తేదీ

2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు కీలక సూచన చేసింది ఐటీ విభాగం. ఆదివారంతో (జనవరి 10) ఇందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో తక్షణమే ఆ పనిని పూర్తి చేసుకోవడం మేలని సూచించింది. ఎలాంటి ఆలస్య రుసుములు బారిన పడకుండా గడువు లోపు రిటర్ను ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.

ఆడిటింగ్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకు రిటర్ను దాఖలు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశముంది.

నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని తొలుత అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచింది. గత నెల ఈ గడువును మరో పది రోజులు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుది. మళ్లీ గడువు పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇప్పటి వరకు దాఖలకైన రిటర్నులు..

జనవరి 10 మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 7,07,102 రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో చివరి గంటలోనే 2,03,687 రిటర్నులు వచ్చినట్లు వివరించింది.

ఇదీ చూడండి:రిటర్ను దాఖలు ఆలస్యమైతే ఇబ్బందులివే..

2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం) సంబంధించి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులకు కీలక సూచన చేసింది ఐటీ విభాగం. ఆదివారంతో (జనవరి 10) ఇందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో తక్షణమే ఆ పనిని పూర్తి చేసుకోవడం మేలని సూచించింది. ఎలాంటి ఆలస్య రుసుములు బారిన పడకుండా గడువు లోపు రిటర్ను ప్రక్రియ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.

ఆడిటింగ్ అవసరమైన పన్ను చెల్లింపుదారులకు రిటర్ను దాఖలు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశముంది.

నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని తొలుత అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పెంచింది. గత నెల ఈ గడువును మరో పది రోజులు పొడగిస్తూ.. నిర్ణయం తీసుకుది. మళ్లీ గడువు పొడిగించే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఇప్పటి వరకు దాఖలకైన రిటర్నులు..

జనవరి 10 మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 7,07,102 రిటర్నులు దాఖలైనట్లు ఐటీ విభాగం తెలిపింది. ఇందులో చివరి గంటలోనే 2,03,687 రిటర్నులు వచ్చినట్లు వివరించింది.

ఇదీ చూడండి:రిటర్ను దాఖలు ఆలస్యమైతే ఇబ్బందులివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.