ETV Bharat / business

పెట్టుబడుల్లో భారత్​ వరుసగా 13వసారి అదే రేటింగ్​

author img

By

Published : Jun 10, 2020, 10:28 PM IST

అంతర్జాతీయ రేటింగ్స్‌ సంస్థ 'స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌' భారత్‌కు స్థిరమైన ‘బీబీబీ-’ సార్వభౌమ రేటింగ్‌ను ఇచ్చింది. వరుసగా 13వ సారి ఇదే రేటింగ్ ఇచ్చిన ఎస్​ అండ్ పీ.. 2021 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ ప్రారంభమై కోలుకుంటుందని స్పష్టం చేసింది. జీడీపీ వృద్ధి వచ్చే మూడేళ్ల కాలంలో క్రమంగా రికవరీ అవుతుందని పేర్కొంది.

BIZ-RATING-INDIA-S&P
స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్

పెట్టుబడుల విషయంలో భారత్​కు వరుసగా 13వ సారి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ 'స్టాండర్డ్స్​ అండ్ పూర్స్​' అత్యల్ప గ్రేడింగ్ ఇచ్చింది. పెట్టుబడుల్లో భారత సార్వభౌమ రేటింగ్​ను 'బీబీబీ-' కే పరిమితం చేసింది. 2021 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ ప్రారంభమై కోలుకుంటుందని స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం తగ్గనుందని ఎస్​ అండ్​ పీ అంచనా వేసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠానికి చేరి 4.2 శాతంగా నమోదైంది. అయినప్పటికీ 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఎస్​ అండ్​ పీ.

"భారత దీర్ఘకాలిక వృద్ధిరేటుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంస్కరణలు సరిగ్గా అమలైతే వృద్ధి రేటు పుంజుకుంటుంది. దీర్ఘకాలికంగా బీబీబీ-, స్వల్పకాలికంగా ఏ-3 రేటింగ్​లో ఉంది భారత్​. దేశ జీడీపీ వృద్ధికి బాహ్య కారకాలు, ద్రవ్య విధానాల పనితీరు ప్రభావం చూపటమే కారణం. "

- ఎస్​ అండ్ పీ

భారత్​లో బలమైన ప్రజాస్వామ్య సంస్థలు విధాన స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి. రేటింగ్‌లనూ బలపరుస్తాయి. ఈ సానుకూలతలు దేశంలోని తక్కువ తలసరి ఆదాయం, ఆర్థిక లోటును సమన్వయం చేస్తూ ద్రవ్య నికర ఆస్తులు, ప్రభుత్వ రుణాల్లో స్థిరమైన వృద్ధికి దోహదం చేస్తాయని ఎస్​ అండ్ పీ తెలిపింది.

కరోనా సంక్షోభంతో భారత్​ బలహీనమైన ఆర్థిక పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని ఎస్అండ్​పీ వివరించింది. అయితే వచ్చే మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ మార్గంలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడింది.

మరో ప్రముఖ రేటింగ్​ సంస్థ ఫిచ్​ కూడా పెట్టుబడుల విషయంలో భారత్​కు బీబీబీ- రేటింగ్​తోనే సరిపెట్టింది.

పెట్టుబడుల విషయంలో భారత్​కు వరుసగా 13వ సారి అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ 'స్టాండర్డ్స్​ అండ్ పూర్స్​' అత్యల్ప గ్రేడింగ్ ఇచ్చింది. పెట్టుబడుల్లో భారత సార్వభౌమ రేటింగ్​ను 'బీబీబీ-' కే పరిమితం చేసింది. 2021 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ ప్రారంభమై కోలుకుంటుందని స్పష్టం చేసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం తగ్గనుందని ఎస్​ అండ్​ పీ అంచనా వేసింది. 2019-20లో జీడీపీ వృద్ధి రేటు 11 ఏళ్ల కనిష్ఠానికి చేరి 4.2 శాతంగా నమోదైంది. అయినప్పటికీ 2021-22 ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 8.5 శాతం, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని స్పష్టం చేసింది ఎస్​ అండ్​ పీ.

"భారత దీర్ఘకాలిక వృద్ధిరేటుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంస్కరణలు సరిగ్గా అమలైతే వృద్ధి రేటు పుంజుకుంటుంది. దీర్ఘకాలికంగా బీబీబీ-, స్వల్పకాలికంగా ఏ-3 రేటింగ్​లో ఉంది భారత్​. దేశ జీడీపీ వృద్ధికి బాహ్య కారకాలు, ద్రవ్య విధానాల పనితీరు ప్రభావం చూపటమే కారణం. "

- ఎస్​ అండ్ పీ

భారత్​లో బలమైన ప్రజాస్వామ్య సంస్థలు విధాన స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి. రేటింగ్‌లనూ బలపరుస్తాయి. ఈ సానుకూలతలు దేశంలోని తక్కువ తలసరి ఆదాయం, ఆర్థిక లోటును సమన్వయం చేస్తూ ద్రవ్య నికర ఆస్తులు, ప్రభుత్వ రుణాల్లో స్థిరమైన వృద్ధికి దోహదం చేస్తాయని ఎస్​ అండ్ పీ తెలిపింది.

కరోనా సంక్షోభంతో భారత్​ బలహీనమైన ఆర్థిక పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని ఎస్అండ్​పీ వివరించింది. అయితే వచ్చే మూడేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ మార్గంలో ప్రయాణిస్తుందని అభిప్రాయపడింది.

మరో ప్రముఖ రేటింగ్​ సంస్థ ఫిచ్​ కూడా పెట్టుబడుల విషయంలో భారత్​కు బీబీబీ- రేటింగ్​తోనే సరిపెట్టింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.