రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను జూన్లో మరోసారి తగ్గించే అవకాశం ఉన్నట్లు లండన్ కేంద్రంగా పని చేస్తున్న 'ఐహెచ్ఎస్ మార్కిట్' అంచనా వేసింది.
అంతర్జాతీయ వృద్ధి నెమ్మదిస్తుందన్న అంచనాలు, ఆర్బీఐ లక్ష్యం కన్నా దేశీయ ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని విశ్లేషించింది.
ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు చొప్పున తగ్గించింది ఆర్బీఐ. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
రానున్న నెలల్లో వర్షపాతం సాధారణంగా కంటే కాస్త తక్కవగా ఉంటుందని.. ఈ కారణంగా ఆహార, ఇంధన ధరలు పెరగొచ్చని నిపుణుల విశ్లేషణ.
ఫలితంగా 2019-20 ఆర్థిక సంవత్సరం రెండో ఆర్థ భాగంలో ద్రవ్యోల్బణం 5 శాతాన్ని దాటొచ్చని అంచనా. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం జూన్ తర్వాత మరోసారి రేట్ల కోతకు ఆర్బీఐ మొగ్గుచూపడం కష్టమేనని ఐహెచ్ఎస్ నివేదిక పేర్కొంది.