ETV Bharat / business

3 నెలల్లోనే 159 టన్నుల బంగారం అమ్మకం

బంగారానికి డిమాండు భారీగా పెరిగింది. భారత్​లో 2019 మొదటి 3 నెలల కాలంలో 159 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి. ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 1,053.33 టన్నుల బంగారం విక్రయమైంది.

author img

By

Published : May 2, 2019, 12:58 PM IST

బంగారానికి భారీ డిమాండు

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పసిడికి డిమాండు భారీగా పెరిగింది. భారత్​లో జనవరి-మార్చి మధ్య కాలంలో రూ. 47,010 కోట్ల విలువున్న 159 టన్నుల పుత్తడి విక్రయమైంది. ఇందులో ఆభరణాల వాటా 125.4 టన్నులు కాగా... పెట్టుబడుల వాటా 33.6 టన్నులు.

గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్​ 5 శాతం పెరిగింది. 2018 మొదటి మూడు నెలల కాలంలో రూ.41,680 కోట్ల విలువున్న 151.5 టన్నులు బంగారం అమ్ముడుపోయింది.

సానుకూలతలే వృద్ధికి కారణం

రూపాయి బలపడటం, పసిడి ధరల్లో తగ్గుదల కారణంగా నగల అమ్మకాలు భారీగా పెరిగినట్లు వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​(డబ్ల్యూజీసీ) తెలిపింది.

ఈ ఏడాది మొదటి 3 నెలల్లో భారత్​లో పెళ్లిళ్ల సీజన్ ఈ అమ్మకాలకు ఊతమిచ్చినట్లు డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్డర్ సోమసుందరం తెలిపారు. రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు ఆకర్షణీయంగా ఉండొచ్చని అన్నారు.

డిమాండుకు తగ్గట్లే దిగుమతులు

డిమాండుకు తగినట్లే బంగారం దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 175 టన్నుల పసిడి దిగుమతైంది. 2018తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో 157 టన్నుల బంగారం మాత్రమే దిగుమతైంది.

ప్రపంచ డిమాండ్లలోనూ వృద్ధి

2019 జనవరి-మార్చి మధ్య ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండు 1,053.33 టన్నులకు చేరినట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో పోలిస్తే ఇది 7 శాతం అధికం. 2018 మొదటి 3 నెలల్లో 984.2 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పసిడికి డిమాండు భారీగా పెరిగింది. భారత్​లో జనవరి-మార్చి మధ్య కాలంలో రూ. 47,010 కోట్ల విలువున్న 159 టన్నుల పుత్తడి విక్రయమైంది. ఇందులో ఆభరణాల వాటా 125.4 టన్నులు కాగా... పెట్టుబడుల వాటా 33.6 టన్నులు.

గతేడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్​ 5 శాతం పెరిగింది. 2018 మొదటి మూడు నెలల కాలంలో రూ.41,680 కోట్ల విలువున్న 151.5 టన్నులు బంగారం అమ్ముడుపోయింది.

సానుకూలతలే వృద్ధికి కారణం

రూపాయి బలపడటం, పసిడి ధరల్లో తగ్గుదల కారణంగా నగల అమ్మకాలు భారీగా పెరిగినట్లు వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​(డబ్ల్యూజీసీ) తెలిపింది.

ఈ ఏడాది మొదటి 3 నెలల్లో భారత్​లో పెళ్లిళ్ల సీజన్ ఈ అమ్మకాలకు ఊతమిచ్చినట్లు డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్డర్ సోమసుందరం తెలిపారు. రానున్న రోజుల్లోనూ బంగారం ధరలు ఆకర్షణీయంగా ఉండొచ్చని అన్నారు.

డిమాండుకు తగ్గట్లే దిగుమతులు

డిమాండుకు తగినట్లే బంగారం దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లో 175 టన్నుల పసిడి దిగుమతైంది. 2018తో పోలిస్తే ఇది 11 శాతం అధికం. గతేడాది ఇదే సమయంలో 157 టన్నుల బంగారం మాత్రమే దిగుమతైంది.

ప్రపంచ డిమాండ్లలోనూ వృద్ధి

2019 జనవరి-మార్చి మధ్య ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండు 1,053.33 టన్నులకు చేరినట్లు డబ్ల్యూజీసీ నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో పోలిస్తే ఇది 7 శాతం అధికం. 2018 మొదటి 3 నెలల్లో 984.2 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయి.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.