ETV Bharat / business

'వృద్ధి జోరును బలోపేతం చేయాలి'

ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పుంజుకుంటూ మునుపటి స్థాయికి చేరుకోవాలంటే వృద్ధి ఉరవడిని బలోపేతం చేయాలని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాలను ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది.

author img

By

Published : Feb 23, 2021, 5:03 AM IST

Updated : Feb 23, 2021, 5:22 AM IST

Growth momentum needs to be strengthened: Das
'వృద్ధి జోరును బలోపేతం చేయాలి'

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం నిలకడగా సాగి, కరోనా ముందు నాటి పరిస్థితికి చేరుకోవాలంటే వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నెల 5న జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది.

"వృద్ధి రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. పుంజుకుంటోంది. వేగాన్ని కూడబెట్టుకుంటోంది. కొవిడ్ టీకా రాకతో అంచనాలు బాగా మెరుగయ్యాయి. అయితే ఈ వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాలి." అని దాస్ అన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని పరపతి విధానంలో సర్దుబాటు ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం నిలకడగా సాగి, కరోనా ముందు నాటి పరిస్థితికి చేరుకోవాలంటే వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నెల 5న జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆర్​బీఐ సోమవారం విడుదల చేసింది.

"వృద్ధి రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. పుంజుకుంటోంది. వేగాన్ని కూడబెట్టుకుంటోంది. కొవిడ్ టీకా రాకతో అంచనాలు బాగా మెరుగయ్యాయి. అయితే ఈ వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాలి." అని దాస్ అన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని పరపతి విధానంలో సర్దుబాటు ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'

Last Updated : Feb 23, 2021, 5:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.