ETV Bharat / business

డిసెంబర్​లోనూ భారత్​లోకి ఎఫ్​పీఐల జోరు - డిసెంబర్ నెల ఎఫ్​పీఐల డేటా

విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు దేశీయ మార్కెట్లలోకి విరివిగా వస్తున్నాయి. ఈ నెల ఇప్పటికే రూ.60,094 కోట్ల ఎఫ్​పీఐలు వచ్చినట్లు డిపాజిటరీస్‌ డేటా ద్వారా వెల్లడైంది. నవంబర్​లోనూ దాదాపు రూ.63 వేల కోట్ల ఎఫ్​పీఐలు రావడం గమనార్హం.

FPIs inflow Continue to India
భారత్​కు కొనసాగుతున్న ఎఫ్​పీఐల ప్రవాహం
author img

By

Published : Dec 27, 2020, 12:52 PM IST

భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) తరలివస్తున్నాయి. డిసెంబర్​లో ఇప్పటికే రూ.60,094 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. వీటిలో రూ.56,643 కోట్లు ఈక్విటీల్లోకి, రూ.3,451 కోట్లు డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది.

నవంబరులో మొత్తం రూ.62,951 కోట్ల ఎఫ్‌పీఐలు భారత్‌కు వచ్చాయి.

ఎఫ్​పీఐల ప్రవాహనికి కారణాలు..

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడమే ఎఫ్‌పీఐలు పెరగడానికి కారణమని నిపుణులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెట్టుబడుల రాక మరింత పెరింగిందని జియోజిత్ ఫినాన్షియల్‌ సర్వీసెస్‌లో పరిశోధన విభాగాధిపతి వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పోలిస్తే భారత విపణి కొంత సానుకూలంగా ఉందన్నారు. మన దేశంలో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకం విలువ మిగతా దేశాలతో కరెన్సీతో పోలిస్తే గత ఎనిమిది నెలల కాలంలో స్థిరంగా కొనసాగడం కూడా కలిసివస్తోందని వివరించారు. ఒక్క చైనాను మినహాయిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే మెరుగ్గా ఉందని తెలిపారు నాయర్.

ఈ రంగాల్లోకి అధికం..

ఇక దేశానికి తరలివస్తున్న ఎఫ్‌పీఐలు ఎక్కువగా.. ఐటీ, ఫార్మా, రసాయన, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని కంపెనీలపై దృష్టి సారిస్తున్నారని నాయర్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా స్వల్పకాలంలో ఎఫ్‌పీఐలు రాక నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇదీ చూడండి:2030 నాటికి మూడో స్థానంలో భారత్‌

భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు(ఎఫ్‌పీఐ) తరలివస్తున్నాయి. డిసెంబర్​లో ఇప్పటికే రూ.60,094 కోట్లు వచ్చి చేరినట్లు డిపాజిటరీస్‌ డేటా వెల్లడించింది. వీటిలో రూ.56,643 కోట్లు ఈక్విటీల్లోకి, రూ.3,451 కోట్లు డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులుగా వెళ్లినట్లు తెలిపింది.

నవంబరులో మొత్తం రూ.62,951 కోట్ల ఎఫ్‌పీఐలు భారత్‌కు వచ్చాయి.

ఎఫ్​పీఐల ప్రవాహనికి కారణాలు..

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడమే ఎఫ్‌పీఐలు పెరగడానికి కారణమని నిపుణులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత పెట్టుబడుల రాక మరింత పెరింగిందని జియోజిత్ ఫినాన్షియల్‌ సర్వీసెస్‌లో పరిశోధన విభాగాధిపతి వినోద్‌ నాయర్‌ వెల్లడించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల పోలిస్తే భారత విపణి కొంత సానుకూలంగా ఉందన్నారు. మన దేశంలో చేపడుతున్న ఆర్థిక సంస్కరణలే అందుకు కారణమని అభిప్రాయపడ్డారు. డాలరుతో రూపాయి మారకం విలువ మిగతా దేశాలతో కరెన్సీతో పోలిస్తే గత ఎనిమిది నెలల కాలంలో స్థిరంగా కొనసాగడం కూడా కలిసివస్తోందని వివరించారు. ఒక్క చైనాను మినహాయిస్తే భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి మిగిలిన అభివృద్ధి చెందుతున్న దేశాలకంటే మెరుగ్గా ఉందని తెలిపారు నాయర్.

ఈ రంగాల్లోకి అధికం..

ఇక దేశానికి తరలివస్తున్న ఎఫ్‌పీఐలు ఎక్కువగా.. ఐటీ, ఫార్మా, రసాయన, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లోని కంపెనీలపై దృష్టి సారిస్తున్నారని నాయర్‌ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా స్వల్పకాలంలో ఎఫ్‌పీఐలు రాక నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేశారు.

ఇదీ చూడండి:2030 నాటికి మూడో స్థానంలో భారత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.