ETV Bharat / business

కేంద్రం భారీ ప్యాకేజీ- వారికి సులువుగా రుణాలు!

author img

By

Published : Jun 28, 2021, 4:00 PM IST

Updated : Jun 28, 2021, 4:59 PM IST

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ.. ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది కేంద్రం. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో వైద్య సౌకర్యాల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

FM Seetharaman
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం మరోసారి ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, కొవిడ్​తో కుదేలైన రంగాలకు అండగా నిలిచేందుకు రూ.1.1 లక్షల కోట్లతో ప్రత్యేక రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సోమవారం ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

చిన్న సంస్థలకు మరింత అండ..

చిన్న సంస్థలను ఆదుకునేందుకు ఇదివరకే ప్రకటించిన.. ఎమర్జెన్సీ క్రెడిట్​ గ్యారంటీ స్కీం​ (ఈసీజీఎస్​) పథకం పరిమితిని రూ.4.5 లక్షల కోట్లకు (అదనంగా 1.5 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు వెల్లడించారు సీతారామన్​.

ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మ రుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రుణాలపై వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్‌ఆర్​పై 2 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈ రుణాల కాలవ్యవధి మూడు సంవత్సరాలని వెల్లడించింది. ఈ పథకం ద్వారా రుణాల మంజూరుకు.. చివరి తేదీ సెప్టెంబర్​ 30, రుణాలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు తుది గడువును డిసెంబర్​ 31గా నిర్ణయించింది ఆర్థిక శాఖ.

ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు..

ఈసీఎల్​జీఎస్ పథకం ద్వారా ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్​, క్లినిక్స్​, మెడికల్ కాలేజీలు.. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.2 కోట్ల వరకు రుణ హామీ కల్పించింది కేంద్రం. ఈ రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతం వద్ద పరిమితం చేసినట్లు పేర్కొంది. ఇంతకంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు ఉంది.

మరిన్ని..

  • పర్యటక రంగంలో స్థిరపడిన వారికి అండగా నిలిచేందుకు వర్కింగ్‌ క్యాపిటల్‌/వ్యక్తిగత రుణాలు.
  • రిజిస్టర్‌ చేసుకున్న టూరిస్ట్‌ గైడ్‌లు, పర్యటక రంగంపై ఆధారపడిన 11,000 మందికి ఆర్థిక సాయం.
  • తొలి ఐదు లక్షల మంది ఉచిత టూరిస్ట్‌ వీసాలు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
  • ఆత్మనిర్భర్‌ రోజ్‌గార్‌ యోజన వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు.
  • కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు.
  • ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మే నుంచి నవంబర్​ వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితం.
  • చిన్నారులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం కోసం రూ.23,220 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ.

ఇవీ చదవండి:

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం మరోసారి ఉద్దీపన చర్యలకు ఉపక్రమించింది. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు, కొవిడ్​తో కుదేలైన రంగాలకు అండగా నిలిచేందుకు రూ.1.1 లక్షల కోట్లతో ప్రత్యేక రుణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సోమవారం ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వైద్య, ఆరోగ్య రంగానికి రూ.50 వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.60 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

చిన్న సంస్థలకు మరింత అండ..

చిన్న సంస్థలను ఆదుకునేందుకు ఇదివరకే ప్రకటించిన.. ఎమర్జెన్సీ క్రెడిట్​ గ్యారంటీ స్కీం​ (ఈసీజీఎస్​) పథకం పరిమితిని రూ.4.5 లక్షల కోట్లకు (అదనంగా 1.5 లక్షల కోట్లు) పెంచుతున్నట్లు వెల్లడించారు సీతారామన్​.

ఈసీఎల్‌జీఎస్‌లో భాగంగా సూక్ష్మ రుణ సంస్థల ద్వారా 25 లక్షల మందికి రూ.1.25 లక్షల చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ రుణాలపై వడ్డీ గరిష్ఠంగా ఎంసీఎల్‌ఆర్​పై 2 శాతం అధికంగా ఉండనున్నట్లు తెలిపింది. ఈ రుణాల కాలవ్యవధి మూడు సంవత్సరాలని వెల్లడించింది. ఈ పథకం ద్వారా రుణాల మంజూరుకు.. చివరి తేదీ సెప్టెంబర్​ 30, రుణాలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు తుది గడువును డిసెంబర్​ 31గా నిర్ణయించింది ఆర్థిక శాఖ.

ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలు..

ఈసీఎల్​జీఎస్ పథకం ద్వారా ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్​, క్లినిక్స్​, మెడికల్ కాలేజీలు.. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.2 కోట్ల వరకు రుణ హామీ కల్పించింది కేంద్రం. ఈ రుణాలపై వడ్డీ రేటు 7.5 శాతం వద్ద పరిమితం చేసినట్లు పేర్కొంది. ఇంతకంటే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు వెసులుబాటు ఉంది.

మరిన్ని..

  • పర్యటక రంగంలో స్థిరపడిన వారికి అండగా నిలిచేందుకు వర్కింగ్‌ క్యాపిటల్‌/వ్యక్తిగత రుణాలు.
  • రిజిస్టర్‌ చేసుకున్న టూరిస్ట్‌ గైడ్‌లు, పర్యటక రంగంపై ఆధారపడిన 11,000 మందికి ఆర్థిక సాయం.
  • తొలి ఐదు లక్షల మంది ఉచిత టూరిస్ట్‌ వీసాలు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండనుంది.
  • ఆత్మనిర్భర్‌ రోజ్‌గార్‌ యోజన వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగింపు.
  • కృత్రిమ ఎరువులకు రూ.14,775 కోట్ల మేర అదనపు రాయితీలు. డీఏపీకి రూ.9,125 కోట్లు, నత్రజనికి రూ.5,650 కోట్లు.
  • ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు మే నుంచి నవంబర్​ వరకు 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితం.
  • చిన్నారులు, పిల్లల సంరక్షణ, ఆరోగ్యం కోసం రూ.23,220 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.