గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21) చివరి త్రైమాసికంలో రూ.2,972 కోట్ల నికర లాభాన్ని గడించినట్లు దేశీయ ఐటీ దిగ్గజం విప్రో గురువారం ప్రకటించింది. 2019-20 క్యూ4లో నమోదైన రూ.2,326 కోట్ల లాభంతో పోలిస్తే ఈ మొత్తం 27.7 శాతం ఎక్కువని తెలిపింది.
ఇదే కాలానికి (2020-21 క్యూ4) ఆదాయం రూ.16,245 కోట్లుగా పేర్కొంది విప్రో. 2019-20 చివరి త్రైమాసికంలో సంస్థ లాభం రూ.15,711 కోట్లుగా వెల్లడించింది.
2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.10,796.4 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.61,943 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి:క్యూ4లో ఇన్ఫీ అదుర్స్- రూ.9,200 కోట్ల బై బ్యాక్ ఆఫర్