మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ డెస్క్టాప్ వెర్షన్లో మార్పులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలే ఈ అప్డేట్లను అందుబాటులోకి తెచ్చింది ట్విట్టర్. ఈ మార్పుపై ట్విట్టర్ యూజర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
డెస్క్టాప్ యూజర్లకు మొబైల్ అనుభూతిని ఇచ్చేందుకు తీసుకువచ్చిన అప్డేట్లో హెడ్డర్ ఎడమ వైపు ఉండే ప్రొఫైల్ పిక్చర్ ఆప్షన్ తొలగించింది ట్విట్టర్. వీటితో పాటు బుక్ మార్క్లు, ఎక్స్ప్లోర్, మెసేజ్ ఆప్షన్లను హెడ్డర్ నుంచి ఎడమై వైపునకు మార్చింది.
ఈ మార్పుపై ఖాతాదారులు... ట్విట్టర్ డెస్క్టాప్ యూజర్లకు అవసరం లేని మార్పులు చేసిందని అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. మీమ్లు, జిఫ్లతో ట్విట్టర్ డిజైన్ టీమ్పై సెటైర్లు వేస్తున్నారు.
"ఈ కొత్త డిజైన్ ఎవరికీ అవసరముండదు. డిజైనింగ్ టీమ్ ఎలా ఆలోచిస్తోందో అర్థమవ్వడం లేదు. ఎందుకంటే ఈ డిజైన్ డెస్క్టాప్ యూజర్లకు అంతగా అవసరం లేదు. ట్విట్టర్ డెస్క్టాప్ వెర్షన్ను మొబైల్ యాప్గా మార్పులు చేసింది. కానీ ఇది మొబైల్ కాదు."
-ట్విట్టర్ వినియోగదారుడు
అయితే ఈ తాజా అప్డేట్లో ట్విట్టర్ డార్క్ మోడ్నూ తీసుకువచ్చింది. దీనిపై మాత్రం యూజర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: మీ పిల్లలకు ఆర్థిక భరోసా ఇవ్వండిలా..