ETV Bharat / business

భారత్​లో కార్యకలాపాలకు 'టిక్​టాక్'​ గుడ్​బై

author img

By

Published : Jan 27, 2021, 1:54 PM IST

దాదాపు 7 నెలల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న టిక్​టాక్, హలో యాప్​లు భారతలో తమ వ్యాపారాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు వాటి మాతృ సంస్థ బైట్​డ్యాన్స్​ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో భారత్​లో ఉన్న 2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్లు తెలిపింది.

tiktok Shut in India
భారత్​లో టిక్​టాక్ వ్యాపారాలు మూసివేత

చైనాకు చెందిన ప్రముఖ షార్ట్​ వీడియో యాప్​లు టిక్​టాక్, హలో​లు భారత వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని టిక్​టాక్​, హలో యాప్​ల మాతృ సంస్థ బైట్​ డ్యాన్స్ ప్రకటించింది. భారత్​లో తమ సంస్థలపై నిషేధం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం..

ఈ మేరకు టిక్​టాక్ ఉన్నతాధికారులు సంయుక్తంగా కంపెనీ నిర్ణయాన్ని ఈమెయిల్​ ద్వారా తమ ఉద్యోగులకు తెలిపారు. కంపెనీ సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నామని.. దీని ప్రభావం భారత్​లో ఉన్న ఉద్యోగులందరిపైనా పడుతుందని అందులో పేర్కొన్నారు.

భారత చట్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఉండేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు టిక్‌టాక్‌ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ 7 నెలలుగా యాప్‌ పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. నిషేధ సమయంలో తమకు అండగా నిలిచిన 2వేల మంది భారతీయ ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. తమ నిర్ణయం వారిని బాధించవచ్చని విచారం వ్యక్తం చేశారు.

మళ్లీ భారత్​లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ఉన్నతాధికారులు. అయితే అది ఎప్పుడనే విషయంపై మాత్రం అనిశ్చితి వ్యక్తం చేశారు.

నిషేధం ఎందుకు?

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో టిక్​టాక్, హలో సహా 59 చైనా యాప్​లపై.. 2020 జూన్ 29న కేంద్రం నిషేధం విధించింది. ఇటీవలే ఆ నిషేధాన్ని పొడగించింది. దీనితో పాటు ఆ యాప్​లపై శాశ్వత నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే బైట్​డ్యాన్స్​ భారత వ్యాపారాలను మూసేయాలని నిర్ణయించడం గమనార్హం.

ఇదీ చూడండి:టిక్​టాక్​ సహా చైనా యాప్​లపై నిషేధం పొడిగింపు

చైనాకు చెందిన ప్రముఖ షార్ట్​ వీడియో యాప్​లు టిక్​టాక్, హలో​లు భారత వ్యాపారాల నుంచి పూర్తిగా తప్పుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని టిక్​టాక్​, హలో యాప్​ల మాతృ సంస్థ బైట్​ డ్యాన్స్ ప్రకటించింది. భారత్​లో తమ సంస్థలపై నిషేధం కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

2 వేల మంది ఉద్యోగులపై ప్రభావం..

ఈ మేరకు టిక్​టాక్ ఉన్నతాధికారులు సంయుక్తంగా కంపెనీ నిర్ణయాన్ని ఈమెయిల్​ ద్వారా తమ ఉద్యోగులకు తెలిపారు. కంపెనీ సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నామని.. దీని ప్రభావం భారత్​లో ఉన్న ఉద్యోగులందరిపైనా పడుతుందని అందులో పేర్కొన్నారు.

భారత చట్టాలకు అనుగుణంగా కార్యకలాపాలు ఉండేలా అన్ని ప్రయత్నాలు చేసినట్లు టిక్‌టాక్‌ ప్రతినిధి తెలిపారు. అయినప్పటికీ 7 నెలలుగా యాప్‌ పునఃప్రారంభంపై ఎలాంటి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. నిషేధ సమయంలో తమకు అండగా నిలిచిన 2వేల మంది భారతీయ ఉద్యోగులకు కృతజ్ఞతలు చెప్పారు. తమ నిర్ణయం వారిని బాధించవచ్చని విచారం వ్యక్తం చేశారు.

మళ్లీ భారత్​లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు ఉన్నతాధికారులు. అయితే అది ఎప్పుడనే విషయంపై మాత్రం అనిశ్చితి వ్యక్తం చేశారు.

నిషేధం ఎందుకు?

భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో టిక్​టాక్, హలో సహా 59 చైనా యాప్​లపై.. 2020 జూన్ 29న కేంద్రం నిషేధం విధించింది. ఇటీవలే ఆ నిషేధాన్ని పొడగించింది. దీనితో పాటు ఆ యాప్​లపై శాశ్వత నిషేధం దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే బైట్​డ్యాన్స్​ భారత వ్యాపారాలను మూసేయాలని నిర్ణయించడం గమనార్హం.

ఇదీ చూడండి:టిక్​టాక్​ సహా చైనా యాప్​లపై నిషేధం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.