ETV Bharat / business

ఏజీఆర్​ బకాయిలను పాక్షికంగా చెల్లించిన వొడాఫోన్​, టాటా - agr telcos issue

సుప్రీం కోర్టు ఆగ్రహం, టెలికాం శాఖ ఆదేశాల నేపథ్యంలో టెల్కోలు ఇవాళ ఏజీఆర్​ బకాయిలను పాక్షికంగా చెల్లించాయి. వొడాఫోన్​-ఐడియా రూ.2,500 కోట్లు, టాటా రూ.2,190 కోట్లు జమ చేశాయి.

BIZ-AGR-TELCOS
వొడాఫోన్​ ఐడియా
author img

By

Published : Feb 17, 2020, 5:30 PM IST

Updated : Mar 1, 2020, 3:22 PM IST

టెలికాం శాఖకు వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీ సర్వీసెస్​ ఏజీఆర్ బకాయిలు పాక్షికంగా చెల్లించినట్లు సమాచారం. వొడాఫోన్​ రూ.2,500 కోట్లు, టాటా రూ.2,190 కోట్లు ప్రభుత్వానికి జమ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కోర్టు తిరస్కరించినా..

అయితే బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామని వొడాఫోన్​ అభ్యర్థించగా ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వొడాఫోన్​ రూ.2,500 కోట్లే చెల్లించింది.

ఏజీఆర్​ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి రూ.10వేల కోట్లను ఈ రోజు ఉదయమే ఎయిర్​టెల్​ చెల్లించింది. మిగిలిన మొత్తం సుప్రీం తదుపరి విచారణలోగా జమ చేస్తామని స్పష్టం చేసింది.

టెలికాం శాఖకు వొడాఫోన్​-ఐడియా, టాటా టెలీ సర్వీసెస్​ ఏజీఆర్ బకాయిలు పాక్షికంగా చెల్లించినట్లు సమాచారం. వొడాఫోన్​ రూ.2,500 కోట్లు, టాటా రూ.2,190 కోట్లు ప్రభుత్వానికి జమ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కోర్టు తిరస్కరించినా..

అయితే బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామని వొడాఫోన్​ అభ్యర్థించగా ఇవాళ సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వొడాఫోన్​ రూ.2,500 కోట్లే చెల్లించింది.

ఏజీఆర్​ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి రూ.10వేల కోట్లను ఈ రోజు ఉదయమే ఎయిర్​టెల్​ చెల్లించింది. మిగిలిన మొత్తం సుప్రీం తదుపరి విచారణలోగా జమ చేస్తామని స్పష్టం చేసింది.

Last Updated : Mar 1, 2020, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.