ETV Bharat / business

డిసెంబర్​ 2020 వరకు ఐయూసీ ఛార్జీలు!

author img

By

Published : Dec 17, 2019, 8:09 PM IST

Updated : Dec 17, 2019, 9:34 PM IST

ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియాలకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​. ఐయూసీ ఛార్జీల ఎత్తివేతను 2021 తర్వాత అమలు చేయనున్నట్లు తాజా ప్రకటనలో వెల్లడించింది.

IUC
ఐయూసీ

ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జీ(ఐయూసీ)లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీలు వచ్చే ఏడాది డిసెంబర్​ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది​. అప్పుల్లో కూరుకుపోయిన.. ఎయిర్​టెల్​, వొడాఫోన్ఐడియాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అంశమని టెలికాం నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న 6 పైసల ఐయూసీ ఛార్జీలే 2020 డిసెంబర్​ వరకు కొనసాగుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. 6 పైసల ఐయూసీ.. 2017 అక్టోబర్​ 1 నుంచి కొనసాగుతోంది. అంతకు ముందు ఇది 14 పైసలుగా ఉండటం గమనార్హం.

తాజా గడువు ముగిసిన తర్వాత 2021 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీలు పూర్తిగా రద్దవుతాయని ట్రాయ్​ వెల్లడించింది.

ఏంటీ ఐయూసీ..!

రెండు వేరు వేరు నెట్​వర్క్​ల మధ్య ఫోన్​కాల్స్​ మాట్లాడాలంటే కాల్​ చేసిన నెట్​వర్క్​.. కాల్​ రిసీవ్​ చేసుకున్న నెట్​వర్క్​కు​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీ(ఐయూసీ) అంటారు.

ఇదీ చూడండి:పీపీఎఫ్​ నిబంధనల్లో కీలక మార్పులు

ఇంటర్​కనెక్ట్​ యూసేజ్​ ఛార్జీ(ఐయూసీ)లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీలు వచ్చే ఏడాది డిసెంబర్​ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది​. అప్పుల్లో కూరుకుపోయిన.. ఎయిర్​టెల్​, వొడాఫోన్ఐడియాలకు ఈ నిర్ణయం ఊరటనిచ్చే అంశమని టెలికాం నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న 6 పైసల ఐయూసీ ఛార్జీలే 2020 డిసెంబర్​ వరకు కొనసాగుతాయని ఓ ప్రకటనలో పేర్కొంది. 6 పైసల ఐయూసీ.. 2017 అక్టోబర్​ 1 నుంచి కొనసాగుతోంది. అంతకు ముందు ఇది 14 పైసలుగా ఉండటం గమనార్హం.

తాజా గడువు ముగిసిన తర్వాత 2021 జనవరి 1 నుంచి ఐయూసీ ఛార్జీలు పూర్తిగా రద్దవుతాయని ట్రాయ్​ వెల్లడించింది.

ఏంటీ ఐయూసీ..!

రెండు వేరు వేరు నెట్​వర్క్​ల మధ్య ఫోన్​కాల్స్​ మాట్లాడాలంటే కాల్​ చేసిన నెట్​వర్క్​.. కాల్​ రిసీవ్​ చేసుకున్న నెట్​వర్క్​కు​ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీ(ఐయూసీ) అంటారు.

ఇదీ చూడండి:పీపీఎఫ్​ నిబంధనల్లో కీలక మార్పులు

New Delhi, Dec 17 (ANI): While addressing an event in the national capital on December 16, the former president of India Pranab Mukherjee, amid the protests on new citizenship law, said, "Indian electorate has time and again conveyed to ruling party that goes on to form the government that we will take you to form government with majority but also take in consideration the views of all those people who may not have voted for them." "Every time a government has behaved on the contrary, the voter has punished the incumbent in elections that follow," he added. "We think we can do anything and everything. When we have an overwhelming majority in legislature but that should not be the case," the former president further stated.

Last Updated : Dec 17, 2019, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.