ETV Bharat / business

ఆటుపోట్లు దాటుకుని.. సరికొత్త శిఖరాలకు సూచీలు

author img

By

Published : Dec 19, 2019, 4:11 PM IST

ఐటీ, వాహన రంగ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 115 పాయింట్లు బలపడి సరికొత్త రికార్డు వద్ద ముగిసింది. నిఫ్టీ 38 పాయింట్లు ఎగిసి జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడింది. ఎస్​ బ్యాంక్ అత్యధికంగా లాభపడింది.

STOCKS
స్టాక్​ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. లాభాల స్వీకరణతో సెషన్​ ప్రారంభం​లో కాస్త ఒడుదొడుకులకు లోనైనా.. అంతర్జాతీయ సానుకూలతలతో ఐటీ, వాహన రంగ​ షేర్లు సానుకూలంగా స్పందించి మార్కెట్లను లాభాలవైపు మళ్లించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 115 పాయింట్లు పుంజుకుని.. చివరకు 41,674 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 12,260(జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,719 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,456 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,268 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,191 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు రెండు పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసిన ఎస్​ బ్యాంకు.. చివరకు 6.74 శాతం లాభంతో సెషన్​ను ముగించింది. టీసీఎస్​ 2.83 శాతం, టాటా మోటార్స్ 2.55 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 2.35 శాతం, ఎం&ఎం 2.32 శాతం, హీరో మోటార్స్ 2.16 శాతం లాభపడ్డాయి.

వేదాంత 2.26 శాతం, సన్​ఫార్మా 1.44 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.34 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంక్​ 0.76 శాతం, బజాజ్​ ఫినాన్స్​ 0.69 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి. లాభాల స్వీకరణతో సెషన్​ ప్రారంభం​లో కాస్త ఒడుదొడుకులకు లోనైనా.. అంతర్జాతీయ సానుకూలతలతో ఐటీ, వాహన రంగ​ షేర్లు సానుకూలంగా స్పందించి మార్కెట్లను లాభాలవైపు మళ్లించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 115 పాయింట్లు పుంజుకుని.. చివరకు 41,674 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 38 పాయింట్ల లాభంతో 12,260(జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,719 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,456 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,268 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,191 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ట్రేడింగ్ ప్రారంభంలో దాదాపు రెండు పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేసిన ఎస్​ బ్యాంకు.. చివరకు 6.74 శాతం లాభంతో సెషన్​ను ముగించింది. టీసీఎస్​ 2.83 శాతం, టాటా మోటార్స్ 2.55 శాతం, భారతీ ఎయిర్​టెల్​ 2.35 శాతం, ఎం&ఎం 2.32 శాతం, హీరో మోటార్స్ 2.16 శాతం లాభపడ్డాయి.

వేదాంత 2.26 శాతం, సన్​ఫార్మా 1.44 శాతం, హెచ్​డీఎఫ్​సీ 1.34 శాతం, ఇండస్​ఇండ్ బ్యాంక్​ 0.76 శాతం, బజాజ్​ ఫినాన్స్​ 0.69 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇదీ చూడండి:100 బిలియన్​ డాలర్ల క్లబ్​లో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​

Washington DC (USA), Dec 19 (ANI): The second 2+2 Dialogue between India and US was held at the United States. US State Department Spokesperson Morgan Ortagus said that counter-terrorism, economics, trade and security were few of the highlights of the Dialogue. Morgan said, "This is only the second time that we have 2+2 Dialogue between India and US and this is the first time it is being held in the United States. It shows the significance of the US bilateral relationship with India that we were able to have this conversation. India is someone credibly important to us in a number of institutions around the world and the relationship is very important in the President Trump's Indo-Pacific strategy." Speaking on the highlights, she said, "We have a number of issues as it relates to counter-terrorism, economics, trade, security and then what's most important is that world's oldest and world's largest democracies talk on a range of these issues."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.