దేశీయంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2019 ఫిబ్రవరిలో 1.11 శాతం క్షీణించాయి. 2019 ఫిబ్రవరి నెలకుగాను సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్) విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.
ఫిబ్రవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,72,284 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ తెలిపింది. గతేడాది ఇదే కాలానికి వీటి విక్రయాలు 2,75,346 యూనిట్లుగా నమోదయ్యాయి.
దేశీయంగా కార్ల అమ్మకాలు కూడా గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 2019 ఫిబ్రవరిలో 4.33 శాతం తగ్గాయి. 2018 ఫిబ్రవరిలో 1,79,122 యూనిట్ల విక్రయాలు జరగ్గా 2019 ఫిబ్రవరిలో 1,71,372 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు సియామ్ పేర్కొంది.
ద్విచక్ర వాహనాల విక్రయాలు 2018 ఫిబ్రవరితో పోలిస్తే 2019 ఫిబ్రవరిలో 4.22 శాతం తగ్గినట్లు సియామ్ తెలిపింది. 2019 ఫిబ్రవరిలో 6,15,071 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.
వాణిజ్య వాహనాల అమ్మకాలు 2019 ఫిబ్రవరిలో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 0.43 శాతం తగ్గి 87,436 యూనిట్లు విక్రయమైనట్లు సియామ్ వెల్లడించింది.
అన్ని రకాల వాహనాల అమ్మకాలు గతేడాది ఫిబ్రవరితో పొలిస్తే 2019 ఫిబ్రవరిలో 3.65 శాతం తగ్గాయని సియామ్ తెలిపింది. 2018 ఫిబ్రవరిలో 21,11,804 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఫిబ్రవరిలో 20,34,768 ఈ సంఖ్య యూనిట్ల విక్రయాలు జరిగాయి.