ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మీకి పోటీగా ఒప్పో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఒప్పో రెనో 3 తో పాటు రెనో 3ప్రో 5జీ సిరీస్లను అందుబాటులోకి తేనుంది. రెడ్మీ కె30 4జీ సిరీస్కు పోటీగా ఒప్పో సంస్థ ఈ ఫోన్లను తీసుకొస్తోంది. ఈ నెల 26న రెనో 3ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే వీటికోసం నమోదు చేసుకొనే సదుపాయం కల్పించింది సంస్థ. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా కలర్ ఓఎస్ 7తో వచ్చిన మొట్టమొదటి ఫోన్లుగా నిలిచాయి రెనో 3, రెనో 3ప్రో . అయితే రెనో 3ప్రో 5జీ ఫోన్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రెనో 3 ఫీచర్లు ఇలా
- స్నాప్ డ్రాగన్ 765 చిప్సెట్ ప్రాసెసర్
- పంచ్ హోల్ డిస్ప్లే
- ఫింగర్ ప్రింట్ స్కానర్
- క్వాడ్ కెమెరా
- 4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ
మరోవైపు ఒప్పో అనుబంధ సంస్థ రియల్మీ సిరీస్లోని 'ఎక్స్50'.. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765 చిప్సెట్ అనే ప్రాసెసర్తో మార్కెట్లోకి రానున్నట్లు తెలిపింది. రియల్మీ ఎక్స్ 50కి ఉండే స్పెసిఫికేషన్స్ ఇకపై రెనో 3ప్రో 5జీకి సమానంగా ఉంటాయి.
ప్రస్తుతం 5జీ నెట్వర్క్ సపోర్ట్తో రెడ్మీ కే30 మార్కెట్లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. వీటి ప్రారంభ ధర రూ.20,500నుంచి ఉంది రెడ్మి కె 30 మొబైల్లో అద్భుతమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. అయితే ఒప్పో రెనో 3 ప్రో 5జీ ధర వివరాలు మాత్రం ప్రకటించలేదు. కానీ వినియోగదారుని ఆకర్షించే విధంగా ఒప్పో ధరలు నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో రెడ్మీ, ఒప్పోలతో పాటు సరసమైన 5జీ స్మార్ట్ఫోన్లను వినియోగదారులకు అందించే రేస్లో రియల్మీ కూడా చేరనుంది.
ఇదీ చూడండి: ఉంటుందా.. ఊడుతుందా? ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన