ETV Bharat / business

అక్కడి కాంగ్రెస్​ అభ్యర్థికి అంబానీ మద్దతు..!

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ తరచుగా తన ప్రసంగాల్లో రఫేల్​ ఒప్పందంలో అనిల్​ అంబానీకి అనుచిత లబ్ధి చేకూరిందని ఆరోపిస్తూ ఉంటారు. అయితే దక్షిణ ముంబయి లోక్​సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు అనిల్​ అంబానీ సోదరడు ముఖేశ్ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది.

author img

By

Published : Apr 19, 2019, 10:41 AM IST

Updated : Apr 19, 2019, 11:19 AM IST

అక్కడి కాంగ్రెస్​ అభ్యర్థికి అంబానీ మద్దతు..!
కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు మద్దుతు పలికిన ముఖేశ్​ అంబానీ

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్​ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఏ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్లినా రఫేల్​ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. రఫేల్​ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపారి అనిల్​ అంబానీకి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు. ఈ తరుణంలో అనిల్​ అంబానీ సోదరుడు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్ ముఖేశ్​ అంబానీ ఓ కాంగ్రెస్​ అభ్యర్థికి ఎన్నికల్లో మద్దతివ్వడం చర్చనీయాంశమైంది.

అసలు సంగతేంటి..?

మిలింద్​ దేవరా... మాజీ కేంద్ర మంత్రి. దక్షిణ ముంబయి లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల ట్విట్టర్​లో ఆయన ఓ వీడియో పంచుకున్నారు. అందులో చిన్న వ్యాపారుల నుంచి వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, బ్యాంకింగ్​ దిగ్గజం ఉదయ్​ కోటక్​ దేవరాపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ ముంబయి నుంచి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.

"మిలింద్​ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. దాదాపు 10 ఏళ్లు దక్షిణ బాంబేకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణ ముంబయి నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్​కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను."
- ముఖేశ్​ అంబానీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ ఛైర్మన్

"ముంబయి వాసులవైపు దేవరా నిలబడతారని నాకు నిజంగా అనిపించింది. ఆయన కుటుంబానికి ముంబయితో విడదీయరాని సంబంధం ఉంది. మిలింద్​కు ముంబయితో మంచి బంధం ఉంది."
- ఉదయ్​ కోటక్, కోటక్​ మహీంద్ర బ్యాంకు ఎండీ

అంబానీ, కోటక్​ లాంటి దిగ్గజ వ్యాపారులు తనకు మద్దతుగా నిలవడం గౌరవంగా ఉందని దేవరా చెప్పారు. చిన్న వ్యాపారులు, పాన్​వాలాలు తన వెంట నిలవడం అంతే ఆనందాన్ని ఇస్తుందన్నారు.
పరిశ్రమలు, వ్యాపారాల్లో పేరెన్నికగన్న ముంబయి గళం గత ఐదేళ్లలో పార్లమెంటులో మూగబోయింది. అంబానీ, కోటక్​ మద్దతు పలకడం ఆనందంగా, గౌరవంగా ఉంది."
- మిలింద్​ దేవరా, కాంగ్రెస్​ నేత

ఎన్నికల్లో గెలిస్తే వ్యాపారహిత వాతావరణాన్ని తెచ్చేందుకు, ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తానని దేవరా హామీ ఇచ్చారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో దేవరా శివసేన అభ్యర్థి అరవింద్​ సావంత్​ చేతిలో ఓడిపోయారు.

కాంగ్రెస్​ అభ్యర్థి మిలింద్​ దేవరాకు మద్దుతు పలికిన ముఖేశ్​ అంబానీ

సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్​ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఏ రాష్ట్రానికి ప్రచారానికి వెళ్లినా రఫేల్​ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారు. రఫేల్​ ఒప్పందంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాపారి అనిల్​ అంబానీకి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తుంటారు. ఈ తరుణంలో అనిల్​ అంబానీ సోదరుడు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్ ముఖేశ్​ అంబానీ ఓ కాంగ్రెస్​ అభ్యర్థికి ఎన్నికల్లో మద్దతివ్వడం చర్చనీయాంశమైంది.

అసలు సంగతేంటి..?

మిలింద్​ దేవరా... మాజీ కేంద్ర మంత్రి. దక్షిణ ముంబయి లోక్​సభ స్థానానికి కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్నారు. ఇటీవల ట్విట్టర్​లో ఆయన ఓ వీడియో పంచుకున్నారు. అందులో చిన్న వ్యాపారుల నుంచి వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ, బ్యాంకింగ్​ దిగ్గజం ఉదయ్​ కోటక్​ దేవరాపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ ముంబయి నుంచి ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.

"మిలింద్​ అచ్చమైన దక్షిణ ముంబయి వాసి. దాదాపు 10 ఏళ్లు దక్షిణ బాంబేకు ప్రాతినిధ్యం వహించారు. దక్షిణ ముంబయి నియోజకవర్గంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక స్థితిగతులపై మిలింద్​కు లోతైన అవగాహన ఉందని నేను నమ్ముతున్నాను."
- ముఖేశ్​ అంబానీ, రిలయన్స్​ ఇండస్ట్రీస్​ లిమిటెడ్ ఛైర్మన్

"ముంబయి వాసులవైపు దేవరా నిలబడతారని నాకు నిజంగా అనిపించింది. ఆయన కుటుంబానికి ముంబయితో విడదీయరాని సంబంధం ఉంది. మిలింద్​కు ముంబయితో మంచి బంధం ఉంది."
- ఉదయ్​ కోటక్, కోటక్​ మహీంద్ర బ్యాంకు ఎండీ

అంబానీ, కోటక్​ లాంటి దిగ్గజ వ్యాపారులు తనకు మద్దతుగా నిలవడం గౌరవంగా ఉందని దేవరా చెప్పారు. చిన్న వ్యాపారులు, పాన్​వాలాలు తన వెంట నిలవడం అంతే ఆనందాన్ని ఇస్తుందన్నారు.
పరిశ్రమలు, వ్యాపారాల్లో పేరెన్నికగన్న ముంబయి గళం గత ఐదేళ్లలో పార్లమెంటులో మూగబోయింది. అంబానీ, కోటక్​ మద్దతు పలకడం ఆనందంగా, గౌరవంగా ఉంది."
- మిలింద్​ దేవరా, కాంగ్రెస్​ నేత

ఎన్నికల్లో గెలిస్తే వ్యాపారహిత వాతావరణాన్ని తెచ్చేందుకు, ఉద్యోగ కల్పనకు ప్రయత్నిస్తానని దేవరా హామీ ఇచ్చారు. 2014 లోక్​సభ ఎన్నికల్లో దేవరా శివసేన అభ్యర్థి అరవింద్​ సావంత్​ చేతిలో ఓడిపోయారు.

Kalaburagi (Karnataka), Apr 16 (ANI): Amid the Lok Sabha elections, speaking to ANI on various political issues and Samajwadi Party (SP) leader Azam Khan, Maneka Gandhi facing campaign ban for violating Model Code of Conduct (MCC), veteran Congress leader Mallikarjun Kharge said, "Those who can't control their mouth are now banned by the Election Commission of India (ECI). But, they would have done this before. When the Supreme Court (SC) asked them, then they reacted to the incident which isn't good." "Every time SC will not guide you on such issues so, it is necessary to control such people whose tongue usually slips," Kharge added.
Last Updated : Apr 19, 2019, 11:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.