ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్.. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి గానూ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ లాభం 17.5 శాతం ఎక్కువని తెలిపింది. ఇదే సమయానికి ఆదాయం కూడా 13.1 శాతం పెరిగి.. రూ.26,311 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించింది.
2020-21 పూర్తి సంవత్సర నికర లాభం రూ.19,351 కోట్లుగా పేర్కొంది ఇన్ఫీ. ఆదాయం రూ.1,00,472 కోట్లుగా వివరించింది.
కోరనా వంటి సంక్షోభంలోనూ భారీ లాభాలను గడించిన ఇన్ఫోసిస్.. రూ.9,200 కోట్లతో షేర్ల బై బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఇందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డు ఆమోదం కూడా తెలిపినట్లు వెల్లడించింది. ఒక్క షేర్ను గరిష్ఠంగా రూ.1,750తో బై బ్యాక్ చేయనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి:ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లపై 50% వరకు డిస్కౌంట్!