ETV Bharat / business

రిలయన్స్, గూగుల్ డీల్​ ఫిక్స్- జియోలో 7.7% వాటా

author img

By

Published : Jul 15, 2020, 3:00 PM IST

Updated : Jul 15, 2020, 3:31 PM IST

జియో-గూగుల్ భాగస్వామ్యంపై రిలయన్స్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో స్పష్టతనిచ్చారు సంస్థ అధినేత ముకేశ్ అంబానీ. జియో ప్లాట్​ఫామ్స్​లో గూగుల్ రూ.33.7 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

google jio deal
గూగుల్ జియో ఒప్పందం

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ జియో ప్లాట్​ ఫామ్స్​లో రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడితో జియో ప్లాట్​ఫామ్స్​లో 7.7 శాతం వాటా గూగుల్​కు దక్కనున్నట్లు తెలిపారు.

google jio deal
జియోలో గూగుల్ భారీ పెట్టుబడి

జియో ప్లాట్​ఫామ్స్​కు వచ్చిన పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదన్నారు ముకేశ్. భవిష్యత్​ ప్రణాళికల్లో గూగుల్, ఫేస్​బుక్, ఇంటెల్, క్వాల్కమ్​ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వాములుగా ఉండనున్నట్లు వెల్లడించారు.

గూగుల్​ కన్నా ముందు ఫేస్​బుక్ సహా మొత్తం 12 కంపెనీలు 13 దఫాల్లో జియో ప్లాట్​ఫామ్స్​లో పెట్టుబడి పెట్టాయి. 25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.

ఈ మొత్తం పెట్టుబడుల్లో ఫేస్​బుక్ అతిపెద్ద మైనారిటీ వాటాదారుల్లో మొదటి స్థానంలో ఉండగా.. గూగుల్ రెండో స్థానాన్ని పొందనుంది.

ఇదీ చూడండి:మారుతీ కార్లలో లోపం- 1.34 లక్షల యూనిట్లు రీకాల్!

దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ జియో ప్లాట్​ ఫామ్స్​లో రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ పెట్టుబడితో జియో ప్లాట్​ఫామ్స్​లో 7.7 శాతం వాటా గూగుల్​కు దక్కనున్నట్లు తెలిపారు.

google jio deal
జియోలో గూగుల్ భారీ పెట్టుబడి

జియో ప్లాట్​ఫామ్స్​కు వచ్చిన పెట్టుబడులు ఆర్థిక భాగస్వామ్యం మాత్రమే కాదన్నారు ముకేశ్. భవిష్యత్​ ప్రణాళికల్లో గూగుల్, ఫేస్​బుక్, ఇంటెల్, క్వాల్కమ్​ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వాములుగా ఉండనున్నట్లు వెల్లడించారు.

గూగుల్​ కన్నా ముందు ఫేస్​బుక్ సహా మొత్తం 12 కంపెనీలు 13 దఫాల్లో జియో ప్లాట్​ఫామ్స్​లో పెట్టుబడి పెట్టాయి. 25 శాతానికిపైగా వాటాను ఆయా సంస్థలకు విక్రయించడం ద్వారా మొత్తం రూ.1,18,318.45 కోట్లు గడించింది జియో.

ఈ మొత్తం పెట్టుబడుల్లో ఫేస్​బుక్ అతిపెద్ద మైనారిటీ వాటాదారుల్లో మొదటి స్థానంలో ఉండగా.. గూగుల్ రెండో స్థానాన్ని పొందనుంది.

ఇదీ చూడండి:మారుతీ కార్లలో లోపం- 1.34 లక్షల యూనిట్లు రీకాల్!

Last Updated : Jul 15, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.