ETV Bharat / business

త్వరలోనే భారత్​లో యాపిల్ ఆన్​లైన్​ స్టోర్​!

author img

By

Published : Aug 26, 2020, 4:06 PM IST

పండుగ సీజన్ నేపథ్యంలో మార్కెట్​ను అందిపుచ్చుకునేందుకు.. భారత్​లో అధికారిక ఆన్​లైన్​ రిటైల్ స్టోర్​ ఏర్పాటుకు యాపిల్ కసరత్తు ముమ్మరం చేసింది. దీనిపై యాపిల్​ సంస్థ అధికారిక ప్రకటన చేయకున్నా.. వచ్చే నెలలోనే స్టోర్​ ప్రారంభించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

apple online store in india soon
భారత్​లో యాపిల్ ఆన్​లైన్​ స్టోర్

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ భారత్​లో త్వరలోనే అధికారిక ఆన్​లైన్​ రిటైల్ స్టోర్​ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఆరంభంలో దేశంలో యాపిల్ తన ఆన్​లైన్ రిటైల్ స్టోర్​ను ప్రారంభించే అవకాశం ఉందని బ్లామ్​బర్గ్​ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై యాపిల్​ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

నిజానికి యాపిల్ ఆన్​లైన్​ స్టోర్​ ఇదివరకే ప్రారంభం కావాల్సి ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా అందులో జాప్యం జరిగింది.

దేశంలో త్వరలో పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ మార్కెట్​ను అందిపుచ్చుకునేందుకు ఇప్పుడు మళ్లీ ఆ దిశగా యాపిల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రస్తుతం భారత్​లో థర్డ్​ పార్టీ రిటైలర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

భారత్​లో ఆఫ్​లైన్ రిటైల్ స్టోర్​ను వచ్చే ఏడాది ముంబయిలో ప్రారంభించనున్నట్లు.. యాపిల్ సీఈఓ టిమ్​ కుక్​ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా విక్రయానికి మళ్లీ గడువు పెంపు

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ భారత్​లో త్వరలోనే అధికారిక ఆన్​లైన్​ రిటైల్ స్టోర్​ను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల ఆరంభంలో దేశంలో యాపిల్ తన ఆన్​లైన్ రిటైల్ స్టోర్​ను ప్రారంభించే అవకాశం ఉందని బ్లామ్​బర్గ్​ నివేదిక పేర్కొంది. అయితే ఈ విషయంపై యాపిల్​ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

నిజానికి యాపిల్ ఆన్​లైన్​ స్టోర్​ ఇదివరకే ప్రారంభం కావాల్సి ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల కారణంగా అందులో జాప్యం జరిగింది.

దేశంలో త్వరలో పండుగ సీజన్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆ మార్కెట్​ను అందిపుచ్చుకునేందుకు ఇప్పుడు మళ్లీ ఆ దిశగా యాపిల్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. యాపిల్ ప్రస్తుతం భారత్​లో థర్డ్​ పార్టీ రిటైలర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

భారత్​లో ఆఫ్​లైన్ రిటైల్ స్టోర్​ను వచ్చే ఏడాది ముంబయిలో ప్రారంభించనున్నట్లు.. యాపిల్ సీఈఓ టిమ్​ కుక్​ ఇదివరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా విక్రయానికి మళ్లీ గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.