ETV Bharat / business

యాక్టివ్ యూజర్లలో మళ్లీ జియోనే టాప్

author img

By

Published : Oct 18, 2020, 1:25 PM IST

యాక్టివ్ యూజర్ల పరంగా టెలికాం దిగ్గజం జియో జులైలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. జులైలో జియోకు 25 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగినట్లు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. జూన్​లో అగ్రస్థానంలో నిలిచిన ఎయిర్​టెల్​కు జులైలో 4 లక్షల యాక్టివ్ యూజర్లు తగ్గినట్లు తెలిపింది.

jio gain huge Active users in July
జియోకు పెరిగిన యాక్టివ్ యూజర్లు

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు జులైలో కొత్తగా 25 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగారు. దీనితో యాక్టివ్ యూజర్ల పరంగా జూన్​లో ఎయిర్​టెల్​కు దక్కిన అగ్రస్థానాన్ని.. జులైలో జియో కైవసం చేసుకుంది. జులైలో ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియాకు వరుసగా 4 లక్షలు, 38 లక్షల యాక్టివ్ యూజర్లు తగ్గారు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజా గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది.

దేశంలో మొత్తం వైర్​లెస్ సబ్​స్క్రైబర్ల సంఖ్య కూడా జులైలో 35 లక్షలు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత టెలికాం సబ్​స్కైబర్ల సంఖ్య పెరగటం ఇదే తొలిసారని తెలిపింది. అయితే ఇదే నెలలో యాక్టివ్ సబ్​స్కైబర్ల సంఖ్య మాత్రం 21 లక్షలు తగ్గినట్లు ట్రాయ్ వెల్లడించింది.

మొత్తం 1,144 మిలియన్ల వైర్​లెస్ సబ్​స్క్రైబర్లలో.. జులైలో 955.8 మిలియన్ల యూజర్లు మాత్రమే యాక్టివ్​గా ఉన్నట్లు తెలిపింది.

రిపోర్టెడ్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్(వీఎల్​ఆర్​) ఆధారంగా యాక్టివ్ యూజర్లను లెక్కిస్తారు.

కంపెనీల వారీగా..

  • జులైలో రిలయన్స్ జియోకు 31.3 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
  • భారత్ ఎయిర్​టెల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య జులైలో 31 కోట్లు.
  • వొడాఫోన్ ఐడియాకు జులైలో 26.9 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఇదీ చూడండి:పేటీఎం షాక్‌: వ్యాలెట్​లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ!

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు జులైలో కొత్తగా 25 లక్షల యాక్టివ్ యూజర్లు పెరిగారు. దీనితో యాక్టివ్ యూజర్ల పరంగా జూన్​లో ఎయిర్​టెల్​కు దక్కిన అగ్రస్థానాన్ని.. జులైలో జియో కైవసం చేసుకుంది. జులైలో ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్​టెల్​, వొడాఫోన్​-ఐడియాకు వరుసగా 4 లక్షలు, 38 లక్షల యాక్టివ్ యూజర్లు తగ్గారు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' తాజా గణాంకాల ద్వారా ఈ విషయం తెలిసింది.

దేశంలో మొత్తం వైర్​లెస్ సబ్​స్క్రైబర్ల సంఖ్య కూడా జులైలో 35 లక్షలు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత టెలికాం సబ్​స్కైబర్ల సంఖ్య పెరగటం ఇదే తొలిసారని తెలిపింది. అయితే ఇదే నెలలో యాక్టివ్ సబ్​స్కైబర్ల సంఖ్య మాత్రం 21 లక్షలు తగ్గినట్లు ట్రాయ్ వెల్లడించింది.

మొత్తం 1,144 మిలియన్ల వైర్​లెస్ సబ్​స్క్రైబర్లలో.. జులైలో 955.8 మిలియన్ల యూజర్లు మాత్రమే యాక్టివ్​గా ఉన్నట్లు తెలిపింది.

రిపోర్టెడ్ విజిటర్ లొకేషన్ రిజిస్టర్(వీఎల్​ఆర్​) ఆధారంగా యాక్టివ్ యూజర్లను లెక్కిస్తారు.

కంపెనీల వారీగా..

  • జులైలో రిలయన్స్ జియోకు 31.3 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.
  • భారత్ ఎయిర్​టెల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య జులైలో 31 కోట్లు.
  • వొడాఫోన్ ఐడియాకు జులైలో 26.9 కోట్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు.

ఇదీ చూడండి:పేటీఎం షాక్‌: వ్యాలెట్​లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.