ETV Bharat / business

'జూన్​లో 10 కోట్ల కొవిషీల్డ్​ డోసులు సరఫరా'

author img

By

Published : May 30, 2021, 6:14 PM IST

జూన్​లో కొవిషీల్డ్(Covishield)​ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. 9-10 కోట్ల డోసులు సరఫరా చేస్తామని కేంద్రానికి తెలిపింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. మహమ్మారితో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ తమ ఉద్యోగులు రోజులో 24 గంటలు పని చేస్తున్నారని పేర్కొంది.

Covishield
కొవిషీల్డ్ టీకాలు

జూన్​ నెలలో 9-10 కోట్ల కొవిషీల్డ్(Covishield)​​ టీకా డోసులు ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తామని కేంద్రానికి తెలిపింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. టీకాల కొరతపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీరం ప్రకటన ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాసింది సీరం సంస్థ. మహమ్మారితో సవాళ్లు ఎదురైనా.. తమ ఉద్యోగులు రోజులో 24 గంటలు పని చేస్తున్నారని పేర్కొంది. కొవిషీల్డ్​ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో తమకు మద్దతుగా నిలిచిన అమిత్​ షాకు కృతజ్ఞతలు తెలిపింది.

"మే నెలలో మా ఉత్పత్తి సామర్థ్యం 6.5 కోట్ల డోసులతో పోలిస్తే.. జూన్​లో 9-10 కోట్ల డోసులకు పెంచి సరఫరా చేయగలమని తెలియజేస్తున్నాం. కొవిడ్​-19 నుంచి దేశ ప్రజలతో పెద్ద సంఖ్యలో ప్రపంచ జనాభాను రక్షించేందుకు సీరం సంస్థ ఎప్పుడూ పాటుపడుతుంది. మా సీఈఓ అదర్​ పూనావాలా నాయకత్వంలో మా బృందం ప్రభుత్వంతో కలిసి కొవిడ్​ మహమ్మారి పోరులో నిస్వార్థంగా పని చేస్తోంది. భారత ప్రభుత్వ మద్దతు, మార్గదర్శనంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని మా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకే ప్రయత్నిస్తాం. "

- ప్రకాశ్​ కుమార్​ సింగ్​, ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్​, సీరం.

మే తొలినాళ్లలో.. కొవిషీల్డ్​ ఉత్పత్తిని జూన్​లో 6.5 కోట్లుకు, జులైలో 7 కోట్లకు, ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో 10 కోట్లకు పెంచుతామని తెలిపింది. టీకా కొరత ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి వేగవంతం చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!

జూన్​ నెలలో 9-10 కోట్ల కొవిషీల్డ్(Covishield)​​ టీకా డోసులు ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తామని కేంద్రానికి తెలిపింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. టీకాల కొరతపై రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీరం ప్రకటన ఊరట కలిగిస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాసింది సీరం సంస్థ. మహమ్మారితో సవాళ్లు ఎదురైనా.. తమ ఉద్యోగులు రోజులో 24 గంటలు పని చేస్తున్నారని పేర్కొంది. కొవిషీల్డ్​ అభివృద్ధి, ఉత్పత్తి, సరఫరాలో తమకు మద్దతుగా నిలిచిన అమిత్​ షాకు కృతజ్ఞతలు తెలిపింది.

"మే నెలలో మా ఉత్పత్తి సామర్థ్యం 6.5 కోట్ల డోసులతో పోలిస్తే.. జూన్​లో 9-10 కోట్ల డోసులకు పెంచి సరఫరా చేయగలమని తెలియజేస్తున్నాం. కొవిడ్​-19 నుంచి దేశ ప్రజలతో పెద్ద సంఖ్యలో ప్రపంచ జనాభాను రక్షించేందుకు సీరం సంస్థ ఎప్పుడూ పాటుపడుతుంది. మా సీఈఓ అదర్​ పూనావాలా నాయకత్వంలో మా బృందం ప్రభుత్వంతో కలిసి కొవిడ్​ మహమ్మారి పోరులో నిస్వార్థంగా పని చేస్తోంది. భారత ప్రభుత్వ మద్దతు, మార్గదర్శనంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుని మా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకే ప్రయత్నిస్తాం. "

- ప్రకాశ్​ కుమార్​ సింగ్​, ప్రభుత్వ, నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్​, సీరం.

మే తొలినాళ్లలో.. కొవిషీల్డ్​ ఉత్పత్తిని జూన్​లో 6.5 కోట్లుకు, జులైలో 7 కోట్లకు, ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో 10 కోట్లకు పెంచుతామని తెలిపింది. టీకా కొరత ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి వేగవంతం చేసినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.