ETV Bharat / business

2025 నాటికి 15 విద్యుత్ కార్లు: టొయోటా - టొయోటా ఎలక్ట్రిక్​ కార్ల తయారీ వేగవతం

అతిపెద్ద వాహన తయారీ సంస్థ టొయోటా.. తొలి ఎలక్ట్రిక్ ఎస్​యూవీని (ఈవీ) ఆవిష్కరించింది. షాంఘైలో జరిగిన ఆటో షోలో నూతన ఈవీ మోడల్​ 'బీజెడ్-4ఎక్స్'​ను విడుదల చేసింది. విద్యుత్​ కార్లను సరికొత్త 'ఈ-టీఎన్​జీఏ' ప్లాట్​ఫాం​పై రూపొందిస్తోంది టొయోటా.

toyota bZ4X
టొయోటా బీజెడ్-4ఎక్స్
author img

By

Published : Apr 20, 2021, 11:04 AM IST

Updated : Apr 20, 2021, 11:11 AM IST

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్పోర్ట్​ యుటిలిటీ వాహనాన్ని(ఈవీ-ఎస్​యూవీ)​ ఆవిష్కరించింది. షాంఘై ఆటో షోలో 'బీజెడ్-4ఎక్స్' పేరుతో ఈ కొత్త మోడల్​ను విడుదల చేసింది.​ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆర్​ఏవీ-4ను పోలి ఉన్న ఈ డిజైన్.. ఫోక్స్​వ్యాగన్​-ఏజీకి గట్టి పోటీనిస్తుందని ఆటో మొబైల్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

4 ఏళ్లలో.. 15మోడళ్లు..

2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడు 'బీ-జెడ్' సిరీస్ మోడళ్లు సహా.. మొత్తం 15 ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు టొయోటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మసాహికో మైడా వెల్లడించారు.

ప్రస్తుతం బీ-జెడ్4ఎక్స్‌ సిరీస్​ను జపాన్, చైనాల్లో ఉత్పత్తి చేసి.. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని టొయోటా ప్రణాళికలు రచిస్తోంది. బీ-జెడ్4ఎక్స్ మోడల్​లో సంప్రదాయ స్టీరింగ్ స్థానంలో విలక్షణమైన వీల్​ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్ బ్యాటరీని సోలార్​తో ఛార్జ్​ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నట్లు వివరించింది.

toyota bZ4X
టొయోటా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బీజెడ్-4ఎక్స్

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్​ కార్ల తయారీలోకి షియోమీ!

పోటీకి అనుగుణంగా..

టొయోటాకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పోటీదారు అయిన ఫోక్స్​వ్యాగన్ గత నెలలోనే ఈవీ మోడల్​ను ఆవిష్కరించింది. దీనితో పాటు బ్యాటరీ సాంకేతికపై 29 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టొయోటా కూడా విద్యుత్ వాహనాల ప్రణాళికను వేగవంతం చేస్తున్నట్లు బ్లూమ్​బర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు టాట్సుయో యోషిడా అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌.. ఎప్పటి నుంచి రాయితీ కిక్‌?

అక్కడ మంచి డిమాండ్..

జపాన్, యూకేల్లో టొయోటాకి మంచి మార్కెట్​ ఉంది. వచ్చే దశాబ్దం నాటికి పెట్రోల్​, డీజిల్తో నడిచే వాహనాల వాడకాన్ని భారీగా తగ్గిస్తామని ఆయా దేశాలు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాయి. ఈ నేపథ్యంలో.. గత కొంతకాలంగా విద్యుత్​ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది టొయోటా.

ఇవీ చదవండి

'ఈ-వాహనాల'తో పర్యావరణహిత ప్రయాణం

ఈ-బైక్​ కొనాలనుకుంటున్నారా.. ఇవి మీ కోసమే!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టొయోటా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్​ స్పోర్ట్​ యుటిలిటీ వాహనాన్ని(ఈవీ-ఎస్​యూవీ)​ ఆవిష్కరించింది. షాంఘై ఆటో షోలో 'బీజెడ్-4ఎక్స్' పేరుతో ఈ కొత్త మోడల్​ను విడుదల చేసింది.​ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆర్​ఏవీ-4ను పోలి ఉన్న ఈ డిజైన్.. ఫోక్స్​వ్యాగన్​-ఏజీకి గట్టి పోటీనిస్తుందని ఆటో మొబైల్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.

4 ఏళ్లలో.. 15మోడళ్లు..

2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడు 'బీ-జెడ్' సిరీస్ మోడళ్లు సహా.. మొత్తం 15 ఈవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు టొయోటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మసాహికో మైడా వెల్లడించారు.

ప్రస్తుతం బీ-జెడ్4ఎక్స్‌ సిరీస్​ను జపాన్, చైనాల్లో ఉత్పత్తి చేసి.. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా విక్రయించాలని టొయోటా ప్రణాళికలు రచిస్తోంది. బీ-జెడ్4ఎక్స్ మోడల్​లో సంప్రదాయ స్టీరింగ్ స్థానంలో విలక్షణమైన వీల్​ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్ బ్యాటరీని సోలార్​తో ఛార్జ్​ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నట్లు వివరించింది.

toyota bZ4X
టొయోటా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బీజెడ్-4ఎక్స్

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్​ కార్ల తయారీలోకి షియోమీ!

పోటీకి అనుగుణంగా..

టొయోటాకు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పోటీదారు అయిన ఫోక్స్​వ్యాగన్ గత నెలలోనే ఈవీ మోడల్​ను ఆవిష్కరించింది. దీనితో పాటు బ్యాటరీ సాంకేతికపై 29 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టొయోటా కూడా విద్యుత్ వాహనాల ప్రణాళికను వేగవంతం చేస్తున్నట్లు బ్లూమ్​బర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు టాట్సుయో యోషిడా అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌.. ఎప్పటి నుంచి రాయితీ కిక్‌?

అక్కడ మంచి డిమాండ్..

జపాన్, యూకేల్లో టొయోటాకి మంచి మార్కెట్​ ఉంది. వచ్చే దశాబ్దం నాటికి పెట్రోల్​, డీజిల్తో నడిచే వాహనాల వాడకాన్ని భారీగా తగ్గిస్తామని ఆయా దేశాలు ఇప్పటికే ప్రతిజ్ఞ చేశాయి. ఈ నేపథ్యంలో.. గత కొంతకాలంగా విద్యుత్​ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది టొయోటా.

ఇవీ చదవండి

'ఈ-వాహనాల'తో పర్యావరణహిత ప్రయాణం

ఈ-బైక్​ కొనాలనుకుంటున్నారా.. ఇవి మీ కోసమే!

Last Updated : Apr 20, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.