ETV Bharat / business

స్విగ్గీకి కరోనా దెబ్బ- భారీగా ఉద్యోగుల తొలగింపు - swiggy employees latest updates

ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు షాక్​ ఇచ్చింది. కరోనా కారణంగా వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడటం వల్ల.. వెయ్యి మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ హర్ష మాజేటి ఉద్యోగులందరికీ ఇ-మెయిల్​ ద్వారా తెలిపారు.

Swiggy to lay off 1,100 employees due to COVID-19 impact
'స్విగ్గీ'పై కరోనా ప్రభావం... భారీగా ఉద్యోగుల తొలగింపు
author img

By

Published : May 18, 2020, 5:21 PM IST

ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో నగరాలు, ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న 1,100 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాపార కార్యకలాపాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి ఈ విషయాన్ని ఉద్యోగులందరికీ ఇ-మెయిల్​ ద్వారా తెలిపారు. ఇందులో ఉద్యోగ తొలగింపునకు గల కారణాలను తెలియజేశారు. పరిస్థితులు మళ్లీ మెరుగుపడే సమయానికి.. అవకాశాలను ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగిన సామర్థ్యాలను మరో మార్గం ద్వారా పెంపొందించుకొని మరింత బలంగా నిలబడాలని భావిస్తున్నట్లు వివరించారు.

"ఈ సంక్షోభం మా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, దేశంలో ఇ-కామర్స్​, హోం డెలివరీ దిశగా అడుగులేస్తున్నాం. కిరాణా సరకులు, తదితర సేవలను అందించేందుకు మార్గం చూపించినట్లైంది. దీనిని మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం."

-శ్రీ హర్ష మాజేటి, స్వీగ్గీ సీఈఓ

వాటితో ఊరట...

ప్రభావిత ఉద్యోగులందరికీ ఆర్థికపరంగా సాయం అందించేందుకు స్విగ్గీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీహర్ష. వారందరికీ నోటీసు వ్యవధి, పదవీకాలంతో సంబంధం లేకుండా మూడు నెలల జీతాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు సీఈఓ. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి, అర్హులైన​ తమ కుటుంబ సభ్యులకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వైద్య బీమా, ప్రమాద బీమాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.

ప్రముఖ ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ స్విగ్గీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొద్ది రోజుల్లో నగరాలు, ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్న 1,100 ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తమ వ్యాపార కార్యకలాపాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

స్విగ్గీ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీహర్ష మాజేటి ఈ విషయాన్ని ఉద్యోగులందరికీ ఇ-మెయిల్​ ద్వారా తెలిపారు. ఇందులో ఉద్యోగ తొలగింపునకు గల కారణాలను తెలియజేశారు. పరిస్థితులు మళ్లీ మెరుగుపడే సమయానికి.. అవకాశాలను ఉపయోగించుకునేలా సిద్ధంగా ఉండాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగిన సామర్థ్యాలను మరో మార్గం ద్వారా పెంపొందించుకొని మరింత బలంగా నిలబడాలని భావిస్తున్నట్లు వివరించారు.

"ఈ సంక్షోభం మా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, దేశంలో ఇ-కామర్స్​, హోం డెలివరీ దిశగా అడుగులేస్తున్నాం. కిరాణా సరకులు, తదితర సేవలను అందించేందుకు మార్గం చూపించినట్లైంది. దీనిని మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం."

-శ్రీ హర్ష మాజేటి, స్వీగ్గీ సీఈఓ

వాటితో ఊరట...

ప్రభావిత ఉద్యోగులందరికీ ఆర్థికపరంగా సాయం అందించేందుకు స్విగ్గీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు శ్రీహర్ష. వారందరికీ నోటీసు వ్యవధి, పదవీకాలంతో సంబంధం లేకుండా మూడు నెలల జీతాలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు సీఈఓ. ఉద్యోగాలు కోల్పోతున్న వారికి, అర్హులైన​ తమ కుటుంబ సభ్యులకు ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వైద్య బీమా, ప్రమాద బీమాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.