ETV Bharat / business

వడ్డీ మాఫీపై ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు

author img

By

Published : Nov 27, 2020, 5:13 PM IST

కరోనా దృష్ట్యా రూ.2కోట్లు చెల్లించిన ఎనిమిది కేటగిరీల రుణాలపై వడ్డీని మాఫీ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా వల్ల ఆర్థికంగా నష్టపోయిన ఎంఎస్​ఎంఈ, విద్యా, గృహ వినియోగం వంటి కేటగిరీలపై వడ్డీ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని నిర్దేశించింది.

SC directs govt to implement its decision to forego interest on eight categories of loans
వడ్డీ మాఫీపై ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

మారటోరియం కాలంలో వడ్డీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కొవిడ్​ దృష్ట్యా రూ.2 కోట్లు చెల్లించిన ఎనిమిది కేటగిరీల రుణాలపై వడ్డీని రద్దు చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా... ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాణిజ్యంపైనా ప్రభావం చూపిందని, ఫలితంగా ఆర్థికంగా నష్టం వాటిల్లిందని న్యాయస్థానం పేర్కొంది. మహమ్మారి వ్లల విధించిన లాక్​డౌన్​ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ చాలా పరిశ్రమలు పూర్తిస్థాయి కార్యకలాపాలకు నోచుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఎస్​ఎంఈలు, విద్య, గృహ, వినియోగ వస్తువులు(కన్జూమర్ డూరబుల్స్​), క్రెడిట్​ కార్డు, ఆటోమొబైల్స్​, వ్యక్తిగత, వినియోగ వంటి ఎనిమిది రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రంగాలకు ఉపశమనం కలిగిస్తూ చర్యలు చేపట్టినట్లు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మోహతా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక సమర్పించారు. దీనిపై పిటిషనర్​, సీనియర్​ అడ్వకేట్​ రాజీవ్​ దత్​ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

మారటోరియం కాలంలో వడ్డీ చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. కొవిడ్​ దృష్ట్యా రూ.2 కోట్లు చెల్లించిన ఎనిమిది కేటగిరీల రుణాలపై వడ్డీని రద్దు చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయడానికి కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా... ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల వాణిజ్యంపైనా ప్రభావం చూపిందని, ఫలితంగా ఆర్థికంగా నష్టం వాటిల్లిందని న్యాయస్థానం పేర్కొంది. మహమ్మారి వ్లల విధించిన లాక్​డౌన్​ను దశల వారీగా ఎత్తివేస్తున్నప్పటికీ చాలా పరిశ్రమలు పూర్తిస్థాయి కార్యకలాపాలకు నోచుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంఎస్​ఎంఈలు, విద్య, గృహ, వినియోగ వస్తువులు(కన్జూమర్ డూరబుల్స్​), క్రెడిట్​ కార్డు, ఆటోమొబైల్స్​, వ్యక్తిగత, వినియోగ వంటి ఎనిమిది రకాల రుణాలపై వడ్డీని మాఫీ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రంగాలకు ఉపశమనం కలిగిస్తూ చర్యలు చేపట్టినట్లు సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మోహతా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక సమర్పించారు. దీనిపై పిటిషనర్​, సీనియర్​ అడ్వకేట్​ రాజీవ్​ దత్​ సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.