ETV Bharat / business

పబ్​జీ రీ ఎంట్రీ - గూగుల్​ ప్లే స్టోర్​లో యాప్​!

author img

By

Published : May 15, 2021, 3:07 PM IST

బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా పేరుతో పబ్​జీ తిరిగి భారత్​లో రీఎంట్రీ ఇస్తోంది. ఈ మేరకు మాతృ సంస్థ అయిన క్రాఫ్టాన్ గూగుల్​ ప్లేస్టోర్​లో యాప్​ను ఉంచడానికి రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

PUBG
పబ్​జీ ప్రేమికులకు శుభవార్త!

వివిధ కారణాల రీత్య భారత్​లో నిషేధాన్ని ఎదుక్కొన్న పబ్​జీ.. తిరిగి దేశంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ మే 18 నుంచి ప్లే స్టోర్‌లో అడుగు పెట్టేందుకు బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా పేరుతో ముందస్తుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్లు సౌత్ కొరియా వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ తెలిపింది.

ఇప్పుడు వస్తున్న గేమ్​లో భారతీయుల కోసం మాత్రమే ప్రత్యేకమైన రివార్డులు ఉంచారు. పబ్​జీ అభిమానులు ముందస్తుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారు వాటిని పొందవచ్చని తెలుస్తోంది. ఈ యాప్​ కేవలం భారత్​లో ఉన్న అభిమానులకు మాత్రమే అని తెలిపింది.

'బ్యాటిల్​ గ్రౌండ్​ మొబైల్​ ఇండియా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దయచేసి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'ప్రీ-రిజిస్టర్' బటన్‌పై క్లిక్ చేయండి. గేమ్ రివార్డ్‌ను కూడా పొందండి' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

నిషేధం ఇందుకే..

చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్​పై భారత ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. వాటిల్లో పబ్​జీ ఒకటి. అయితే పబ్​జీ ప్రత్యక్షంగా చైనా యాప్​ కాదు. చైనా ఆధారిత టెన్​సెంట్​ సంస్థకు పబ్​జీతో సంబంధం ఉండటం వల్ల యాప్​ నిషేధానికి గురైంది. అనంతరం ఆ సంస్థ పబ్​జీ కార్పొరేషన్​ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి.. పబ్​జీని తిరిగి దేశంలో విడుదల చేసేందుకు మాతృసంస్థ క్రాఫ్టాన్​ ప్రయత్నిస్తూనే ఉంది.

ఇదీ చూడండి: ఉద్యోగుల వేటలో పబ్​జీ.. ఇక రీఎంట్రీకి ఫిక్స్​!

వివిధ కారణాల రీత్య భారత్​లో నిషేధాన్ని ఎదుక్కొన్న పబ్​జీ.. తిరిగి దేశంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ మే 18 నుంచి ప్లే స్టోర్‌లో అడుగు పెట్టేందుకు బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండియా పేరుతో ముందస్తుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్లు సౌత్ కొరియా వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ తెలిపింది.

ఇప్పుడు వస్తున్న గేమ్​లో భారతీయుల కోసం మాత్రమే ప్రత్యేకమైన రివార్డులు ఉంచారు. పబ్​జీ అభిమానులు ముందస్తుగా రిజిస్ట్రేషన్​ చేసుకున్నవారు వాటిని పొందవచ్చని తెలుస్తోంది. ఈ యాప్​ కేవలం భారత్​లో ఉన్న అభిమానులకు మాత్రమే అని తెలిపింది.

'బ్యాటిల్​ గ్రౌండ్​ మొబైల్​ ఇండియా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దయచేసి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'ప్రీ-రిజిస్టర్' బటన్‌పై క్లిక్ చేయండి. గేమ్ రివార్డ్‌ను కూడా పొందండి' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

నిషేధం ఇందుకే..

చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్​పై భారత ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. వాటిల్లో పబ్​జీ ఒకటి. అయితే పబ్​జీ ప్రత్యక్షంగా చైనా యాప్​ కాదు. చైనా ఆధారిత టెన్​సెంట్​ సంస్థకు పబ్​జీతో సంబంధం ఉండటం వల్ల యాప్​ నిషేధానికి గురైంది. అనంతరం ఆ సంస్థ పబ్​జీ కార్పొరేషన్​ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి.. పబ్​జీని తిరిగి దేశంలో విడుదల చేసేందుకు మాతృసంస్థ క్రాఫ్టాన్​ ప్రయత్నిస్తూనే ఉంది.

ఇదీ చూడండి: ఉద్యోగుల వేటలో పబ్​జీ.. ఇక రీఎంట్రీకి ఫిక్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.