ETV Bharat / business

ఐపీఎల్ బ్రాండ్ విలువ 3.6% డౌన్​!

author img

By

Published : Mar 10, 2021, 3:24 PM IST

Updated : Mar 11, 2021, 6:26 AM IST

కరోనా కారణంగా 2020లో ఐపీఎల్​ బ్రాండ్ విలువ దాదాపు 3.6 శాతం క్షీణించి.. రూ.45,800 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని డఫ్​&ఫెల్ఫ్స్ అనే సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

Corona shaves IPL brand value
ఐపీఎల్ బ్రాండ్ విలువకు కరోనా గండి

గత ఏడాది కరోనా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రతి రంగాన్ని ఈ మహమ్మారి దెబ్బతీసింది. దీని ప్రభావం ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)పైనా తీవ్రంగా పడింది. అదేమిటి కరోనా ఉన్న దుబాయ్​లో ఐపీఎల్ మ్యాచ్​లు జరిగాయి కాదా? ఇంకా కరోనా ప్రభావం అంటారేమిటి.. అనుకుంటున్నారా? అయితే ఇది మ్యాచ్​ల పరంగా కాదు. ఐపీఎల్ బ్రాండ్ విలువ పరంగా.

కరోనా వల్ల ఐపీఎల్​ బ్రాండ్​ విలువ 2020లో 3.6 శాతం తగ్గి.. రూ.45,800 కోట్లకు పడిపోయింది. 2019లో ఈ విలువ రూ.47,500 కోట్లు(2018తో పోలిస్తే ఇది 7 శాతం అధికం)గా ఉంది. డఫ్​&ఫెల్ఫ్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలిసింది.

నివేదికలోని మరిన్ని విషయాలు..

  • ఐపీఎల్​ ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ కూడా కరోనా కారణంగా భారీగా తగ్గింది. అయినప్పటికీ రిలయన్స్ గ్రూప్​నకు చెందిన ముంబయి ఇండియన్స్ (ఎంఐ) బ్రాండ్​ విలువ పరంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2020లో దీని బ్రాండ్​ విలువ 2019తో పోలిస్తే 5.9 శాతం కోల్పోయి.. రూ.761 కోట్లకు తగ్గింది.
  • చెన్నై సూపర్​ కింగ్స్​ (సీఎస్​కే), కోల్​కతా నైట్ రైడర్స్ (కేకేఆర్​)ల బ్రాండ్ విలువ అత్యధికంగా వరుసగా 16.5 శాతం, 13.7 శాతం పడిపోయి.. రూ.732 కోట్లు, రూ.611 కోట్లకు చేరింది.
  • స్పాన్సర్​షిప్​ రెవెన్యూ, స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడం వంటివి ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ తగ్గేందుకు ప్రధాన కారణం.
  • ఇంట్లోనే కూర్చుని పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్​ చూడటం వల్ల.. టీవీ వీక్షణలు, ప్రకటనల ఆదాయం వంటి అంశాల్లో రికార్డులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి

గత ఏడాది కరోనా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రతి రంగాన్ని ఈ మహమ్మారి దెబ్బతీసింది. దీని ప్రభావం ఇండియన్ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​)పైనా తీవ్రంగా పడింది. అదేమిటి కరోనా ఉన్న దుబాయ్​లో ఐపీఎల్ మ్యాచ్​లు జరిగాయి కాదా? ఇంకా కరోనా ప్రభావం అంటారేమిటి.. అనుకుంటున్నారా? అయితే ఇది మ్యాచ్​ల పరంగా కాదు. ఐపీఎల్ బ్రాండ్ విలువ పరంగా.

కరోనా వల్ల ఐపీఎల్​ బ్రాండ్​ విలువ 2020లో 3.6 శాతం తగ్గి.. రూ.45,800 కోట్లకు పడిపోయింది. 2019లో ఈ విలువ రూ.47,500 కోట్లు(2018తో పోలిస్తే ఇది 7 శాతం అధికం)గా ఉంది. డఫ్​&ఫెల్ఫ్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలిసింది.

నివేదికలోని మరిన్ని విషయాలు..

  • ఐపీఎల్​ ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ కూడా కరోనా కారణంగా భారీగా తగ్గింది. అయినప్పటికీ రిలయన్స్ గ్రూప్​నకు చెందిన ముంబయి ఇండియన్స్ (ఎంఐ) బ్రాండ్​ విలువ పరంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2020లో దీని బ్రాండ్​ విలువ 2019తో పోలిస్తే 5.9 శాతం కోల్పోయి.. రూ.761 కోట్లకు తగ్గింది.
  • చెన్నై సూపర్​ కింగ్స్​ (సీఎస్​కే), కోల్​కతా నైట్ రైడర్స్ (కేకేఆర్​)ల బ్రాండ్ విలువ అత్యధికంగా వరుసగా 16.5 శాతం, 13.7 శాతం పడిపోయి.. రూ.732 కోట్లు, రూ.611 కోట్లకు చేరింది.
  • స్పాన్సర్​షిప్​ రెవెన్యూ, స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడం వంటివి ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ తగ్గేందుకు ప్రధాన కారణం.
  • ఇంట్లోనే కూర్చుని పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్​ చూడటం వల్ల.. టీవీ వీక్షణలు, ప్రకటనల ఆదాయం వంటి అంశాల్లో రికార్డులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:మస్క్ సంపద ఒక్కరోజే రూ.1.8 లక్షల కోట్లు వృద్ధి

Last Updated : Mar 11, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.