ETV Bharat / business

2021 తొలినాళ్లలోనే అందుబాటులోకి 'కొవిషీల్డ్​'

భారత్​లో వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ఆక్స్​ఫర్డ్​ టీకా 'కొవిషీల్డ్​' అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆస్ట్రాజెనికా ఇండియా అధ్యక్షుడు గగన్​దీప్​ సింగ్​. అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ టీకా 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల స్థాయిల్లోనే నిలువ చేసే వీలున్నందున దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేసే వీలుకలుగుతుందని చెప్పారు.

author img

By

Published : Dec 13, 2020, 8:18 AM IST

Astra zeneca vaccine
ఆక్స్​ఫర్డ్​ టీకా కొవిషీల్డ్

ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ కొవిషీల్డ్​.. భారత్​లో 2021 తొలిఅర్ధభాగంలోపే అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు గగన్​దీప్​ సింగ్​. ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో భాగంగా కరోనా వ్యాక్సిన్​పై కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో పెద్దమొత్తంలో, సమానంగా, సమయానుసారంగా వ్యాక్సిన్​ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

" ఆక్స్​ఫర్డ్​ వర్సిటీతో ఏప్రిల్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి అనుమతులు వస్తాయనే నమ్మకంతో ఉన్నాం. అది 2021 తొలిఅర్ధభాగంలోపే టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు 300 కోట్ల డోసులు అందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. వైరల్​ వెక్టాల్​ ప్లాట్​ఫాం విధానంతో టీకా అభివృద్ధి చేయటం వల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తికి వీలుపడుతోంది. అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థల్లో ఒకటైన సీరంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉంది. "

- గగన్​దీప్​ సింగ్​, ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు

2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే నిలువ చేసేందుకు వీలు ఉన్నందున తమ టీకా సరఫరా, నిర్వహణ చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు సింగ్​. దీంతో దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేయొచ్చని తెలిపారు. భారత్​లో సంబంధిత అధికారుల ఆమోదం లభించగానే.. పెద్దసంఖ్యలో టీకా పంపిణీ చేసేందుకు వీలుందని చెప్పారు.

భారత్​లో ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్యాండిడేట్​ 'కొవిషీల్డ్'​ తుదిదశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తోంది పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

ఇదీ చూడండి: ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ సురక్షితమే..

ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ కొవిషీల్డ్​.. భారత్​లో 2021 తొలిఅర్ధభాగంలోపే అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు గగన్​దీప్​ సింగ్​. ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో భాగంగా కరోనా వ్యాక్సిన్​పై కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో పెద్దమొత్తంలో, సమానంగా, సమయానుసారంగా వ్యాక్సిన్​ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.

" ఆక్స్​ఫర్డ్​ వర్సిటీతో ఏప్రిల్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి అనుమతులు వస్తాయనే నమ్మకంతో ఉన్నాం. అది 2021 తొలిఅర్ధభాగంలోపే టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు 300 కోట్ల డోసులు అందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. వైరల్​ వెక్టాల్​ ప్లాట్​ఫాం విధానంతో టీకా అభివృద్ధి చేయటం వల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తికి వీలుపడుతోంది. అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థల్లో ఒకటైన సీరంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉంది. "

- గగన్​దీప్​ సింగ్​, ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు

2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే నిలువ చేసేందుకు వీలు ఉన్నందున తమ టీకా సరఫరా, నిర్వహణ చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు సింగ్​. దీంతో దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేయొచ్చని తెలిపారు. భారత్​లో సంబంధిత అధికారుల ఆమోదం లభించగానే.. పెద్దసంఖ్యలో టీకా పంపిణీ చేసేందుకు వీలుందని చెప్పారు.

భారత్​లో ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్యాండిడేట్​ 'కొవిషీల్డ్'​ తుదిదశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తోంది పుణెకు చెందిన సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.

ఇదీ చూడండి: ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ సురక్షితమే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.