ETV Bharat / business

ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి బ్యాంకుల విలీనం: ఆర్బీఐ

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా చేసే విలీనం ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి వస్తుందని భారతీయ రిజర్వ్​ బ్యాంకు (ఆర్బీఐ) స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఉన్నప్పటికీ బ్యాంకుల విలీన ప్రక్రియకు అడ్డంకికాదని వెల్లడించింది.

author img

By

Published : Mar 29, 2020, 5:37 AM IST

RBI
ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి బ్యాంకుల విలీనం

కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 10 బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా మార్చే విలీనానికి సర్వంసిద్ధమైంది. బ్యాంకుల విలీనం ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి వస్తుందని భారతీయ రిజర్వ్​ బ్యాంకు (ఆర్బీఐ) స్పష్టం చేసింది. దేశవ్యాప్త లాక్​డౌన్ ఈ విలీన ప్రక్రియకు అడ్డంకి కాదని వెల్లడించింది. ​

విలీనమైన బ్యాంకు శాఖల్లోనే యథావిధిగా ఉమ్మడి బ్యాంకు పేరుతో సేవలు కొనసాగుతాయని ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ. విలీన బ్యాంకుల ఖాతాదారులు ఏ బ్యాంకులోనైతే తమ బ్యాంకు కలుస్తుందో ఆ బ్యాంకు వినియోగదారుడిగా పరిగణించి సేవలు అందిస్తారని స్పష్టం చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పటిష్ఠమైన బ్యాంకింగ్​ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేందుకు మార్చి 4న నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్రం.

వాయిదా వేయాలని లేఖ

కరోనాతో లాక్​డౌన్​ విధించిన కారణంగా బ్యాంకుల విలీన ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి బ్యాంకు అధికారుల సంఘాలు. ఈ పరిస్థితుల్లో విలీనం చేపడితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపాయి. ఈ విషయంపై గత గురువారమే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ స్పష్టత ఇచ్చారు. లాక్​డౌన్​ కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

బ్యాంకుల విలీనం ఇలా..

  1. పంజాబ్​ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలిపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది కేంద్రం.
  2. కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
  3. యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్​ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
  4. ఇండియన్​ బ్యాంకులో.. అలహాబాద్​ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.

బ్యాంకుల మెగా విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కరోనా: రంగంలోకి హుందాయ్, మారుతి

కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 10 బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా మార్చే విలీనానికి సర్వంసిద్ధమైంది. బ్యాంకుల విలీనం ఏప్రిల్​ 1 నుంచి అమలులోకి వస్తుందని భారతీయ రిజర్వ్​ బ్యాంకు (ఆర్బీఐ) స్పష్టం చేసింది. దేశవ్యాప్త లాక్​డౌన్ ఈ విలీన ప్రక్రియకు అడ్డంకి కాదని వెల్లడించింది. ​

విలీనమైన బ్యాంకు శాఖల్లోనే యథావిధిగా ఉమ్మడి బ్యాంకు పేరుతో సేవలు కొనసాగుతాయని ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ. విలీన బ్యాంకుల ఖాతాదారులు ఏ బ్యాంకులోనైతే తమ బ్యాంకు కలుస్తుందో ఆ బ్యాంకు వినియోగదారుడిగా పరిగణించి సేవలు అందిస్తారని స్పష్టం చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పటిష్ఠమైన బ్యాంకింగ్​ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేందుకు మార్చి 4న నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్రం.

వాయిదా వేయాలని లేఖ

కరోనాతో లాక్​డౌన్​ విధించిన కారణంగా బ్యాంకుల విలీన ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి బ్యాంకు అధికారుల సంఘాలు. ఈ పరిస్థితుల్లో విలీనం చేపడితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపాయి. ఈ విషయంపై గత గురువారమే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ స్పష్టత ఇచ్చారు. లాక్​డౌన్​ కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.

బ్యాంకుల విలీనం ఇలా..

  1. పంజాబ్​ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలిపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది కేంద్రం.
  2. కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్​ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
  3. యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్​ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
  4. ఇండియన్​ బ్యాంకులో.. అలహాబాద్​ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.

బ్యాంకుల మెగా విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కరోనా: రంగంలోకి హుందాయ్, మారుతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.