ETV Bharat / business

'విమానాల్లో సీటింగ్ ఇక​ 85% - ధరల నియంత్రణ 15 రోజులే'

author img

By

Published : Sep 18, 2021, 9:19 PM IST

విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులు 15 రోజుల కాలపరిమితితో అమలులో ఉంటాయని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 30 రోజులుగా ఉన్న ఈ నిబంధనను సవరించింది. అదేసమయంలో ప్యాసింజర్ల సామర్థ్యాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

AVIATION
'విమాన టికెట్ల ధరలపై నియంత్రణ 15 రోజులే'

కరోనా రెండో వేవ్​తో పోలిస్తే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, దేశీయ విమాన ప్రయాణాలు (Domestic flights India) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలలో ప్యాసింజర్ల సామర్థ్యాన్ని (airlines passenger capacity) 72.5 శాతం నుంచి 85 శాతానికి పెంచింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry) ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను సవరించింది. ఇవి 15 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలిపింది. 16వ రోజు నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు ఛార్జీలు వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ నిబంధన 30 రోజులుగా ఉంది.

ఉదాహరణకు.. సెప్టెంబర్ 20న విమాన టికెట్ బుక్ చేయాలనుకుంటే.. అక్టోబర్ 5 వరకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత తేదీల్లో ప్రయాణించేందుకు సెప్టెంబర్ 20న బుక్ చేసుకుంటే.. విమాన సంస్థలు తమకు నచ్చిన విధంగా వసూలు చేయవచ్చు.

కరోనా నేపథ్యంలో ఈ కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను విధించింది కేంద్రం. విమానయాన రంగానికి, ప్రయాణికులకు నష్టం కలగకుండా ఈ నిబంధన ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి:

కరోనా రెండో వేవ్​తో పోలిస్తే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడం, దేశీయ విమాన ప్రయాణాలు (Domestic flights India) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమానాలలో ప్యాసింజర్ల సామర్థ్యాన్ని (airlines passenger capacity) 72.5 శాతం నుంచి 85 శాతానికి పెంచింది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Civil Aviation Ministry) ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, విమాన టికెట్ల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను సవరించింది. ఇవి 15 రోజులు మాత్రమే అమలులో ఉంటాయని తెలిపింది. 16వ రోజు నుంచి ఎలాంటి పరిమితులు లేకుండా విమానయాన సంస్థలు ఛార్జీలు వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ నిబంధన 30 రోజులుగా ఉంది.

ఉదాహరణకు.. సెప్టెంబర్ 20న విమాన టికెట్ బుక్ చేయాలనుకుంటే.. అక్టోబర్ 5 వరకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఉంటాయి. ఆ తర్వాత తేదీల్లో ప్రయాణించేందుకు సెప్టెంబర్ 20న బుక్ చేసుకుంటే.. విమాన సంస్థలు తమకు నచ్చిన విధంగా వసూలు చేయవచ్చు.

కరోనా నేపథ్యంలో ఈ కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను విధించింది కేంద్రం. విమానయాన రంగానికి, ప్రయాణికులకు నష్టం కలగకుండా ఈ నిబంధన ప్రవేశపెట్టింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.