ETV Bharat / business

మోదీ మా పొట్ట కొట్టారు: టిక్​టాక్ స్టార్ల ఆవేదన

author img

By

Published : Jul 1, 2020, 6:11 PM IST

చైనాకు చెందిన టిక్​టాక్​ సహా 59 యాప్​లపై భారత ప్రభుత్వం నిషేధం వేయడంపై స్పందిస్తున్నారు టిక్​టాక్​ యూజర్లు. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులను చెప్పుకొంటున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.

TikTok influencers after app ban
భారత ప్రభుత్వ నిషేధాన్ని సమర్థిస్తున్న టిక్​టాక్​ యూజర్లు

టిక్​టాక్​... భారత్​లో విపరీతంగా ప్రజాదరణ పొందిన యాప్​. ఇందులో తమదైన నైపుణ్యాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ చాలా మంది పేరు తెచ్చుకున్నారు. అయితే సోమవారం టిక్​టాక్​ సహా 59 యాప్​లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఫలితంగా ఈ వేదికనే నమ్ముకున్న ఎందరో టిక్​టాక్​ యూజర్లు స్పందిస్తున్నారు. నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆదాయం, బతుకుదెరువు కోల్పోయామని చెబుతున్నారు.

మా గొప్పతనమే..

టిక్​టాక్​ను నిషేధించినంత మాత్రాన ఎవరి టాలెంట్​ను అడ్డుకోలేమని చెప్పింది 23 ఏళ్ల నిహారికా జైన్​. ఈమెకు ఆ యాప్​లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఫలితంగా నెలకు రూ.30వేల ఆదాయం పొందేది. ఈ షార్ట్​ వీడియో యాప్​ నిషేధం తర్వాత ఆమె మాట్లాడుతూ.. " భారత ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. మేమంతా కంటెంట్​ క్రియేటర్లం. మా టాలెంట్​ వల్లే మేము పాపులర్​ అయ్యాం. టిక్​టాక్​ లేకపోతే మరో యాప్​ ద్వారా మా టాలెంట్​ను ప్రదర్శిస్తాం" అని జైన్​ చెప్పింది.

జీవనాధారం పోయినా మోదీకే మద్దతు...

మాస్​ కమ్యునికేషన్స్​లో పట్టా పొందిన మరో అమ్మయి ప్రస్తుతం రియాలిటీ షోలలో ఫ్రీ లాన్సర్​గా పనిచేస్తోంది. టిక్​టాక్​లో వీడియోలు పెట్టడం, విభిన్న స్టైల్స్​​ను అనుకరించడం, ఫ్యాషన్​పై దృష్టి పెట్టడం వల్ల తన కెరీర్​ను అభివృద్ధి చెందిందని చెప్పింది. ఆగస్టులో ఈ యాప్​లో చేరిన ఈమె.. దాదాపు 2.8 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. వేర్వేరు సంస్థలకు ప్రచారం కల్పించేలా వీడియోలు చేసి నెలకు రూ.15 వేల నుంచి 30వేల రూపాయలు సంపాదించుకునేది. యాప్​ నిషేధించడం తనను షాక్​నకు గురిచేసిందని చెప్పిందిఆ అమ్మాయి. "టిక్​టాక్​​లో వీడియోలు పెట్టడమే నా జీవనాధారం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. మోదీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నాం" అని ఆమె తెలిపింది.

ప్రభావం చూపదు..

నిషేధం నిర్ణయం తమ మీద ప్రభావం చూపదని అంటోంది 23 ఏళ్ల సుక్రిత్​ జైన్​. 'ద గ్రేట్​ ఇండియన్​ ఫుడీ' అనే అకౌంట్​ను ఈమె నడిపేది. అయితే టిక్​టాక్​ నిషేధం ఎదుర్కొనడం వల్ల ఈ కంటెంట్​ను వేరే మాధ్యమాల్లో పోస్టు చేస్తానని చెబుతోంది. ఇప్పటికే యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన వీడియోలు పోస్టు చేస్తున్నట్లు తెలిపింది.

టిక్​టాక్​లో ఫేమస్​ అయిన భాజపా నేత​ సోనాలీ ఫొగాట్​ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమెకు టిక్​టాక్​లో 2,80,000 ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్​ వీడియోలతో సోనాలీ ఆకట్టుకునేవారు. ఈ యాప్​ వల్లే 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి బాగా పేరుతెచ్చుకున్నారీ హరియాణా మహిళ.

"ప్రభుత్వం నిర్ణయానికి బద్ధురాలినై ఉన్నాను. భారత్​ నిధులు చైనాకు తరలిపోతున్నాయి. ఆర్థికంగా ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతోంది. వాటితోనే మన బలగాలపై ఆ దేశం దాడులకు పాల్పడుతోంది. మేము మిగతా యాప్​లను ఫాలో అవుతున్నాం. ఇన్​స్టా, ఫేస్​బుక్​, ట్విట్టర్​ ఇందులో ఉన్నాయి. మనదేశంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉండగా మనమెందుకు ఇతరుల మీద ఆధారపడాలి?" అని ఫొగాట్ అన్నారు.

బతుకుదెరువు కోల్పోయాం..

పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడే​ మహేంద్ర దోగ్నేకు 9 మిలియన్ల టిక్​టాక్​ ఫాలోవర్లు, 1.49 మిలియన్ల యూట్యూబ్​ ఫాలోవర్లు ఉన్నారు. నిషేధం నిర్ణయంపై అతడూ స్పందించాడు.

"నిషేధం వల్ల కాస్త ఇబ్బందులున్నాయి. దేశ భద్రతకు ముప్పు అంటే కచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇది త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. టిక్​టాక్​ వల్లే చాలా మంది ఇండియన్​ కంటెంట్​ క్రియేటర్లు తమ కెరీర్​ను నెట్టుకొస్తున్నారు. ఈ ఫ్లాట్​ఫాం వల్లే వారు సంపాదించుకోగలుగుతున్నారు. అయితే నేను మాత్రం ఆఫ్​లైన్​లో సెమినార్లు ఇచ్చుకుంటా" అని మహేంద్ర వెల్లడించాడు.

ప్లాన్​లు మార్చుకోవాలి..

టిక్​టాక్​పై బ్యాన్​ వేయడం చిన్న సంస్థలు ప్రచారాలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు మాంక్​ ఎంటర్​టైన్​మెట్​ సీఈఓ విరాజ్​. టిక్​టాక్​ వంటి మాధ్యమాల ద్వారానే 25-30 శాతం సంస్థలు యువతను ఆకట్టుకొని వ్యాపారాలను వృద్ధి చేసుకునేవి. వారి కోసం యాడ్​లు సహా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ నిషేధంతో ఆ ప్లాన్​లను మార్పుచేసుకొని వేరే సంస్థలతో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టిక్​టాక్​ను 2012లో చైనాకు చెందిన బైట్​డ్యాన్స్​ సంస్థ రూపొందించింది. డ్యాన్స్​, లిప్​ సింక్​, కామెడీ వంటి చిన్న వీడియోలకు ఇది వేదిక. 2017లో భారత్​లో అడుగుపెట్టిన ఈ యాప్​.. భారత్​లో విస్తృతంగా మార్కెట్​ పెంచుకుంది. 16-24 ఏళ్ల వయసున్నవారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఒక్క భారత్​లోనే 200 మిలియన్ల ఫాలోవర్లు ఈ యాప్​ సొంతం.

ప్రత్యామ్నాయంగా స్వదేశీ 'చింగారీ'...

టిక్​టాక్​కు భారతీయ ప్రత్యామ్నాయం ఉంది. చింగారీ పేరుతో తయారైన ఈ యాప్​నకు విపరీతమైన క్రేజ్​ దక్కుతోంది. టిక్​టాక్​ తరహాలోనే షార్ట్​ వీడియోలను షేర్​ చేసేందుకు 2018 నవంబర్​లో గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్​ సాయంతో వీడియోలను డౌన్​లోడ్​, అప్​లోడ్​ మాత్రమే కాదు చాటింగ్​ చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల్లోనే ఈ యాప్​ 400 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

టిక్​టాక్​... భారత్​లో విపరీతంగా ప్రజాదరణ పొందిన యాప్​. ఇందులో తమదైన నైపుణ్యాలను వీడియో రూపంలో ప్రదర్శిస్తూ చాలా మంది పేరు తెచ్చుకున్నారు. అయితే సోమవారం టిక్​టాక్​ సహా 59 యాప్​లపై నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఫలితంగా ఈ వేదికనే నమ్ముకున్న ఎందరో టిక్​టాక్​ యూజర్లు స్పందిస్తున్నారు. నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆదాయం, బతుకుదెరువు కోల్పోయామని చెబుతున్నారు.

మా గొప్పతనమే..

టిక్​టాక్​ను నిషేధించినంత మాత్రాన ఎవరి టాలెంట్​ను అడ్డుకోలేమని చెప్పింది 23 ఏళ్ల నిహారికా జైన్​. ఈమెకు ఆ యాప్​లో 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండేవారు. ఫలితంగా నెలకు రూ.30వేల ఆదాయం పొందేది. ఈ షార్ట్​ వీడియో యాప్​ నిషేధం తర్వాత ఆమె మాట్లాడుతూ.. " భారత ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతిస్తున్నాం. మేమంతా కంటెంట్​ క్రియేటర్లం. మా టాలెంట్​ వల్లే మేము పాపులర్​ అయ్యాం. టిక్​టాక్​ లేకపోతే మరో యాప్​ ద్వారా మా టాలెంట్​ను ప్రదర్శిస్తాం" అని జైన్​ చెప్పింది.

జీవనాధారం పోయినా మోదీకే మద్దతు...

మాస్​ కమ్యునికేషన్స్​లో పట్టా పొందిన మరో అమ్మయి ప్రస్తుతం రియాలిటీ షోలలో ఫ్రీ లాన్సర్​గా పనిచేస్తోంది. టిక్​టాక్​లో వీడియోలు పెట్టడం, విభిన్న స్టైల్స్​​ను అనుకరించడం, ఫ్యాషన్​పై దృష్టి పెట్టడం వల్ల తన కెరీర్​ను అభివృద్ధి చెందిందని చెప్పింది. ఆగస్టులో ఈ యాప్​లో చేరిన ఈమె.. దాదాపు 2.8 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుంది. వేర్వేరు సంస్థలకు ప్రచారం కల్పించేలా వీడియోలు చేసి నెలకు రూ.15 వేల నుంచి 30వేల రూపాయలు సంపాదించుకునేది. యాప్​ నిషేధించడం తనను షాక్​నకు గురిచేసిందని చెప్పిందిఆ అమ్మాయి. "టిక్​టాక్​​లో వీడియోలు పెట్టడమే నా జీవనాధారం. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే. మోదీ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నాం" అని ఆమె తెలిపింది.

ప్రభావం చూపదు..

నిషేధం నిర్ణయం తమ మీద ప్రభావం చూపదని అంటోంది 23 ఏళ్ల సుక్రిత్​ జైన్​. 'ద గ్రేట్​ ఇండియన్​ ఫుడీ' అనే అకౌంట్​ను ఈమె నడిపేది. అయితే టిక్​టాక్​ నిషేధం ఎదుర్కొనడం వల్ల ఈ కంటెంట్​ను వేరే మాధ్యమాల్లో పోస్టు చేస్తానని చెబుతోంది. ఇప్పటికే యూట్యూబ్​, ఇన్​స్టాగ్రామ్​ వేదికగా తన వీడియోలు పోస్టు చేస్తున్నట్లు తెలిపింది.

టిక్​టాక్​లో ఫేమస్​ అయిన భాజపా నేత​ సోనాలీ ఫొగాట్​ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈమెకు టిక్​టాక్​లో 2,80,000 ఫాలోవర్లు ఉన్నారు. డ్యాన్స్​ వీడియోలతో సోనాలీ ఆకట్టుకునేవారు. ఈ యాప్​ వల్లే 13 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తొలిసారి బాగా పేరుతెచ్చుకున్నారీ హరియాణా మహిళ.

"ప్రభుత్వం నిర్ణయానికి బద్ధురాలినై ఉన్నాను. భారత్​ నిధులు చైనాకు తరలిపోతున్నాయి. ఆర్థికంగా ఆ దేశం బాగా అభివృద్ధి చెందుతోంది. వాటితోనే మన బలగాలపై ఆ దేశం దాడులకు పాల్పడుతోంది. మేము మిగతా యాప్​లను ఫాలో అవుతున్నాం. ఇన్​స్టా, ఫేస్​బుక్​, ట్విట్టర్​ ఇందులో ఉన్నాయి. మనదేశంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉండగా మనమెందుకు ఇతరుల మీద ఆధారపడాలి?" అని ఫొగాట్ అన్నారు.

బతుకుదెరువు కోల్పోయాం..

పలు అంశాలపై అనర్గళంగా మాట్లాడే​ మహేంద్ర దోగ్నేకు 9 మిలియన్ల టిక్​టాక్​ ఫాలోవర్లు, 1.49 మిలియన్ల యూట్యూబ్​ ఫాలోవర్లు ఉన్నారు. నిషేధం నిర్ణయంపై అతడూ స్పందించాడు.

"నిషేధం వల్ల కాస్త ఇబ్బందులున్నాయి. దేశ భద్రతకు ముప్పు అంటే కచ్చితంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఇది త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. టిక్​టాక్​ వల్లే చాలా మంది ఇండియన్​ కంటెంట్​ క్రియేటర్లు తమ కెరీర్​ను నెట్టుకొస్తున్నారు. ఈ ఫ్లాట్​ఫాం వల్లే వారు సంపాదించుకోగలుగుతున్నారు. అయితే నేను మాత్రం ఆఫ్​లైన్​లో సెమినార్లు ఇచ్చుకుంటా" అని మహేంద్ర వెల్లడించాడు.

ప్లాన్​లు మార్చుకోవాలి..

టిక్​టాక్​పై బ్యాన్​ వేయడం చిన్న సంస్థలు ప్రచారాలకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు మాంక్​ ఎంటర్​టైన్​మెట్​ సీఈఓ విరాజ్​. టిక్​టాక్​ వంటి మాధ్యమాల ద్వారానే 25-30 శాతం సంస్థలు యువతను ఆకట్టుకొని వ్యాపారాలను వృద్ధి చేసుకునేవి. వారి కోసం యాడ్​లు సహా ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈ నిషేధంతో ఆ ప్లాన్​లను మార్పుచేసుకొని వేరే సంస్థలతో సత్సంబంధాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టిక్​టాక్​ను 2012లో చైనాకు చెందిన బైట్​డ్యాన్స్​ సంస్థ రూపొందించింది. డ్యాన్స్​, లిప్​ సింక్​, కామెడీ వంటి చిన్న వీడియోలకు ఇది వేదిక. 2017లో భారత్​లో అడుగుపెట్టిన ఈ యాప్​.. భారత్​లో విస్తృతంగా మార్కెట్​ పెంచుకుంది. 16-24 ఏళ్ల వయసున్నవారే ఇందులో ఎక్కువగా ఉన్నారు. ఒక్క భారత్​లోనే 200 మిలియన్ల ఫాలోవర్లు ఈ యాప్​ సొంతం.

ప్రత్యామ్నాయంగా స్వదేశీ 'చింగారీ'...

టిక్​టాక్​కు భారతీయ ప్రత్యామ్నాయం ఉంది. చింగారీ పేరుతో తయారైన ఈ యాప్​నకు విపరీతమైన క్రేజ్​ దక్కుతోంది. టిక్​టాక్​ తరహాలోనే షార్ట్​ వీడియోలను షేర్​ చేసేందుకు 2018 నవంబర్​లో గూగుల్​ ప్లేస్టోర్​లో అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్​ సాయంతో వీడియోలను డౌన్​లోడ్​, అప్​లోడ్​ మాత్రమే కాదు చాటింగ్​ చేసుకోవచ్చు. గత కొన్ని రోజుల్లోనే ఈ యాప్​ 400 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.