ETV Bharat / business

వాట్సాప్​కు రూ.2 వేల కోట్ల జరిమానా!

author img

By

Published : Sep 3, 2021, 11:35 AM IST

Updated : Sep 3, 2021, 5:42 PM IST

నిబంధనల ఉల్లంగనకు పాల్పడిందనే కారణంతో వాట్సాప్​కు (Fine to WhatsApp) దాదాపు రూ.2 వేల కోట్ల జరిగిమాన విధించింది ఐరిష్ నిఘా సంస్థ (Irish watchdog). 2018 నుంచి జరిపిన దర్యాప్తు ఆధారంగా ఈమేరకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

WhatsApp
వాట్సాప్​

ప్రముఖ మెసేజింగ్ సేవల యాప్​ వాట్సాప్​.. మరోసారి డేటా ప్రైవసీ వివాదంలో (WhatsApp data privacy Issue) చిక్కుకుంది. యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ ఫేస్​బుక్​ సహా గ్రూప్​లోని ఇతర సంస్థలతో పంచుకునే విషయమై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలను ఉల్లఘించినట్లు ఐర్లాండ్​ నిఘా సంస్థ (Irish watchdog) ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే నిబంధనల అతిక్రమించిందనే కారణంతో 225 మిలియన్​ యూరోలు ( దాదాపు రూ.2 వేల కోట్లు) జరిమానా (Fine to WhatsApp) విధించింది.

అదే విధంగా.. వాట్సాప్ ఈ విషయంపై వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఐరిష్ నిఘా సంస్థ. ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.

ఇదే అతిపెద్ద జరిమానా..

జనరల్​ డేటా ప్రొటెక్షన్​ రెగ్యులేషన్ (జీడీపీఆర్​)ను ఈయూ అమలులోకి తెచ్చిన తర్వాత.. 2018లో వాట్సాప్​పై దర్యాప్తు ప్రారంభించింది ఐరిష్​ నిఘా సంస్థ. ఇటీవలే దర్యాప్తును ముగించి.. ఈ జరిమానా విధించింది. ఐరిష్​ నిఘా సంస్థ విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ట్విట్టర్​కు కూడా ఇలాంటి కారణాలతోనే.. 4.5 లక్షల యూరోల జరిమానా వేసింది.

జీడీపీఆర్​ నిబంధనలు పాటించలేదనే కారణంతో.. అమెజాన్​పై ఈ ఏడాది జులైలో లగ్జెంబర్గ్​ నిఘా సంస్థ ఏకంగా 746 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది.

వాట్సాప్​ అసంతృప్తి..

జరిమానా విషయంపై వాట్సాప్ స్పందించింది. యుజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. భవిష్యత్​లోనూ దీనిని కొనసాగిస్తామని.. వివరించింది. అయితే నిఘా సంస్థ చేస్తున్న ఆరోపణలకు, విధించిన జరిమానాకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక! మోడ్​​ యాప్​ వాడితే అంతే..

ప్రముఖ మెసేజింగ్ సేవల యాప్​ వాట్సాప్​.. మరోసారి డేటా ప్రైవసీ వివాదంలో (WhatsApp data privacy Issue) చిక్కుకుంది. యూజర్ల డేటాను దాని మాతృ సంస్థ ఫేస్​బుక్​ సహా గ్రూప్​లోని ఇతర సంస్థలతో పంచుకునే విషయమై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలను ఉల్లఘించినట్లు ఐర్లాండ్​ నిఘా సంస్థ (Irish watchdog) ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగానే నిబంధనల అతిక్రమించిందనే కారణంతో 225 మిలియన్​ యూరోలు ( దాదాపు రూ.2 వేల కోట్లు) జరిమానా (Fine to WhatsApp) విధించింది.

అదే విధంగా.. వాట్సాప్ ఈ విషయంపై వెంటనే తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఐరిష్ నిఘా సంస్థ. ఐరోపా సమాఖ్య (ఈయూ) నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు ఉండాలని స్పష్టం చేసింది.

ఇదే అతిపెద్ద జరిమానా..

జనరల్​ డేటా ప్రొటెక్షన్​ రెగ్యులేషన్ (జీడీపీఆర్​)ను ఈయూ అమలులోకి తెచ్చిన తర్వాత.. 2018లో వాట్సాప్​పై దర్యాప్తు ప్రారంభించింది ఐరిష్​ నిఘా సంస్థ. ఇటీవలే దర్యాప్తును ముగించి.. ఈ జరిమానా విధించింది. ఐరిష్​ నిఘా సంస్థ విధించిన అతిపెద్ద జరిమానా ఇదే కావడం గమనార్హం. గత ఏడాది ట్విట్టర్​కు కూడా ఇలాంటి కారణాలతోనే.. 4.5 లక్షల యూరోల జరిమానా వేసింది.

జీడీపీఆర్​ నిబంధనలు పాటించలేదనే కారణంతో.. అమెజాన్​పై ఈ ఏడాది జులైలో లగ్జెంబర్గ్​ నిఘా సంస్థ ఏకంగా 746 మిలియన్​ డాలర్ల జరిమానా విధించింది.

వాట్సాప్​ అసంతృప్తి..

జరిమానా విషయంపై వాట్సాప్ స్పందించింది. యుజర్లకు సురక్షితమైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. భవిష్యత్​లోనూ దీనిని కొనసాగిస్తామని.. వివరించింది. అయితే నిఘా సంస్థ చేస్తున్న ఆరోపణలకు, విధించిన జరిమానాకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంపై అప్పీలుకు వెళ్లనున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక! మోడ్​​ యాప్​ వాడితే అంతే..

Last Updated : Sep 3, 2021, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.