ETV Bharat / business

2020-21లో ఐటీ ఆదాయం 2.3% వృద్ధి!

author img

By

Published : Feb 15, 2021, 5:04 PM IST

కరోనా సంక్షోభంలోనూ అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటీ పరిశ్రమేనని 'నాస్కాం' వెల్లడించింది. 2020-21లో కొత్తగా 1.38 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపింది. ఇదే సమయానికి ఐటీ పరిశ్రమ ఆదాయం 2.3 శాతం పెరగొచ్చని అంచనా వేసింది.

Nasscom on Indian IT sector Growth
భారత ఐటీ రంగం వృద్ధిపై నాస్కాం అంచనా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ ఆదాయం 2.3 శాతం పెరిగి.. 194 బిలియన్​ డాలర్లకు చేరొచ్చని ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' అంచనా వేసింది. ఇదే సమయంలో ఐటీ ఎగుమతులు 1.9 శాతం వృద్ధితో 1.5 బిలియన్​ డాలర్లుగా నమోదవ్వచ్చని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటీ పరిశ్రమ ఒక్కటేనని నాస్కాం పేర్కొంది. కరోనా సంక్షోభంలోనూ 1.38 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. ఫలితంగా మొత్తం ఉద్యోగాల సంఖ్య 44.7 లక్షలకు చేరినట్లు వివరించింది.

2021లో ఐటీ పరిశ్రమ సానుకూలంగా ఉండొచ్చని, వ్యయాలు పెరుగుతాయని.. 100లో 71 టెక్​ సంస్థల ఎగ్జిక్యూటివ్​లు భావిస్తున్నట్లు నాస్కాం పేర్కొంది.

ఇదీ చదవండి:వినియోగదారుల గోప్యతపై వాట్సాప్​, కేంద్రానికి నోటీసులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ ఆదాయం 2.3 శాతం పెరిగి.. 194 బిలియన్​ డాలర్లకు చేరొచ్చని ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' అంచనా వేసింది. ఇదే సమయంలో ఐటీ ఎగుమతులు 1.9 శాతం వృద్ధితో 1.5 బిలియన్​ డాలర్లుగా నమోదవ్వచ్చని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటీ పరిశ్రమ ఒక్కటేనని నాస్కాం పేర్కొంది. కరోనా సంక్షోభంలోనూ 1.38 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. ఫలితంగా మొత్తం ఉద్యోగాల సంఖ్య 44.7 లక్షలకు చేరినట్లు వివరించింది.

2021లో ఐటీ పరిశ్రమ సానుకూలంగా ఉండొచ్చని, వ్యయాలు పెరుగుతాయని.. 100లో 71 టెక్​ సంస్థల ఎగ్జిక్యూటివ్​లు భావిస్తున్నట్లు నాస్కాం పేర్కొంది.

ఇదీ చదవండి:వినియోగదారుల గోప్యతపై వాట్సాప్​, కేంద్రానికి నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.