ETV Bharat / business

Gautam Adani: ఒక్క వారంలో రూ.లక్ష కోట్లు లాస్​! - వారంలో గౌతం అదానీ నష్టం

పారిశ్రామిక దిగ్గజం గౌతమ్​ అదానీ ఒక్క వారంలో రికార్డు స్థాయి నష్టాన్ని మూటగట్టుకున్నారు. వారం ఆరంభంలో వచ్చిన ఓ వార్త సంస్థ షేర్లను కుదిపేయడం ఇందుకు ప్రధాన కారణం. బ్లూమ్​బర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం.. గౌతం అదానీ ఈ ఒక్క వారమే దాదాపు రూ.లక్ష కోట్లు కోల్పోయారు.

Why Gautam Adani wealth Vanishing
గౌతమ్ అదానీకి రికార్డు నష్టం
author img

By

Published : Jun 18, 2021, 7:11 PM IST

భారత బిలియనీర్‌ గౌతమ్​ అదానీ సంపద ఈ వారంలో రికార్డు స్థాయిలో ఆవిరైంది. బ్లూమ్​బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. ప్రపంచంలో ఏ వ్యక్తి కోల్పోనంతగా 13.2 బిలియన్‌ డాలర్లు ఆయన నష్టపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 63.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ నష్టంతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడి ర్యాంక్​ను కోల్పోయారు అదానీ.

కొన్ని రోజుల క్రితం వరకూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్​ అంబానీతో గౌతమ్​ అదానీ​ దాదాపు సమానంగా ఉండగా.. ఈ వారం లెక్కలు తారుమారయ్యాయి. అదానీ షేర్లు ఈ వారం మొత్తం రికార్డు పతనాన్ని చవి చూడటం ఇందుకు కారణం.

షేర్ల పతనానికి కారణాలు..

అదానీ గ్రూప్​లో దాదాపు రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్న విదేశీ పెట్టుబడి సంస్థలైన.. అల్బులా ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​, క్రెస్ట ఫండ్, ఏపీఎంఎస్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్ నిలిపివేసినట్లు సోమవారం​ వార్తలొచ్చాయి. ప్రివెన్షన్​ ఆఫ్​ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్​ఏ) ప్రకారం అవసరమైన సమాచారం సమర్పించకపోవడమే ఆయా సంస్థల ఖాతాల నిలిపివేతకు కారణం అనేది ఆ వార్తల్లోని సారాంశం.

ఈ వార్తలతో సోమవారం రికార్డు స్థాయిలో పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు.. వారం మొత్తం నష్టపోతూనే వచ్చాయి. 5 సెషన్లలోనూ షేర్లు లోవర్​ సర్క్యూట్​ను తాకటం గమనార్హం.

ఖాతాల నిలిపివేతపై క్లారిటీ..

తమ సంస్థపై వచ్చిన వార్తలను.. నిర్లక్ష్య పూరితమైన తప్పిదంగా పేర్కొంటూ అదానీ సోమవారమే క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించటానికే ఇది జరిగిందని.. ఇది మదుపరులకు ఆర్థికంగా తీరని నష్టాన్ని చేకూర్చుతుందని, సంస్థ ఖ్యాతిని దెబ్బతీస్తుందని లిఖిత పూర్వకంగా ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత కూడా సంస్థ షేర్లు కుదేలవడం గమనార్హం.

ఇదీ చదవండి:Adani Group: ఆమె ట్వీట్​ వల్లే ఇంత నష్టం?

భారత బిలియనీర్‌ గౌతమ్​ అదానీ సంపద ఈ వారంలో రికార్డు స్థాయిలో ఆవిరైంది. బ్లూమ్​బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం.. ప్రపంచంలో ఏ వ్యక్తి కోల్పోనంతగా 13.2 బిలియన్‌ డాలర్లు ఆయన నష్టపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 63.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఈ నష్టంతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడి ర్యాంక్​ను కోల్పోయారు అదానీ.

కొన్ని రోజుల క్రితం వరకూ ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్​ అంబానీతో గౌతమ్​ అదానీ​ దాదాపు సమానంగా ఉండగా.. ఈ వారం లెక్కలు తారుమారయ్యాయి. అదానీ షేర్లు ఈ వారం మొత్తం రికార్డు పతనాన్ని చవి చూడటం ఇందుకు కారణం.

షేర్ల పతనానికి కారణాలు..

అదానీ గ్రూప్​లో దాదాపు రూ.43,500 కోట్ల పెట్టుబడులు ఉన్న విదేశీ పెట్టుబడి సంస్థలైన.. అల్బులా ఇన్వెస్ట్​మెంట్ ఫండ్​, క్రెస్ట ఫండ్, ఏపీఎంఎస్​ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్​ఎస్​డీఎల్ నిలిపివేసినట్లు సోమవారం​ వార్తలొచ్చాయి. ప్రివెన్షన్​ ఆఫ్​ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్​ఏ) ప్రకారం అవసరమైన సమాచారం సమర్పించకపోవడమే ఆయా సంస్థల ఖాతాల నిలిపివేతకు కారణం అనేది ఆ వార్తల్లోని సారాంశం.

ఈ వార్తలతో సోమవారం రికార్డు స్థాయిలో పతనమైన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు.. వారం మొత్తం నష్టపోతూనే వచ్చాయి. 5 సెషన్లలోనూ షేర్లు లోవర్​ సర్క్యూట్​ను తాకటం గమనార్హం.

ఖాతాల నిలిపివేతపై క్లారిటీ..

తమ సంస్థపై వచ్చిన వార్తలను.. నిర్లక్ష్య పూరితమైన తప్పిదంగా పేర్కొంటూ అదానీ సోమవారమే క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని వెల్లడించింది. పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించటానికే ఇది జరిగిందని.. ఇది మదుపరులకు ఆర్థికంగా తీరని నష్టాన్ని చేకూర్చుతుందని, సంస్థ ఖ్యాతిని దెబ్బతీస్తుందని లిఖిత పూర్వకంగా ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత కూడా సంస్థ షేర్లు కుదేలవడం గమనార్హం.

ఇదీ చదవండి:Adani Group: ఆమె ట్వీట్​ వల్లే ఇంత నష్టం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.