ETV Bharat / business

ఏప్రిల్ 1 నుంచి ఆ చెక్​బుక్​లు చెల్లవ్!

author img

By

Published : Mar 16, 2021, 1:45 PM IST

గత రెండేళ్లలో ఇతర బ్యాంక్​లతో విలీనమైన బ్యాంక్​ల పాస్​బుక్​లు, చెక్​బుక్​లు ఏప్రిల్​ 1 నుంచి నిరుపయోగంగా మారనున్నాయి. ఇందుకు కారణాలేమిటి? రెండేళ్లలో ఇతర బ్యాంక్​లతో విలీనమైన బ్యాంక్​లేవి? అందులో మీ బ్యాంక్​ కూడా ఉందా? అనే వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.

Changes in bank services From April 1
విలీన బ్యాంకుల సేవల్లో మార్పులు

ఏప్రిల్​ 1 నుంచి పలు బ్యాంక్​ల సేవల్లో భారీ మార్పులు రానున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్​ల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ, ఎంఐసీఆర్​ కోడ్​లూ మారనున్నాయి.

విలీనమైన బ్యాంక్​లు ఇవే..

ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్​ నేషనల్ బ్యాంక్​లో విలీనమయ్యాయి. సిండికేట్ బ్యాంక్​ కెనరా బ్యాంక్​లో విలీనమైంది.

ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్​లు​ యూనియన్ బ్యాంక్​లో విలీనమయ్యాయి. అలహాబాద్​ బ్యాంక్​ ఇండియన్​ బ్యాంక్​లో విలీనమైంది. గత ఏడాది ఏప్రిల్​ నుంచి వీటి విలీనం అమల్లోకి వచ్చింది.

అంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనమయ్యాయి. 2019 ఏప్రిల్​ 1 నుంచి వీటి విలీనం అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే చెక్​బుక్​, పాస్​బుక్​ మార్చుకోవాల్సిన అవసరమున్న ఖాతాదారులందరికీ ఆయా బ్యాంక్​లు సమాచారమిచ్చాయి.

సమస్యలు ఉండొద్దంటే..

ఏప్రిల్​ 1 తర్వాత సేవల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే.. విలీనమైన బ్యాంకుల్లో ఖాతాలున్న వినియోగదారులు తమ వివరాలను వీలైనంత త్వరగా అప్​డేట్​ చేసుకోవాలి. కొత్త బ్యాంక్​కు కావాల్సిన వివరాలు చెప్పడం ద్వారా.. కొత్త చెక్​బుక్​, పాస్​బుక్​ పొందొచ్చు.

ఇదీ చదవండి:మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

ఏప్రిల్​ 1 నుంచి పలు బ్యాంక్​ల సేవల్లో భారీ మార్పులు రానున్నాయి. ముఖ్యంగా గత రెండేళ్లలో ఇతర బ్యాంకుల్లో విలీనమైన బ్యాంక్​ల చెక్​బుక్​లు, పాస్​బుక్​లు నిరుపయోగంగా మారనున్నాయి. ఆయా బ్యాంకుల ఐఎఫ్​ఎస్​సీ, ఎంఐసీఆర్​ కోడ్​లూ మారనున్నాయి.

విలీనమైన బ్యాంక్​లు ఇవే..

ఓరియంటల్ బ్యాంక్​ ఆఫ్ కామర్స్, యునైటెడ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ పంజాబ్​ నేషనల్ బ్యాంక్​లో విలీనమయ్యాయి. సిండికేట్ బ్యాంక్​ కెనరా బ్యాంక్​లో విలీనమైంది.

ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్​లు​ యూనియన్ బ్యాంక్​లో విలీనమయ్యాయి. అలహాబాద్​ బ్యాంక్​ ఇండియన్​ బ్యాంక్​లో విలీనమైంది. గత ఏడాది ఏప్రిల్​ నుంచి వీటి విలీనం అమల్లోకి వచ్చింది.

అంతకుముందు బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ విలీనమయ్యాయి. 2019 ఏప్రిల్​ 1 నుంచి వీటి విలీనం అమల్లోకి వచ్చింది.

ఇప్పటికే చెక్​బుక్​, పాస్​బుక్​ మార్చుకోవాల్సిన అవసరమున్న ఖాతాదారులందరికీ ఆయా బ్యాంక్​లు సమాచారమిచ్చాయి.

సమస్యలు ఉండొద్దంటే..

ఏప్రిల్​ 1 తర్వాత సేవల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే.. విలీనమైన బ్యాంకుల్లో ఖాతాలున్న వినియోగదారులు తమ వివరాలను వీలైనంత త్వరగా అప్​డేట్​ చేసుకోవాలి. కొత్త బ్యాంక్​కు కావాల్సిన వివరాలు చెప్పడం ద్వారా.. కొత్త చెక్​బుక్​, పాస్​బుక్​ పొందొచ్చు.

ఇదీ చదవండి:మీడియాలో వాటా విక్రయానికి జాక్​ మాపై చైనా ఒత్తిడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.