ETV Bharat / business

జీఎస్టీపై చిన్నవ్యాపారాలకు కేంద్రం గుడ్​న్యూస్

రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ఇక నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు. చిన్న పన్ను చెల్లింపుదారులు ఏడాదికి ఎనిమిది రిటర్నులు సమర్పిస్తే చాలని స్పష్టం చేశారు. జనవరి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని చెప్పారు. నెలవారీ చెల్లింపుతో త్రైమాసిక రిటర్నుల ఫైలింగ్ పేరుతో పథకం తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Dec 7, 2020, 9:10 PM IST

GST-registered small biz to file 4 sales returns in a year from Jan
జీఎస్టీపై చిన్నవ్యాపారాలకు కేంద్రం గుడ్​న్యూస్

జీఎస్టీ రిటర్నులపై వ్యాపారులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు.. ఇక నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్నులు లేదా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు ప్రస్తుతం 12 జీఎస్టీ రిటర్నులు సమర్పిస్తున్నాయి.

నెలవారీ చెల్లింపుతో త్రైమాసిక రిటర్నుల ఫైలింగ్​(క్యూఆర్ఎంపీ) పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల 94 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. మొత్తం జీఎస్టీలో 92 శాతం ఈ వ్యాపారాల నుంచే వస్తోందని చెప్పారు. మరోవైపు, ఈ పథకంలో భాగంగా చిన్నస్థాయి ​చెల్లింపుదారులు ఏడాదికి ఎనిమిది(నాలుగు జీఎస్టీఆర్-3బీ, నాలుగు జీఎస్టీఆర్-1) రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు.

నకిలీ ఇన్వాయిస్​లకు చెక్​ పెట్టే విధంగా పథకంలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్​ సౌలభ్యాన్ని రిపోర్ట్ చేసిన ఇన్వాయిస్​లకే అందించనున్నట్లు తెలిపారు.

ఇన్వాయిస్​లు మొదటి రెండు నెలల్లోనే

క్యూఆర్​ఎంపీ పథకంలో ఇన్వాయిస్ ఫైలింగ్ ఫెసిలిటీ(ఐఎఫ్​సీ) అనే ఐచ్ఛిక వెసులుబాటు ఉందని తెలిపారు. త్రైమాసిక రిటర్నులు సమర్పించాలని అనుకొనే చెల్లింపుదారులు.. సంబంధిత త్రైమాసిక మొదటి రెండు నెలల్లో ఇన్వాయిస్​లను అప్​లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు. ఒక నెలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్​లను అప్​లోడ్ చేయాల్సిన అవసరం లేదని.. ఇన్వాయిస్​లను స్వీకరించేవారి డిమాండ్​ను బట్టి వాటిని అప్​లోడ్ చేయవచ్చని తెలిపారు. తొలి, రెండో నెలకు సంబంధించిన మిగిలిన ఇన్వాయిస్​లు త్రైమాసిక జీఎస్టీఆర్-1 ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.

జీఎస్టీ రిటర్నులపై వ్యాపారులకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు.. ఇక నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్నులు లేదా జీఎస్టీఆర్-3బీని దాఖలు చేస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ పరిధిలోకి వచ్చే వ్యాపారాలు ప్రస్తుతం 12 జీఎస్టీ రిటర్నులు సమర్పిస్తున్నాయి.

నెలవారీ చెల్లింపుతో త్రైమాసిక రిటర్నుల ఫైలింగ్​(క్యూఆర్ఎంపీ) పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం వల్ల 94 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుందని వెల్లడించారు. మొత్తం జీఎస్టీలో 92 శాతం ఈ వ్యాపారాల నుంచే వస్తోందని చెప్పారు. మరోవైపు, ఈ పథకంలో భాగంగా చిన్నస్థాయి ​చెల్లింపుదారులు ఏడాదికి ఎనిమిది(నాలుగు జీఎస్టీఆర్-3బీ, నాలుగు జీఎస్టీఆర్-1) రిటర్నులు సమర్పిస్తే సరిపోతుందని చెప్పారు.

నకిలీ ఇన్వాయిస్​లకు చెక్​ పెట్టే విధంగా పథకంలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు అధికారులు. ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్​ సౌలభ్యాన్ని రిపోర్ట్ చేసిన ఇన్వాయిస్​లకే అందించనున్నట్లు తెలిపారు.

ఇన్వాయిస్​లు మొదటి రెండు నెలల్లోనే

క్యూఆర్​ఎంపీ పథకంలో ఇన్వాయిస్ ఫైలింగ్ ఫెసిలిటీ(ఐఎఫ్​సీ) అనే ఐచ్ఛిక వెసులుబాటు ఉందని తెలిపారు. త్రైమాసిక రిటర్నులు సమర్పించాలని అనుకొనే చెల్లింపుదారులు.. సంబంధిత త్రైమాసిక మొదటి రెండు నెలల్లో ఇన్వాయిస్​లను అప్​లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు. ఒక నెలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్​లను అప్​లోడ్ చేయాల్సిన అవసరం లేదని.. ఇన్వాయిస్​లను స్వీకరించేవారి డిమాండ్​ను బట్టి వాటిని అప్​లోడ్ చేయవచ్చని తెలిపారు. తొలి, రెండో నెలకు సంబంధించిన మిగిలిన ఇన్వాయిస్​లు త్రైమాసిక జీఎస్టీఆర్-1 ద్వారా సమర్పించవచ్చని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.