ముడి సరకు వ్యయాల పెరుగుదలతో ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాల ధరలు క్రమంగా పెంచుతున్నాయి. అయితే దేశీయ బైక్ల తయారీ కంపెనీ 'బజాజ్ ఆటో'(Bajaj Auto) మాత్రం ధరల తగ్గింపునకు నిర్ణయం తీసుకుంది. డామినార్ 250 బైక్ ధరను రూ.16.5 వేల వరకు తగ్గించింది. దీనితో ఈ బైక్ ధర (హైదరాబాద్ ఎక్స్షోరూం) రూ.1.54 లక్షలకు దిగొచ్చింది.
తాజా నిర్ణయంతో డామినార్ 400 బైక్తో పోలిస్తే.. డామినార్ 250 బైక్ ధర దాదాపు రూ.60 వేలు తక్కువైంది.
డామినార్ 250 బైక్ 2020లో మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో దీని ప్రారంభ ధర రూ.1.60 లక్షలుగా ఉండగా.. ఒకానొక దశలో రూ.1.71 లక్షల పైకి కూడా చేరింది. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు గానూ.. బైక్ ధరలను సవరిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారీగా కోత విధించినట్లు తెలుస్తోంది.
ఫీచర్లు ఇలా..
- 248 సీసీ సింగిల్ సిలిండర్, 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్
- 27 పీఎస్ పవర్ విడుదల చేసే సామర్థ్యం
- 6 గేర్ ట్రాన్స్ మిషన్
- గరిష్ఠ వేగం గంటకు 132 కిలోమీటర్లు
- రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్ సౌకర్యం
- డిజిటల్ స్పీడో మీటర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి
ఇదీ చదవండి: