జపాన్కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ 'ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్' (ఏఎన్ఏ) చెన్నై నుంచి టోక్యోకు నేరుగా విమానసేవలను ప్రారంభించింది. దీనితో టోక్యోలోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విమానసేవలు అందిస్తున్న దక్షిణ భారత నగరంగా చెన్నై నిలిచింది.
"భారత్ నుంచి టోక్యోకు విమాన సర్వీసులు నడుపుతున్న నగరాలు మూడు ఉన్నాయి. ఈ సేవలు కల్గిన మూడో నగరం చెన్నై. దక్షిణ భారతదేశంలో మొదటిది."- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
వారానికి మూడు సార్లు
చెన్నై-నరిటాకు వారానికి మూడు సార్లు ఏఎన్ఏ విమానాలను నడుపుతుంది. టోక్యో నుంచి ఆదివారం వచ్చిన మొదటి విమానం చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
దిల్లీ, ముంబయి తరువాత చెన్నై నుంచి విమానసేవలు ప్రారంభిస్తామని జనవరిలోనే ఏఎన్ఏ ప్రకటించింది. ఫలితంగా భారత్ నుంచి ఏఎన్ఏ విమాన సర్వీసుల సంఖ్య 46కు చేరుకుంది.
బెంగళూరు, హైదరాబాద్లకూ..
బెంగళూరు, హైదరాబాద్ల్లోనూ విమానసేవలు ప్రారంభించే అవకాశం ఉందని ఏఎన్ఏ జనరల్ మేనేజర్ (ఇండియా) యసువో టాకి తెలిపారు. రాబోయే రోజుల్లో చెన్నై నుంచి మరిన్ని విమానాలు నడుపుతామని ఆయన చెప్పారు.
ఇదీ చూడండి: 'మహా' పాలనపై శివసేన అధినేతతో అమిత్షా భేటీ!