ETV Bharat / business

'రూటు' మార్చిన ఎయిర్ ఇండియా- సమయం, ఇంధనం ఆదా! - హిందూ కుష్​ విమాన రూట్​

ఎయిర్ ఇండియాను లాభాల బాట పట్టించేలా టాటా యాజమాన్యం వినూత్న దారులను వెతుకుతోంది. ఇకపై లండన్​, అమెరికాకు వెళ్లే విమానాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విమాన మార్గం ద్వారా ప్రయాణించనున్నాయి. దీంతో సమయంతో పాటు ఇంధనం కూడా పొదుపు చేయవచ్చని సంస్థ భావిస్తుంది.

Air India
ఎయిర్​ ఇండియా
author img

By

Published : Dec 21, 2021, 7:08 AM IST

ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా యాజమాన్యం పొదుపు చర్యలను చేపట్టింది. అమెరికా, యూరప్​ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్​ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చని సంస్థ భావిస్తుంది.

అప్గాన్​ గగనతలం మూసివేయడం కారణంగా భారత్​ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు హిందూకుష్​ మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నాయి. ప్రపంచంలోని ఎత్తైన విమాన మార్గాలలో హిందూకుష్ ఒకటిని, ఈ మార్గం ద్వారా నడిపితే సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎయిర్ ఇండియా సర్వీసులలో ఒకటి అయిన టొరంటో నుంచి దిల్లీకి వెళ్లే విమానం ఈ నెల 16న హిందూ కుష్ మార్గంలోనే ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత వారం టొరంటో మార్గంలో నలుగురు పైలట్‌లను అందుబాటులో ఉంచింది.

అఫ్గానిస్థాన్​ గగగతలాన్ని మూసివేసిన తరువాత దిల్లీ నుంచి లండన్​ చేరుకోవడానికి సుమారు 9.5 గంటలు పట్టేది. కానీ హిందూకుష్ మార్గంలో ప్రయాణించడం వల్ల 8.5 గంటల్లోనే చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎయిర్​ ఇండియాకు సుమారు 2.5 టన్నుల ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అఫ్గాన్​ రూట్​తో పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. గాలి వీచే దాని ప్రకారం 5 టన్నుల వరకు ఇంధనాన్ని పొదుపు చేయవచ్చని వివరించారు.

టాటాలకు సీసీఐ అనుమతి

ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటా, ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రై.లి.లో (ఏఐఎస్‌ఏటీఎస్‌) 50% వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌నకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సోమవారం ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్​పై పన్నులు.. కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు

ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న టాటా యాజమాన్యం పొదుపు చర్యలను చేపట్టింది. అమెరికా, యూరప్​ దేశాలకు వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన విమాన మార్గాన్ని ఎంచుకుంది. ఇకపై ఆ దేశాలకు వెళ్లే విమానాలు హిందూకుష్​ పై నుంచి ప్రయాణించనున్నాయి. ఇలా చేయడం కారణంగా సమయంతో పాటు ఇంధనాన్ని కూడా ఆదా చేయవచ్చని సంస్థ భావిస్తుంది.

అప్గాన్​ గగనతలం మూసివేయడం కారణంగా భారత్​ నుంచి ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు హిందూకుష్​ మార్గం ద్వారానే ప్రయాణిస్తున్నాయి. ప్రపంచంలోని ఎత్తైన విమాన మార్గాలలో హిందూకుష్ ఒకటిని, ఈ మార్గం ద్వారా నడిపితే సమయంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎయిర్ ఇండియా సర్వీసులలో ఒకటి అయిన టొరంటో నుంచి దిల్లీకి వెళ్లే విమానం ఈ నెల 16న హిందూ కుష్ మార్గంలోనే ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గత వారం టొరంటో మార్గంలో నలుగురు పైలట్‌లను అందుబాటులో ఉంచింది.

అఫ్గానిస్థాన్​ గగగతలాన్ని మూసివేసిన తరువాత దిల్లీ నుంచి లండన్​ చేరుకోవడానికి సుమారు 9.5 గంటలు పట్టేది. కానీ హిందూకుష్ మార్గంలో ప్రయాణించడం వల్ల 8.5 గంటల్లోనే చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎయిర్​ ఇండియాకు సుమారు 2.5 టన్నుల ఇంధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అఫ్గాన్​ రూట్​తో పోల్చితే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. గాలి వీచే దాని ప్రకారం 5 టన్నుల వరకు ఇంధనాన్ని పొదుపు చేయవచ్చని వివరించారు.

టాటాలకు సీసీఐ అనుమతి

ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100% వాటా, ఎయిరిండియా శాట్స్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ప్రై.లి.లో (ఏఐఎస్‌ఏటీఎస్‌) 50% వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌నకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సోమవారం ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్​పై పన్నులు.. కేంద్ర ఖజానాలోకి రూ. 4.55లక్షల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.