ETV Bharat / business

కరోనా ధాటికి పేదలైన 23 కోట్ల మంది భారతీయులు

author img

By

Published : May 6, 2021, 6:18 PM IST

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావానికి 23 కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారుకున్నారని అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం వెల్లడించింది. గతేడాది లాక్​డౌన్​ కారణంగా 10 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని పేర్కొంది. ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించింది.

azim premji university report on pandemic, అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం నివేదిక
కరోనా మహమ్మారి

గత ఏడాది కాలంలో కరోనా మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకున్నారని అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రేటు​ 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో​ 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 'స్టేట్​ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 - వన్​ ఇయర్​ ఆఫ్​ కొవిడ్​ 19' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు. ​

"మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది జాతీయ కనీస వేతన పరిమితి పరిధి కన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మంది పేదలు తమ ఆదాయాన్ని కోల్పోయారు. ఇందుకు భిన్నంగా సంపన్నులు.. మహమ్మారి ముందు కన్నా తక్కువ నష్టపోయారు."

-అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం నివేదిక

ఉపాధికి గండి..

గతేడాది ఏప్రిల్​-మే మధ్య విధించిన లాక్​డౌన్​ కారణంగా 10 కోట్లమంది ఉపాధి కోల్పోయారని నివేదిక పేర్కొంది. జూన్​ నాటికి పలువురికి ఉపాధి లభించినా, ఏడాది చివరి నాటికి 1.5 కోట్ల మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారని తెలిపింది. నెలకు సగటు కుటుంబ ఆదాయం జనవరిలో రూ.5,989 ఉండగా.. అక్టోబరు నాటికి రూ.4,979కు చేరిందని వెల్లడించింది. 'కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఉపాధి నష్టం జరిగింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ రాష్ట్రాల్లో ఈ విషయంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి' అని పేర్కొంది.

"గతేడాది ఏర్పరిచిన నష్టాన్ని తీర్చడానికి, రెండో దశ విజృంభిస్తున్నందుకు గానూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. జూన్​ తర్వాత కూడా ఉచిత రేషన్​ కొనసాగింపు, ఉపాధి హామీ పథకం విస్తరణ, పట్టణ ఉపాధి కార్యక్రమాలు వంటివి చేపట్టాలి."

-అమిత్​ బసోలే, నివేదిక ప్రధాన రూపకర్త

47 శాతం మంది మహిళలకు నష్టం..

మహమ్మారి కారణంగా 47 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని, కేవలం 19 శాతం మందే ఉద్యోగం కొనసాగించారని నివేదిక వెల్లడించింది. నష్టపోయిన మహిళలు ఏడాది చివరి నాటికి కూడా తిరిగి ఉపాధిలో చేరలేదని తెలిపింది. గతేడాది లాక్​డౌన్​, ఆ తర్వాత.. 61 శాతం మంది పురుషులు ఉద్యోగం కొనసాగించారని, ఉపాధి కోల్పోయిన 7 శాతం మంది ఇంకా ఉద్యోగంలో చేరలేదని పేర్కొంది.

యువతపైనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించిందని నివేదిక పేర్కొంది. ఉపాధి కోల్పోయిన 15-24 ఏళ్ల యువతలో 33 శాతం మంది డిసెంబరు నాటికి కూడా తిరిగి ఉపాధి సంపాదించలేకపోయారని తెలిపింది. 25-44 ఏళ్ల మధ్య వారిలో ఈ సంఖ్య 6 శాతంగా ఉందని తెలిపింది.

ఇదీ చదవండి : గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు!

గత ఏడాది కాలంలో కరోనా మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకున్నారని అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం రేటు​ 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో​ 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 'స్టేట్​ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 - వన్​ ఇయర్​ ఆఫ్​ కొవిడ్​ 19' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు. ​

"మహమ్మారి కారణంగా 23 కోట్ల మంది జాతీయ కనీస వేతన పరిమితి పరిధి కన్నా తక్కువ వేతనాలు అందుకుంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో 20 శాతం మంది పేదలు తమ ఆదాయాన్ని కోల్పోయారు. ఇందుకు భిన్నంగా సంపన్నులు.. మహమ్మారి ముందు కన్నా తక్కువ నష్టపోయారు."

-అజీమ్​ ప్రేమ్​జీ విశ్వవిద్యాలయం నివేదిక

ఉపాధికి గండి..

గతేడాది ఏప్రిల్​-మే మధ్య విధించిన లాక్​డౌన్​ కారణంగా 10 కోట్లమంది ఉపాధి కోల్పోయారని నివేదిక పేర్కొంది. జూన్​ నాటికి పలువురికి ఉపాధి లభించినా, ఏడాది చివరి నాటికి 1.5 కోట్ల మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారని తెలిపింది. నెలకు సగటు కుటుంబ ఆదాయం జనవరిలో రూ.5,989 ఉండగా.. అక్టోబరు నాటికి రూ.4,979కు చేరిందని వెల్లడించింది. 'కరోనా కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ ఉపాధి నష్టం జరిగింది. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీ రాష్ట్రాల్లో ఈ విషయంలో తీవ్రంగా ప్రభావితమయ్యాయి' అని పేర్కొంది.

"గతేడాది ఏర్పరిచిన నష్టాన్ని తీర్చడానికి, రెండో దశ విజృంభిస్తున్నందుకు గానూ ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. జూన్​ తర్వాత కూడా ఉచిత రేషన్​ కొనసాగింపు, ఉపాధి హామీ పథకం విస్తరణ, పట్టణ ఉపాధి కార్యక్రమాలు వంటివి చేపట్టాలి."

-అమిత్​ బసోలే, నివేదిక ప్రధాన రూపకర్త

47 శాతం మంది మహిళలకు నష్టం..

మహమ్మారి కారణంగా 47 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉపాధి కోల్పోయారని, కేవలం 19 శాతం మందే ఉద్యోగం కొనసాగించారని నివేదిక వెల్లడించింది. నష్టపోయిన మహిళలు ఏడాది చివరి నాటికి కూడా తిరిగి ఉపాధిలో చేరలేదని తెలిపింది. గతేడాది లాక్​డౌన్​, ఆ తర్వాత.. 61 శాతం మంది పురుషులు ఉద్యోగం కొనసాగించారని, ఉపాధి కోల్పోయిన 7 శాతం మంది ఇంకా ఉద్యోగంలో చేరలేదని పేర్కొంది.

యువతపైనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపించిందని నివేదిక పేర్కొంది. ఉపాధి కోల్పోయిన 15-24 ఏళ్ల యువతలో 33 శాతం మంది డిసెంబరు నాటికి కూడా తిరిగి ఉపాధి సంపాదించలేకపోయారని తెలిపింది. 25-44 ఏళ్ల మధ్య వారిలో ఈ సంఖ్య 6 శాతంగా ఉందని తెలిపింది.

ఇదీ చదవండి : గూగుల్​ 'హైబ్రిడ్​ వర్క్​ వీక్'​- 3 రోజులే ఆఫీస్​కు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.