ETV Bharat / briefs

సంతోష్​కు ఓ న్యాయం నిర్వాసితులకు మరో న్యాయమా? - revanthreddy-on-kcr

"కొండపోచమ్మ రిజర్వాయర్​ భూనిర్వాసితులకు  సరైన న్యాయం చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్... తన బంధువైన రాజ్యసభ సభ్యుడు సంతోష్​రావుకు మాత్రం 250 గజాల ఇంటి స్థలాన్ని ఎలా ఇచ్చాడు. మీ బంధువులకు వర్తించిన చట్టం... నిరుపేదలకు వర్తించదా...?"---- రేవంత్​రెడ్డి, టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​

ప్రభుత్వంపై ఆగ్రహం
author img

By

Published : May 15, 2019, 9:08 PM IST

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఆయన కుమార్తెను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. దీక్షను భగ్నం చేసి దాడులకు పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్​ భునిర్వాసితులుగా ఉన్నవారికి సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముంపు గ్రామాల బాధితులకు మద్దతుగా నిలిచిన నర్సారెడ్డిని ఆయన కూతురిని పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం హేయమన్నారు. భూనిర్వాసితులకు న్యాయం చేయని కేసీఆర్ తన బంధువైన రాజ్యసభ సభ్యుడు సంతోష్​కు 250 గజాల పట్టా భూమిని ఎలా కేటాయిస్తారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని ఆయన కుమార్తెను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. దీక్షను భగ్నం చేసి దాడులకు పాల్పడితే సహించేది లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్​ భునిర్వాసితులుగా ఉన్నవారికి సరైన న్యాయం చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ముంపు గ్రామాల బాధితులకు మద్దతుగా నిలిచిన నర్సారెడ్డిని ఆయన కూతురిని పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం హేయమన్నారు. భూనిర్వాసితులకు న్యాయం చేయని కేసీఆర్ తన బంధువైన రాజ్యసభ సభ్యుడు సంతోష్​కు 250 గజాల పట్టా భూమిని ఎలా కేటాయిస్తారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు.

ప్రభుత్వంపై ఆగ్రహం

ఇవీ చూడండి: డ్రగ్​ కేసులో సినీతారలకు క్లీన్​చిట్​ ఇవ్వలేదు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.