ETV Bharat / briefs

బాత్​రూంలో తప్పిపోయిన ఐదేళ్ల పాప

ఓ చిన్నారి శనివారం నుంచి కనబడకుండా పోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెతికినా జాడ దొరకలేదు. కిడ్నాప్ చేశారేమోనని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిగ్గా ఐదు రోజులకు ఇంటి పక్కనే పాప ఆచూకి దొరికింది. ఇంతకీ ఆ పాప ఇన్ని రోజులు ఎక్కడుందో తెలుసా?

author img

By

Published : Apr 25, 2019, 12:20 PM IST

Updated : Apr 25, 2019, 3:00 PM IST

ఐదురోజులుగా బాత్​రూమ్​లో ఉన్న పాప

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన సురేశ్​, మహాదేవమ్మ దంపతుల కూతురు అఖిల..గత శనివారం ఉదయం నుంచి పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, పట్టణం మొత్తం గాలించినా... ప్రయోజనం శూన్యం. పక్క గ్రామాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిందేమోననే అనుమానంతో వారిని సంప్రదించినా నిరాశే మిగిలింది. చేసేదేమి లేక పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు.

బాత్​రూంలో ఐదు రోజులు..

ఐదురోజులుగా కనిపించకుండా పోయిన అఖిల..బుధవారం దొరికింది. శనివారం చిన్నారి చాక్లెట్ల కోసం కిరాణ దుకాణానికి వెళ్ళింది. చాక్లెట్లు తీసుకొని ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాసరావు ఇంటిపైకి ఎక్కింది. వెలుతురు కోసం వేసిన ప్లాస్టిక్ రేకుపై కాలు పెట్టింది. ప్రమాద వశాత్తు బాత్​రూంలో పడిపోయింది.

నీళ్లు తాగి బతికిన చిన్నారి

శ్రీనివాసరావు ఊరెళ్లడం వల్ల ఆ పాపను ఎవరు గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి యజమాని తిరిగి ఇంటికి రాగా.. పాపను చూసి షాకయ్యాడు. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అనారోగ్యంతో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఐదురోజుల పాటు ఆ పాప తిండిలేక అలమటించింది. నీళ్లు తాగి బతికింది. పాప ఆచూకీ దొరికిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.

ఐదురోజులుగా బాత్​రూమ్​లో ఉన్న పాప

ఇవీ చూడండి: వన్యప్రాణుల్ని కాపాడుకుందాం...!

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన సురేశ్​, మహాదేవమ్మ దంపతుల కూతురు అఖిల..గత శనివారం ఉదయం నుంచి పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, పట్టణం మొత్తం గాలించినా... ప్రయోజనం శూన్యం. పక్క గ్రామాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిందేమోననే అనుమానంతో వారిని సంప్రదించినా నిరాశే మిగిలింది. చేసేదేమి లేక పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించినా.. ఎలాంటి ఆచూకీ దొరకలేదు.

బాత్​రూంలో ఐదు రోజులు..

ఐదురోజులుగా కనిపించకుండా పోయిన అఖిల..బుధవారం దొరికింది. శనివారం చిన్నారి చాక్లెట్ల కోసం కిరాణ దుకాణానికి వెళ్ళింది. చాక్లెట్లు తీసుకొని ఇంటి పక్కనే ఉన్న శ్రీనివాసరావు ఇంటిపైకి ఎక్కింది. వెలుతురు కోసం వేసిన ప్లాస్టిక్ రేకుపై కాలు పెట్టింది. ప్రమాద వశాత్తు బాత్​రూంలో పడిపోయింది.

నీళ్లు తాగి బతికిన చిన్నారి

శ్రీనివాసరావు ఊరెళ్లడం వల్ల ఆ పాపను ఎవరు గుర్తించలేకపోయారు. బుధవారం రాత్రి యజమాని తిరిగి ఇంటికి రాగా.. పాపను చూసి షాకయ్యాడు. చిన్నారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అనారోగ్యంతో ఉన్న పాపను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఐదురోజుల పాటు ఆ పాప తిండిలేక అలమటించింది. నీళ్లు తాగి బతికింది. పాప ఆచూకీ దొరికిందని చిన్నారి తల్లిదండ్రులు సంతోషంలో మునిగిపోయారు.

ఐదురోజులుగా బాత్​రూమ్​లో ఉన్న పాప

ఇవీ చూడండి: వన్యప్రాణుల్ని కాపాడుకుందాం...!

Intro:Tg_mbnr_06_25_papa_Aachuki_avb_C12
చిన్నారి అఖిల అదృశ్యం ఐదు రోజుల తర్వాత చిన్నారి జాడ తెలుసుకున్న తల్లిదండ్రులు.


Body:నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలో లో యాదవ నగర్ కాలానికి చెందిన సురేష్ మహాదేవ్ అమ్మ అ దంపతుల కూతురు అఖిల శనివారం ఉదయం 6 గంటలకు నుండి కనిపించలేదు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల పిల్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు పట్టణంలోని ప్రధాన కూడలిలో కూడా ఎంత వెతికినా కనపడలేదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బంధువులకు సంప్రదించగా ఎలాంటి సమాచారం రాలేదు పట్టణంలోని పోలీసు శాఖ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో వెతకగా ఎలాంటి ఆచూకి దొరకలేదు దీంతో పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు అయినా ఆచూకి దొరకలేదు కానీ ఐదు రోజులుగా కనిపించకుండాపోయిన అఖిల బుధవారం దొరికింది వివరాల్లోకి వెళితే చిన్నారి అఖిల చాక్లెట్ల కోసం అని కిరాణా దుకాణం కి వెళ్ళింది చాక్లెట్లు తీసుకొని ఇంటి పక్కనే ఉన్నా శ్రీనివాస రావు ఇంటిపైకి ఎక్కింది అక్కడ వెలుతురు కోసం వేసిన ప్లాస్టిక్ రేకుపై కాల్ పెట్టడంతో ఇంట్లోని స్నానాలు గది లోకి పడిపోయింది ఇంటి యజమాని వేసవి సెలవులుకు వేరే గ్రామంలోని ఇంటికి వెళ్లడంతో ఐదు రోజులుగా అక్కడే ఉంది బుధవారం రాత్రి తిరిగి యజమాని ఇంటికి రావడంతో పాప ఆచూకీ కనిపించింది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇంట్లో పడిన చిన్నారి అఖిల కు ఎలాంటి ఆహారం లేకపోవడంతో ఐదు రోజులుగా ప్లాస్టిక్ బిందె లోని నీళ్ళు తాగింది.కాగా పాప ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులకు ప్రాణం లేచి వచ్చింది.


Conclusion:బైట్స్
1) చిన్నారి తండ్రి సురేష్
2) పక్కింట్లో జారిపడిన ఇంటి యజమాని శ్రీనివాస్.
Last Updated : Apr 25, 2019, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.