ఈ నెల 27 నుంచి జులై 6 వరకు జరగనున్న 'మహారాజ రంజిత్ సింగ్' వర్ధంతి నేపథ్యంలో 463 మంది భారత సిక్కు యాత్రికులకు వీసాలు మంజూరు చేసింది పాకిస్థాన్. భారత్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న సిక్కులకు వీసాలు జారీ చేసినట్టు పాక్ హై కమిషన్ వెల్లడించింది.
జూన్ 14-23 మధ్య 'గురు అర్జున్ దేవ్ జీ' బలిదాన దినాన్ని పురస్కరించుకొని సిక్కు యాత్రికులకు వీసాలు ఇచ్చింది పాక్.
పుణ్యక్షేత్రాల సందర్శనల కోసం 1974లో భారత్-పాక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కారణంగా ప్రతి ఏటా వేలాది మంది భారత యాత్రికులు పాకిస్థాన్లో జరిగే మతపరమైన ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.
ఇదీ చూడండి: 'గంగా ప్రక్షాళనకు రూ. 28 వేల కోట్లు మంజూరు'