ETV Bharat / briefs

ఫెడరల్​ ఫ్రంట్​ భవితవ్యమేంటి...?

author img

By

Published : May 23, 2019, 11:44 PM IST

Updated : May 23, 2019, 11:55 PM IST

సారు.. కారు.. పదహారు.. దిల్లీలో సర్కారు అనే నినాదంతో లోక్​సభ బరిలోకి దిగిన తెరాసకు ప్రజలు షాక్​ ఇచ్చారు. 16 స్థానాలు గెలిచి కేంద్రంలో కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉన్న ఆ పార్టీని 9 స్థానాలకే పరిమితం చేశారు. రాష్ట్రాలు తిరిగి ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి సమాఖ్య కూటమి కట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన కేసీఆర్​ వ్యూహం అంతిమంగా ఫలించలేదు.

ఫెడరల్​ ఫ్రంట్​పై కేసీఆర్​ వ్యూహం

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి.. విపక్షాలను కోలుకోలేని దెబ్బతీసిన గులాబీ దళపతి కేసీఆర్​... దిల్లీ పీఠం దిశగా వేగంగా పావులు కదిపారు. ఎన్నికలకు ముందే యూపీఏ, ఎన్​డీఏకు ప్రత్యామ్నాయంగా దేశ ప్రగతి కోసం... గుణాత్మక మార్పు కోసమంటూ ఫెడరల్ ఫ్రంట్​కు తెర తీశారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా దిల్లీ కోటపై జెండా ఎగరవేసిన చరిత్ర ఏ జాతీయ పార్టీకీ లేదనే అంశాన్ని కేసీఆర్​ బలంగా వినిపించారు. ఇప్పటికీ దేశంలో విద్యుత్​, నీళ్లు లేని పల్లెలు ఉన్నాయంటే గత పాలకులైన కాంగ్రెస్​, భాజపా పాపమేనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కేవలం 9 స్థానాలతో సాధ్యమా...?

16 స్థానాల్లో గెలిచి దిల్లీలో కీలక పాత్ర పోషించాలన్న కేసీఆర్​ ఆశలపై తెలంగాణ ప్రజలు నీళ్లు చల్లారు. కేవలం 9 స్థానాలకే పరిమితం చేశారు. కేంద్రంలో భాజపా మ్యాజిక్​ ఫిగర్​కు సమీపంలో నిలిచిపోతుందని... కాంగ్రెస్​ గతం కంటే స్వల్పంగా మెరుగవుతుందని కేసీఆర్​ అంచనా వేశారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేశారు.

తారుమారైన అంచనాలు

కాంగ్రెస్​ విషయంలో కేసీఆర్​ అంచనాలు నిజమైనప్పటికీ భాజపా విషయంలో తారుమారయ్యాయి. స్పష్టమైన ఆధిక్యతతో భాజపా మరోమారు ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్​ ఊహించి... కార్యాచరణలోకి తెచ్చిన ఫెడరల్​ ఫ్రంట్​ ఆచరణ రూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. గుణాత్మక మార్పు నినాదానికి ఆదరణ లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ ఫెడరల్​ ప్రంట్​పై ఇప్పుడు గులాబీ దళపతి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. తనతో కలిసొచ్చే నేతలతో జాతీయ స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తారా... లేక రాష్ట్రానికే పరిమితం అవుతారా... అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి : అవకాశం అంతంతమాత్రమే... గెలుపూ అత్తెసరే...!

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి.. విపక్షాలను కోలుకోలేని దెబ్బతీసిన గులాబీ దళపతి కేసీఆర్​... దిల్లీ పీఠం దిశగా వేగంగా పావులు కదిపారు. ఎన్నికలకు ముందే యూపీఏ, ఎన్​డీఏకు ప్రత్యామ్నాయంగా దేశ ప్రగతి కోసం... గుణాత్మక మార్పు కోసమంటూ ఫెడరల్ ఫ్రంట్​కు తెర తీశారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా దిల్లీ కోటపై జెండా ఎగరవేసిన చరిత్ర ఏ జాతీయ పార్టీకీ లేదనే అంశాన్ని కేసీఆర్​ బలంగా వినిపించారు. ఇప్పటికీ దేశంలో విద్యుత్​, నీళ్లు లేని పల్లెలు ఉన్నాయంటే గత పాలకులైన కాంగ్రెస్​, భాజపా పాపమేనని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

కేవలం 9 స్థానాలతో సాధ్యమా...?

16 స్థానాల్లో గెలిచి దిల్లీలో కీలక పాత్ర పోషించాలన్న కేసీఆర్​ ఆశలపై తెలంగాణ ప్రజలు నీళ్లు చల్లారు. కేవలం 9 స్థానాలకే పరిమితం చేశారు. కేంద్రంలో భాజపా మ్యాజిక్​ ఫిగర్​కు సమీపంలో నిలిచిపోతుందని... కాంగ్రెస్​ గతం కంటే స్వల్పంగా మెరుగవుతుందని కేసీఆర్​ అంచనా వేశారు. అందుకోసమే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడిన సమూహాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేశారు.

తారుమారైన అంచనాలు

కాంగ్రెస్​ విషయంలో కేసీఆర్​ అంచనాలు నిజమైనప్పటికీ భాజపా విషయంలో తారుమారయ్యాయి. స్పష్టమైన ఆధిక్యతతో భాజపా మరోమారు ప్రభుత్వాన్ని నెలకొల్పబోతున్నది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్​ ఊహించి... కార్యాచరణలోకి తెచ్చిన ఫెడరల్​ ఫ్రంట్​ ఆచరణ రూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు. గుణాత్మక మార్పు నినాదానికి ఆదరణ లేదని చెప్పవచ్చు. అయినప్పటికీ ఫెడరల్​ ప్రంట్​పై ఇప్పుడు గులాబీ దళపతి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. తనతో కలిసొచ్చే నేతలతో జాతీయ స్థాయిలో అవగాహనతో కలిసి పని చేస్తారా... లేక రాష్ట్రానికే పరిమితం అవుతారా... అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి : అవకాశం అంతంతమాత్రమే... గెలుపూ అత్తెసరే...!

Intro:tg_wgl_37_23_bjp_naayakula_samburaalu_ab_g2
controbutor_akbar_wardhannapeta_division
9989964722
( )వరంగల్ గ్రామీణ జిల్లాలో భాజపా నాయకులు సంబురాలు జరుపుకున్నారు. కేంద్రంలో అత్యధిక స్థానాలు సాధించడం తో పాటు రాష్ట్రంలో నాలుగు ఎంపీ స్థానాలు రావడంతో భాజాపా నాయకుల్లో ఆనందం నెలకొంది. వరంగల్ గ్రామీణ జిల్లాలోని రాయపర్తి, తీర్మాలయపల్లి, కొండూరు గ్రామాల్లో టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసుకొని సంబురాలు చేసుకున్నారు. అధిక సంఖ్యలో రహదారుల పైకి చేరుకున్న భాజపా కార్యకర్తలు జై భాజపా అంటూ నినాదాలు చేశారు. టపాసుల మోతలు మారుమోగాయి. ప్రధాని నరేంద్రమోడీ చేసిన అభివృద్దే మరోమారు గెలిపించిందన్నారు. మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాజాపా రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాసరెడ్డి, జిల్లా నాయకులు కన్నెకంటి కృష్ణారెడ్డి, వాణి, అనిల్, శ్రవణ్, మహేందర్ పాల్గొన్నారు.
01 కర్ర శ్రీనివాసరెడ్డి, భాజపా, రాష్ట్ర నాయకుడు.


Body:s


Conclusion:ss
Last Updated : May 23, 2019, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.