ETV Bharat / briefs

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి - విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి వద్ద విద్యాదాఘాతంతో హమన్​మీరాపూర్​కు చెందిన లారీ డ్రైవర్​ అక్కడికక్కడే మృతిచెందాడు. అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే యాదాగౌడ్ మృతికి కారణమని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి
author img

By

Published : May 19, 2019, 11:41 AM IST

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి సమీపంలో విద్యుదాఘాతంతో ఓ లారీ డ్రైవర్​ మరణించాడు. దుబ్బాక మండలం హమన్​మీరాపూర్​ గ్రామానికి చెందిన యాదాగౌడ్​... ఓ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్​ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. శనివారం రావురూకుల నుంచి చిన్నగుండవెళ్లి వెళ్లే మార్గమధ్యంలో రహదారి పనుల కోసం ట్యాంకర్​లోకి నీటిని నింపాడు. అనంతరం ట్యాంకర్​ను వెనక్కి తిప్పే ప్రయత్నంలో వాహనం 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి టైర్లు అంటుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్​కు విద్యుత్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

యాదాగౌడ్​ మృతికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించారు. ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ప్రశాంతంగా 'సార్వత్రికం' తుది దశ పోలింగ్

విద్యుదాఘాతంతో లారీ డ్రైవర్​ మృతి

సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి సమీపంలో విద్యుదాఘాతంతో ఓ లారీ డ్రైవర్​ మరణించాడు. దుబ్బాక మండలం హమన్​మీరాపూర్​ గ్రామానికి చెందిన యాదాగౌడ్​... ఓ రహదారి నిర్మాణ కాంట్రాక్టర్​ వద్ద డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. శనివారం రావురూకుల నుంచి చిన్నగుండవెళ్లి వెళ్లే మార్గమధ్యంలో రహదారి పనుల కోసం ట్యాంకర్​లోకి నీటిని నింపాడు. అనంతరం ట్యాంకర్​ను వెనక్కి తిప్పే ప్రయత్నంలో వాహనం 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి టైర్లు అంటుకున్నాయి. మంటలు ఆర్పే ప్రయత్నంలో డ్రైవర్​కు విద్యుత్​ షాక్​ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

యాదాగౌడ్​ మృతికి అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపించారు. ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ప్రశాంతంగా 'సార్వత్రికం' తుది దశ పోలింగ్

Intro:ఆలయ భూముల


Body:రాష్ట్రంలోని వివిధ దేవాలయ భూముల్లో అక్రమాలకు పాల్పడి దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆ క్రమంలో తొలగించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా వివిధ ప్రదేశాలలో ఉన్న దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది భద్రాచలంలోని భద్రాద్రి రామయ్య భూములను దీంతోపాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ కుసుమ హరనాథ్ బాబా ఆలయ భూములను ఆక్రమించిన వారిపై ప్రత్యేక చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఆక్రమణకు గురైన భూముల్లో బోర్డులను భూములను ఖాళీ చేసి దేవాదాయ శాఖకు అప్పగించాలని నోటీసులు జారీ చేస్తున్నారు భద్రాచలంలోని ఆక్రమణకు గురైన భద్రాద్రి రామయ్య భూములను భూములను ఆక్రమించి వారి పై అధికారులు నోటీసులు జారీ చేశారు త్వరలో ఖాళీ చేయాలని ఆదేశించారు లేనియెడల భూములకు ప్రస్తుతం నిర్ణయించిఉన్న ధరను ఆలయం కు చెల్లించి ఆలయం నుంచి పత్రాలను పొందాలని తెలుపుతున్నారు ఎన్నో ఏళ్లుగా ఆక్రమించిన భూములను తొలగించి స్వామి వారికి ఆదాయం రాబట్టేందుకు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు ఇందులో భాగంగా భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్వర్యంలో ఉన్న పురుషోత్తపట్టణం లోని భూములను కుసుమ హరనాథ బాబా ఆలయ ఆధ్వర్యంలో ఉన్న భద్రాచలంలోని రాజీవ్ నగర్ కాలనీ ఏరియా లో బోర్డులను ఏర్పాటు చేశారు ఆక్రమణదారులు అంతా ఆలయ అధికారులతో చర్చలు జరిపి ఆలయానికి రావలసిన ఆదాయాన్ని కట్టినట్లయితే భూములను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు లేనియెడల ఆక్రమణకు గురైన భూమిలో ఉన్న ఇళ్ళను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.బైట్01 వేణుగోపాల్ గుప్తా శ్రీ కుసుమ హరనాథ్ బాబా ఆలయ ఈవో, బైట్02, ప్రవీణ్ జిల్లా ఆలయ అధికారి


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.